తెలంగాణలో సగం మంది ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్‌

స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) తెలుగు, హిందీ, ఉర్దూ ఉపాధ్యాయులతోపాటు ఫిజికల్‌ డైరెక్టర్‌(పీడీ)ల బదిలీలకు బ్రేక్‌ పడింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది ఉపాధ్యాయుల బదిలీ జరగాల్సి ఉండగా సగం వరకు నిలిచిపోయాయి.

Published : 03 Oct 2023 05:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) తెలుగు, హిందీ, ఉర్దూ ఉపాధ్యాయులతోపాటు ఫిజికల్‌ డైరెక్టర్‌(పీడీ)ల బదిలీలకు బ్రేక్‌ పడింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది ఉపాధ్యాయుల బదిలీ జరగాల్సి ఉండగా సగం వరకు నిలిచిపోయాయి. భాషా పండితులు, పీడీ పోస్టుల ఉన్నతీకరణ, పదోన్నతులను ఎస్జీటీలను కలుపుకొని ఉమ్మడి సీనియారిటీ ఆధారంగా చేపట్టాలని ఇటీవల హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో బదిలీలు జరిగితే మారుమూల గ్రామాల్లో టీచర్లు ఉండరని కొందరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో అధికారులు వాటిని నిలిపివేయాలని, మిగిలిన ఎస్‌ఏలకు సోమవారం రాత్రి బదిలీ ఉత్తర్వులు ఇవ్వాలని డీఈఓలను పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు ఆదేశించారు. పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రిలీవ్‌ చేయవద్దని, ఇద్దరున్నచోట సీనియర్‌ను బదిలీపై పంపి జూనియర్‌ను అక్కడే కొనసాగించాలని సూచించారు. తమకు బదిలీ అయితే దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందన్న ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లాకు చెందిన కొందరు ఉపాధ్యాయులు ఈ ప్రక్రియ నిలిపేసేలా చక్రం తిప్పినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు