‘డబ్బు’ కట్టడి... ‘బోగస్’పై దృష్టి!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో తొలి ఘట్టానికి మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం తెర తీయనుంది. తెలంగాణతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాలకు ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది.
నేటి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం మూడు రోజులు పర్యటన
ఎన్నికల సన్నద్ధతపై విస్తృత స్థాయి సమీక్షలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో తొలి ఘట్టానికి మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం తెర తీయనుంది. తెలంగాణతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాలకు ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆయా రాష్ట్రాల పర్యటనల్లో భాగంగా ఎన్నికల సంఘం మంగళవారం నుంచి గురువారం వరకు తెలంగాణలో పర్యటించనుంది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర యంత్రాంగం సన్నద్ధతను నిర్ధారించుకోనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్ ఆధ్వర్యంలో 17 మందితో కూడిన ఉన్నతస్థాయి బృందం... రాష్ట్ర అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో మూడు రోజులపాటు విస్తృతంగా చర్చించనుంది. కొందరు అధికారులు సోమవారమే హైదరాబాద్ చేరుకున్నారు. మరికొందరు మంగళవారం ఉదయం వస్తారు. రాష్ట్రాల్లో పర్యటనలు ముగిశాక దిల్లీలో ఎన్నికల షెడ్యూల్ను ఖరారు చేస్తారు.
రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు
ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం ఈసారి ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో సుమారు రూ.వంద కోట్ల విలువైన నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రానున్న ఎన్నికల్లో ఆ పరిస్థితిని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను ఎన్నికల సంఘం ఇప్పటికే రంగంలోకి దింపింది. అవి భారీగా డబ్బు వెచ్చించే అవకాశమున్న నియోజకవర్గాల గుర్తింపు పనిలో ఉన్నట్లు సమాచారం. డబ్బు నియంత్రణకు ఏజెన్సీలు అమలు చేయనున్న వ్యూహాలపై సవివరంగా సమీక్షించాలని సీఈసీ నిర్ణయించింది.
బోగస్ ఓట్ల తొలగింపుపైనా...: ఓటర్ల జాబితా ప్రక్షాళనకు తీసుకున్న చర్యలపైనా ఎన్నికల సంఘం ప్రత్యేకంగా సమీక్షించనుంది. బోగస్ ఓటర్ల ఏరివేత, ఒకే ఇంటి నంబరుతో పెద్ద సంఖ్యలో ఉన్న ఓటర్లను గుర్తించడంలో అనుసరించిన విధానంపైనా క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని రాబట్టనుంది. ఓట్ల తొలగింపు విషయంలో అధికారులు జారీ చేసిన నోటీసులు అస్తవ్యస్తంగా ఉన్నట్లు సీఈసీకి ఫిర్యాదులు అందాయి. దశాబ్దాలుగా ఒకే ఇంటి నంబరులో నివసిస్తున్న వారికి కూడా మీ ఓటు తొలగించనున్నట్లు నోటీసులు జారీ చేయడం హైదరాబాద్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
ఏమేం చేస్తారంటే...
- మంగళవారం ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనుంది. మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అవుతుంది. సాయంత్రం 5 నుంచి 6.30 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 20 ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల ఉన్నతాధికారులతో ఎన్నికల్లో డబ్బును కట్టడి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్షిస్తుంది. సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి, రాష్ట్ర స్థాయి పోలీసు నోడల్ అధికారి, సీఆర్పీఎఫ్ అధికారులు... ఎన్నికల వ్యవహారాలపై పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇస్తారు.
- బుధవారం ఉదయం 6.30కి దుర్గం చెరువు తీగల వంతెన వద్ద ఓటరు చైతన్యం కోసం సైకిల్థాన్, వాక్థాన్లను ఎన్నికల సంఘం ప్రారంభిస్తుంది. 9.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు 33 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో ఓటర్ల జాబితా, పోలింగు కేంద్రాలు, బందోబస్తుపై జిల్లాల వారీగా సమీక్షిస్తుంది.
- గురువారం ఉదయం 9.15 నుంచి 10 వరకు గచ్చిబౌలిలోని టెక్మహీంద్రా ఆడిటోరియంలో ఏర్పాటు చేయనున్న ఎన్నికల ఎగ్జిబిషన్ను తిలకించి, రాష్ట్ర స్థాయిలో ఓటరు ప్రభావశీలురు, యువ, దివ్యాంగ ఓటర్లను ఎన్నికల అధికారులు కలుస్తారు. ఉదయం 11-12 గంటల వరకు సీఎస్, డీజీపీలతో సమావేశం అవుతుంది. సాయంత్రం తరవాత అధికారుల బృందం దిల్లీ బయలుదేరి వెళుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Special Trains: 10 ప్రత్యేక రైళ్ల పొడిగింపు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 10 ప్రత్యేక రైళ్లను డిసెంబరు ఆఖరివారం వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
Hyderabad: హోటళ్లు తెరచుకోక ఇక్కట్లు
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు.. పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం గురువారం సెలవు దినంగా ప్రకటించింది. -
JEE Mains: జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు
జేఈఈ మెయిన్స్ తొలి విడతకు దరఖాస్తు చేసే గడువును డిసెంబరు 4వ తేదీ (రాత్రి 9 గంటల) వరకు పొడిగించారు. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) సవరించిన కాలపట్టికను వెల్లడించింది. -
TS Elections: పట్నం బద్ధకించింది.. పల్లె ఓటెత్తింది
రాష్ట్రంలో రానున్న అయిదేళ్ల పాలనను వేలికొనలతో నిర్ణయించేందుకు పల్లె ఓటర్లు బారులు తీరగా.. పట్టణాలు, నగరాల్లో పెద్దగా ఆసక్తి చూపలేదు. -
Chandrababu: తిరుపతిలో బాబుకు జన నీరాజనం
తెదేపా అధినేత చంద్రబాబుకు తిరుపతిలో ప్రజలు నీరాజనాలు పలికారు. బెయిల్పై విడుదలైన తర్వాత తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయనకు తెలుగుదేశం, జనసేన శ్రేణులు, ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. -
స్వల్ప ఘర్షణలు.. లాఠీఛార్జి
రాష్ట్రంలో గురువారం శాసనసభ ఎన్నికలు చెదురుమదురు ఘటనలు.. స్వల్ప ఘర్షణలు.. అక్కడక్కడా లాఠీఛార్జి మినహా ప్రశాంతంగా ముగిశాయి. -
సాగర్ ప్రాజెక్టు వద్ద ఘర్షణ
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద బుధవారం అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. రాత్రి 12 గంటల ప్రాంతంలో ఏపీ పోలీసులు భారీగా ప్రాజెక్టు వద్దకు చేరుకొని రక్షణ గేట్లు విరగ్గొట్టి తమపై దాడి చేశారని తెలంగాణ పోలీసులు ఆరోపించారు. -
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో జరిగిన లాంగ్ మారథాన్లో ఎన్నో మలుపుల మధ్య పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించగలిగామని డీజీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. -
వరవరరావు రెండో కంటి చికిత్సకు కోర్టు అనుమతి
ఎల్గార్ పరిషద్ - మావోయిస్టు సంబంధాల కేసు(2018)లో నిందితుడిగా ఉన్న వామపక్ష భావజాల కార్యకర్త వరవరరావు ఎడమ కంటికి కేటరాక్టు చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లేందుకు ముంబయిలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది. -
మాంసం లభ్యతలో తెలంగాణ అగ్రస్థానం
దేశంలో మాంసం లభ్యతలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రాథమిక పశుపోషణ గణాంకాల(బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్) వార్షిక నివేదిక-2023 వెల్లడించింది. -
లాసెట్ తొలి విడతలో 5,912 మందికి సీట్లు
లాసెట్ తొలి విడత కౌన్సెలింగ్ సీట్లను గురువారం కేటాయించారు. మూడేళ్లు, అయిదేళ్ల ఎల్ఎల్బీతో పాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లు మొత్తం 6,894 అందుబాటులో ఉన్నాయి. -
మేం నిరాధార ఆరోపణలు చేయలేదు!
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ కుంగడానికి గల కారణాలను వాస్తవాలను పరిగణనలోకి తీసుకొనే చెప్పామని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ తెలిపింది. -
ఇదీ సంగతి!
-
ఉచిత ఇసుక కేసులో.. చంద్రబాబు బెయిల్పై విచారణ 6కు వాయిదా
గత ప్రభుత్వ హయాంలోని ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం తెదేపా అధినేత చంద్రబాబు హైకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ డిసెంబరు 6కు వాయిదా పడింది. -
12 వరకు చంద్రబాబుపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దు
ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుప్రీంకోర్టులో దాఖలు పిటిషన్పై విచారణ డిసెంబరు 12కు వాయిదా పడింది. -
వలలో చిక్కిన చిరుత మృతి
కోతుల నుంచి పంట రక్షణకు రైతులు ఏర్పాటు చేసుకున్న వలలో చిరుత పులి చిక్కి మృతి చెందింది. -
ఉపకరించిన ఓటరు సమాచార కేంద్రాలు
ఓటరు స్లిప్పులు అందని ఓటర్లకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సమాచార కేంద్రాలు ఉపకరించాయి. రెండు.. అంతకుమించి కేంద్రాలు ఉన్న చోట వాటిని ఏర్పాటు చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
BSF: వీర జవాన్లతో.. పాక్, బంగ్లా సరిహద్దులు సురక్షితం: అమిత్ షా
-
Ambati Rambabu: తెలంగాణలో ఏ పార్టీనీ గెలిపించాల్సిన అవసరం మాకు లేదు: అంబటి
-
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా నాలుగో టీ20.. స్టేడియంకు ‘కరెంట్’ కష్టాలు..!
-
ఆహ్వానం అందక.. అర్ధగంట విమానం డోర్ వద్దే నిల్చున్న అధ్యక్షుడు..!
-
Animal movie review: రివ్యూ: యానిమల్.. రణ్బీర్-సందీప్ వంగా యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
Vladimir Putin: ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. రష్యన్ మహిళలకు పుతిన్ విజ్ఞప్తి