ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు: కేటీఆర్
రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికీ దళితబంధు పథకం ఇస్తామని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఈనాడు, హైదరాబాద్ - న్యూస్టుడే, ఖైరతాబాద్, సూర్యాపేట: రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికీ దళితబంధు పథకం ఇస్తామని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. సోమవారం గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర సచివాలయం సమీపంలోని 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం వద్ద జలమండలి ఆధ్వర్యంలో దళిత డ్రైవర్లకు మురుగు వ్యర్థ రవాణా వాహనాలను అందజేశారు. దేశంలోనే తొలిసారిగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని, స్వాంతంత్య్రం వచ్చిన తర్వాత ఏ పాలకులూ దళితుల బాగు కోసం ఇంతలా ఆలోచించలేదన్నారు. దళితులు ఆత్మగౌరవంతో జీవించాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ దీనికి శ్రీకారం చుట్టారని, ఈ పథకం కింద రూ.10 లక్షలు పొందిన కుటుంబాలన్నీ ఆర్థికంగా ఎదుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 76 వేల దళిత కుటుంబాలుండగా 9వేల కుటుంబాలకు మాత్రమే పథకం అందిందని, మిగిలిన వారికీ దశలవారీగా అందజేస్తామన్నారు. మురుగు వ్యర్థాల రవాణాకు జలమండలి అధికారులు రూపొందించిన వాహనాలు కొత్త ప్రయోగమని, తరలించేటప్పుడు రోడ్లపై వ్యర్థాలు పడబోవని వివరించారు. డ్రైవర్కు ఇద్దరు సహాయకులుంటారని, వీరికి ఏకరూప దుస్తులు, శిరస్త్రాణంతోపాటు రూ.3 వేల విలువైన భద్రత పరికరాలను జలమండలి ఇస్తోందని వివరించారు. వాహనాల నిర్వహణకు ఏటా రూ.23.33 కోట్లు ఖర్చు చేయనున్నామని తెలిపారు.
నాలుగు జిల్లాల లబ్ధిదారులు... 162 వాహనాలు
మురుగునీటి వ్యర్థాల రవాణా (సిల్ట్ కార్టింగ్) వాహనాల కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 162 మంది డ్రైవర్లను దళితబంధు కింద ఎంపిక చేశారు. మ్యాన్హోళ్లను శుభ్రం చేసినప్పుడు వ్యర్థాలను ఇకపై రోడ్డుపైనే వదిలేయకుండా ఈ వాహనాల్లో తరలిస్తారు. చెత్త, మురుగు వ్యర్థాలను తొలగించి, తరలించేందుకు నెలకు అద్దె ఛార్జీలు, కార్మికుల జీతం, నిర్వహణ ఖర్చులను జలమండలి చెల్లిస్తుంది. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, ముఠాగోపాల్, కాలేరు వెంకటేశ్, పాషాఖాద్రీ, ప్రకాశ్గౌడ్, బేతి సుభాష్రెడ్డి, ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్, ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా, ఉపమేయర్ మోతె శ్రీలత, బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్, కార్పొరేటర్ విజయారెడ్డి, జలమండలి ఎండీ దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశాన్ని ప్రారంభించేముందు మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు మంత్రులు పుష్పాంజలి ఘటించారు.
సూర్యాపేటలో ఐటీటవర్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సభ ముగిసిన అనంతరం... మంత్రి కేటీఆర్ ఆరుగురు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లను, 18 మందికి దళితబంధు పథకం చెక్కులను అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Special Trains: 10 ప్రత్యేక రైళ్ల పొడిగింపు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 10 ప్రత్యేక రైళ్లను డిసెంబరు ఆఖరివారం వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
Hyderabad: హోటళ్లు తెరచుకోక ఇక్కట్లు
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు.. పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం గురువారం సెలవు దినంగా ప్రకటించింది. -
JEE Mains: జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు
జేఈఈ మెయిన్స్ తొలి విడతకు దరఖాస్తు చేసే గడువును డిసెంబరు 4వ తేదీ (రాత్రి 9 గంటల) వరకు పొడిగించారు. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) సవరించిన కాలపట్టికను వెల్లడించింది. -
TS Elections: పట్నం బద్ధకించింది.. పల్లె ఓటెత్తింది
రాష్ట్రంలో రానున్న అయిదేళ్ల పాలనను వేలికొనలతో నిర్ణయించేందుకు పల్లె ఓటర్లు బారులు తీరగా.. పట్టణాలు, నగరాల్లో పెద్దగా ఆసక్తి చూపలేదు. -
Chandrababu: తిరుపతిలో బాబుకు జన నీరాజనం
తెదేపా అధినేత చంద్రబాబుకు తిరుపతిలో ప్రజలు నీరాజనాలు పలికారు. బెయిల్పై విడుదలైన తర్వాత తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయనకు తెలుగుదేశం, జనసేన శ్రేణులు, ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. -
స్వల్ప ఘర్షణలు.. లాఠీఛార్జి
రాష్ట్రంలో గురువారం శాసనసభ ఎన్నికలు చెదురుమదురు ఘటనలు.. స్వల్ప ఘర్షణలు.. అక్కడక్కడా లాఠీఛార్జి మినహా ప్రశాంతంగా ముగిశాయి. -
సాగర్ ప్రాజెక్టు వద్ద ఘర్షణ
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద బుధవారం అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. రాత్రి 12 గంటల ప్రాంతంలో ఏపీ పోలీసులు భారీగా ప్రాజెక్టు వద్దకు చేరుకొని రక్షణ గేట్లు విరగ్గొట్టి తమపై దాడి చేశారని తెలంగాణ పోలీసులు ఆరోపించారు. -
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో జరిగిన లాంగ్ మారథాన్లో ఎన్నో మలుపుల మధ్య పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించగలిగామని డీజీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. -
వరవరరావు రెండో కంటి చికిత్సకు కోర్టు అనుమతి
ఎల్గార్ పరిషద్ - మావోయిస్టు సంబంధాల కేసు(2018)లో నిందితుడిగా ఉన్న వామపక్ష భావజాల కార్యకర్త వరవరరావు ఎడమ కంటికి కేటరాక్టు చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లేందుకు ముంబయిలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది. -
మాంసం లభ్యతలో తెలంగాణ అగ్రస్థానం
దేశంలో మాంసం లభ్యతలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రాథమిక పశుపోషణ గణాంకాల(బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్) వార్షిక నివేదిక-2023 వెల్లడించింది. -
లాసెట్ తొలి విడతలో 5,912 మందికి సీట్లు
లాసెట్ తొలి విడత కౌన్సెలింగ్ సీట్లను గురువారం కేటాయించారు. మూడేళ్లు, అయిదేళ్ల ఎల్ఎల్బీతో పాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లు మొత్తం 6,894 అందుబాటులో ఉన్నాయి. -
మేం నిరాధార ఆరోపణలు చేయలేదు!
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ కుంగడానికి గల కారణాలను వాస్తవాలను పరిగణనలోకి తీసుకొనే చెప్పామని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ తెలిపింది. -
ఇదీ సంగతి!
-
ఉచిత ఇసుక కేసులో.. చంద్రబాబు బెయిల్పై విచారణ 6కు వాయిదా
గత ప్రభుత్వ హయాంలోని ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం తెదేపా అధినేత చంద్రబాబు హైకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ డిసెంబరు 6కు వాయిదా పడింది. -
12 వరకు చంద్రబాబుపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దు
ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుప్రీంకోర్టులో దాఖలు పిటిషన్పై విచారణ డిసెంబరు 12కు వాయిదా పడింది. -
వలలో చిక్కిన చిరుత మృతి
కోతుల నుంచి పంట రక్షణకు రైతులు ఏర్పాటు చేసుకున్న వలలో చిరుత పులి చిక్కి మృతి చెందింది. -
ఉపకరించిన ఓటరు సమాచార కేంద్రాలు
ఓటరు స్లిప్పులు అందని ఓటర్లకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సమాచార కేంద్రాలు ఉపకరించాయి. రెండు.. అంతకుమించి కేంద్రాలు ఉన్న చోట వాటిని ఏర్పాటు చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
Ambati Rambabu: తెలంగాణలో ఏ పార్టీనీ గెలిపించాల్సిన అవసరం మాకు లేదు: అంబటి
-
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా నాలుగో టీ20.. స్టేడియంకు ‘కరెంట్’ కష్టాలు..!
-
ఆహ్వానం అందక.. అర్ధగంట విమానం డోర్ వద్దే నిల్చున్న అధ్యక్షుడు..!
-
Animal movie review: రివ్యూ: యానిమల్.. రణ్బీర్-సందీప్ వంగా యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
Vladimir Putin: ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. రష్యన్ మహిళలకు పుతిన్ విజ్ఞప్తి
-
Jigarthanda Double X: ఓటీటీలోకి ‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!