గాంధీజీ బాటలో పోరాటానికి వెనకాడొద్దు
గాంధీజీ ఎంచుకున్న పోరాట మార్గాలు ఎప్పటికీ ఆచరణీయమేనని ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మురళీధర్ అభిప్రాయపడ్డారు.
మెరుగైన సమాజానికి అది అవశ్యం
‘మంథన్ సంవాద్’ కార్యక్రమంలో జస్టిస్ మురళీధర్
విద్యాస్వేచ్ఛ ప్రమాదంలో పడిందన్న ప్రొఫెసర్ నీరజాగోపాల్
ప్రభుత్వాల జోక్యం తరగతి గది వరకూ వచ్చిందని ఆందోళన
ఈనాడు హైదరాబాద్: గాంధీజీ ఎంచుకున్న పోరాట మార్గాలు ఎప్పటికీ ఆచరణీయమేనని ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మురళీధర్ అభిప్రాయపడ్డారు. మహాత్ముడు చూపిన తెగువ, ధైర్యం, అహింస, సహాయ నిరాకరణ ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి మార్గదర్శకంగా నిలిచాయన్నారు. గాంధీజీ అనుసరించిన మార్గాలైన నిరసన తెలపడం, నిర్భయంగా మాట్లాడటం, అభిప్రాయం చెప్పడం వంటివి ప్రజాస్వామ్యం రూపాంతరం చెందడానికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. నిరసన తెలపడానికి, మాట్లాడటానికి భయపడే వారు గాంధీజీ నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు. మెరుగైన సమాజం కోసం మహాత్ముడు చూపిన మార్గంలో పోరాడటాన్ని ఆపొద్దని పిలుపునిచ్చారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో మంథన్ ఆధ్వర్యంలో జరిగిన ‘మంథన్ సంవాద్’ కార్యక్రమంలో ‘న్యాయవాదిగా గాంధీ’ అనే అంశంపై జస్టిస్ మురళీధర్ ప్రసంగించారు. ‘‘గాంధీజీ ప్రతి అవకాశాన్ని రాజకీయ పోరాటం కోసం వినియోగించారు. ఆ పోరాటంలో కుటుంబపరంగా తీవ్రంగా నష్టపోయినప్పటికీ, ఆయన చేసిన పోరాటం మానవ జాతికి ఎంతగానో ఉపయోగపడింది. ఆయన చూపిన అహింసా పోరాట మార్గం నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్కింగ్, ఆంగ్సాన్ సూకీ.. ఇలా ఎంతో మందికి ఆదర్శప్రాయమైంది. మన దేశంలో ఇరోమ్ షర్మిల పదేళ్లపాటు చేసిన పోరాటం, రైతు ఉద్యమాలు, షహీన్బాగ్ ఆందోళన, స్టాన్ స్వామి మౌనంగా బాధను భరించడం ఇలాంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. గాంధీజీ న్యాయవాదిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా తన ప్రస్థానంలోని ప్రతి అంశాన్ని అక్షరబద్ధం చేశారు. బలహీనతల గురించి చెప్పుకోవడానికీ వెనకాడలేదు. ఈతరం న్యాయవాదులు ఆయన్నుంచి అనేక అంశాలను ఆదర్శంగా తీసుకోవాలి’’ అని సూచించారు.
న్యాయమూర్తులూ సమాజం నుంచి వచ్చిన వారే
న్యాయవ్యవస్థ గతంలో కంటే ఏమీ మారలేదని జస్టిస్ మురళీధర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు వచ్చేది కూడా బార్ నుంచేనని, మొత్తం సమాజంలో వచ్చిన మార్పులో భాగంగానే దీన్నీ చూడాల్సి ఉంటుందన్నారు. బార్ అసోసియేషన్లోనూ ఓ కారణం కోసం నిలబడే న్యాయవాదులున్నారని, హైదరాబాద్లో కేజీ కన్నబిరాన్ ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. ‘ప్రస్తుతం మంచి న్యాయమూర్తులు ఉన్నారు. మంచి న్యాయవాదులూ ఉన్నారు. సమాజానికి కావాల్సింది మాత్రం మొత్తం సమాజంలో మార్పు’ అని వ్యాఖ్యానించారు. ప్రముఖ హిందీ కవి సంపత్ సరాల్ సమకాలీన రాజకీయ, సాంఘిక పరిణామాలపై చలోక్తులు విసురుతూ హాస్యాన్ని పంచారు. ది న్యూస్ మినిట్ ఎడిటర్ ఇన్ చీఫ్ ధన్యా రాజేంద్రన్ మాట్లాడుతూ, ఉత్తమ జర్నలిజానికి ఉత్తమ వనరులూ అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సోషల్ మీడియా సమాజ పరిణామాలను నిమిషాల్లో ప్రజల వద్దకు చేరుస్తుండటం ప్రధాన స్రవంతి పాత్రికేయులకు సవాల్గా మారిందన్నారు. దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ సహ వ్యవస్థాపకులు సేన్ గుప్తా, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సుప్రియ శ్రీనాథ్ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి చందనా చక్రవర్తి సమన్వయకర్తగా వ్యవహరించగా, విక్రమ్, కిన్నెరమూర్తిలు మంథన్ కార్యక్రమాల గురించి వివరించారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ వేణుగోపాల్రెడ్డి, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మాజీ కార్యదర్శి సుజాతారావు, ఎన్.ఐ.ఆర్.డి మాజీ డైరెక్టర్ జనరల్ డబ్ల్యు.ఆర్.రెడ్డి, ఐఎఎస్ అధికారులు రఘునందనరావు, వాకాటి కరుణ, విద్యావేత్త ప్రొఫెసర్ శాంతాసిన్హా, ఈపీడబ్ల్యూ మాజీ సంపాదకులు రామమనోహర్రెడ్డితోపాటు పలువురు ప్రొఫెసర్లు, న్యాయవాదులు హాజరయ్యారు.
విద్యారంగంపై దాడి
ప్రొఫెసర్ నీరజాగోపాల్ జయల్
నయా జాతీయవాద విధానాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరులతో ఉన్నత విద్యా సంస్థల్లో విద్యా స్వేచ్ఛ(అకడమిక్ ఫ్రీడం) ప్రమాదంలో పడిందని లండన్లోని కింగ్స్ ఇండియా ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ నీరజాగోపాల్ జయల్ అభిప్రాయపడ్డారు. ‘విద్యా స్వేచ్ఛ’ అనే అంశంపై ఆమె మాట్లాడారు. ‘‘నయా ఆర్థిక విధానాలకు తోడు నయా జాతీయవాదం ముందుకొచ్చిన తర్వాత విద్యారంగం అనేక కొత్త సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభించింది. పరిశోధన, పాఠ్య ప్రణాళిక..ఇలా అన్నీ ప్రమాదంలో పడ్డాయి. విశ్వవిద్యాలయాల్లో ఏ అంశం గురించీ స్వేచ్ఛగా చర్చించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వాల జోక్యం తరగతి గది వరకూ వచ్చింది. నియామకాలు, బోధన, పరిశోధన ఇలా అన్నింటిలో సిద్ధాంతపరమైన జోక్యం పెరిగింది. 2022 సెప్టెంబరు నుంచి 2023 సెప్టెంబరు వరకు విద్యా స్వేచ్ఛకు సంబంధించిన ఉల్లంఘనలు ప్రపంచవ్యాప్తంగా 243 జరిగితే, అందులో 37 భారతదేశంలోనివే. ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరిగిన ఇరాన్(48) తర్వాతి స్థానంలో మనం ఉన్నామంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో ఏ పుస్తకాలు ప్రచురించాలో, ఏవి ప్రచురించకూడదో, ఏ సదస్సు నిర్వహించాలో, ఏది నిర్వహించకూడదో ప్రభుత్వాలే చెబుతున్నాయి. చివరకు గ్రంథాలయంలో ఉన్న ఓ పుస్తకం గురించి ప్రిన్సిపల్ను సస్పెండ్ చేశారు. తాను ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించక మునుపు నుంచే ఆ పుస్తకం అక్కడ ఉందని ఆ ప్రిన్సిపల్ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి. విద్యారంగంపై జరుగుతున్న ఇలాంటి దాడి వల్ల ఎక్కువగా నష్టపోయేది విద్యార్థులే’’ అని నీరజాగోపాల్ జయల్ ఆవేదన వ్యక్తంచేశారు.
పథకాల అమలులో పౌరుల భాగస్వామ్యం లేదు
-యామినీ అయ్యర్
విద్య, వైద్యం, పౌష్టికాహారం లాంటి ప్రాథమిక అంశాలకు అవసరమైన నిధులు ఇవ్వని ప్రభుత్వాలు ఓటర్లతో నేరుగా సంబంధాల కోసం నగదు బదిలీ కార్యక్రమాలు అమలుచేస్తున్నాయని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చి(దిల్లీ) ప్రెసిడెంట్ యామిని అయ్యర్ అభిప్రాయపడ్డారు. ‘భారతదేశం-సంక్షేమ రాజ్యం’ అనే అంశంపై ఆమె మాట్లాడారు. ‘‘బటన్ నొక్కితే లబ్ధిదారులకు నగదు చేరే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మధ్యలో వాళ్లతో సంబంధం లేకుండా నేరుగా నాయకులే ఓటర్లతో సంబంధాలు కలిగి ఉండటానికి అవకాశం ఏర్పడింది. పథకాల అమలులో పౌరుల చురుకైన భాగస్వామ్యం లేకుండా పోయింది. లబ్ధిదారుడిని నేతలే ఎంపిక చేసే పరిస్థితి రావడంతో అనేక మందిని ఈ జాబితా నుంచి తప్పించడానికి అవకాశం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు ప్రాంతీయ పార్టీలున్న అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. భారత దేశంలో వృద్ధిరేటు బాగా ఉందని పాలకులు చెప్తున్నా, దానికి తగ్గట్లుగా ఉద్యోగాలు మాత్రం లేవు. దీనివల్ల ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. గత కొన్నేళ్లుగా కార్మిక చట్టాలు బలహీనపడ్డాయి. అంతిమంగా ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడుతోంది’’ అని అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Special Trains: 10 ప్రత్యేక రైళ్ల పొడిగింపు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 10 ప్రత్యేక రైళ్లను డిసెంబరు ఆఖరివారం వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
Hyderabad: హోటళ్లు తెరచుకోక ఇక్కట్లు
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు.. పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం గురువారం సెలవు దినంగా ప్రకటించింది. -
JEE Mains: జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు
జేఈఈ మెయిన్స్ తొలి విడతకు దరఖాస్తు చేసే గడువును డిసెంబరు 4వ తేదీ (రాత్రి 9 గంటల) వరకు పొడిగించారు. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) సవరించిన కాలపట్టికను వెల్లడించింది. -
TS Elections: పట్నం బద్ధకించింది.. పల్లె ఓటెత్తింది
రాష్ట్రంలో రానున్న అయిదేళ్ల పాలనను వేలికొనలతో నిర్ణయించేందుకు పల్లె ఓటర్లు బారులు తీరగా.. పట్టణాలు, నగరాల్లో పెద్దగా ఆసక్తి చూపలేదు. -
Chandrababu: తిరుపతిలో బాబుకు జన నీరాజనం
తెదేపా అధినేత చంద్రబాబుకు తిరుపతిలో ప్రజలు నీరాజనాలు పలికారు. బెయిల్పై విడుదలైన తర్వాత తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయనకు తెలుగుదేశం, జనసేన శ్రేణులు, ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. -
స్వల్ప ఘర్షణలు.. లాఠీఛార్జి
రాష్ట్రంలో గురువారం శాసనసభ ఎన్నికలు చెదురుమదురు ఘటనలు.. స్వల్ప ఘర్షణలు.. అక్కడక్కడా లాఠీఛార్జి మినహా ప్రశాంతంగా ముగిశాయి. -
సాగర్ ప్రాజెక్టు వద్ద ఘర్షణ
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద బుధవారం అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. రాత్రి 12 గంటల ప్రాంతంలో ఏపీ పోలీసులు భారీగా ప్రాజెక్టు వద్దకు చేరుకొని రక్షణ గేట్లు విరగ్గొట్టి తమపై దాడి చేశారని తెలంగాణ పోలీసులు ఆరోపించారు. -
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో జరిగిన లాంగ్ మారథాన్లో ఎన్నో మలుపుల మధ్య పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించగలిగామని డీజీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. -
వరవరరావు రెండో కంటి చికిత్సకు కోర్టు అనుమతి
ఎల్గార్ పరిషద్ - మావోయిస్టు సంబంధాల కేసు(2018)లో నిందితుడిగా ఉన్న వామపక్ష భావజాల కార్యకర్త వరవరరావు ఎడమ కంటికి కేటరాక్టు చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లేందుకు ముంబయిలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది. -
మాంసం లభ్యతలో తెలంగాణ అగ్రస్థానం
దేశంలో మాంసం లభ్యతలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రాథమిక పశుపోషణ గణాంకాల(బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్) వార్షిక నివేదిక-2023 వెల్లడించింది. -
లాసెట్ తొలి విడతలో 5,912 మందికి సీట్లు
లాసెట్ తొలి విడత కౌన్సెలింగ్ సీట్లను గురువారం కేటాయించారు. మూడేళ్లు, అయిదేళ్ల ఎల్ఎల్బీతో పాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లు మొత్తం 6,894 అందుబాటులో ఉన్నాయి. -
మేం నిరాధార ఆరోపణలు చేయలేదు!
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ కుంగడానికి గల కారణాలను వాస్తవాలను పరిగణనలోకి తీసుకొనే చెప్పామని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ తెలిపింది. -
ఇదీ సంగతి!
-
ఉచిత ఇసుక కేసులో.. చంద్రబాబు బెయిల్పై విచారణ 6కు వాయిదా
గత ప్రభుత్వ హయాంలోని ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం తెదేపా అధినేత చంద్రబాబు హైకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ డిసెంబరు 6కు వాయిదా పడింది. -
12 వరకు చంద్రబాబుపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దు
ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుప్రీంకోర్టులో దాఖలు పిటిషన్పై విచారణ డిసెంబరు 12కు వాయిదా పడింది. -
వలలో చిక్కిన చిరుత మృతి
కోతుల నుంచి పంట రక్షణకు రైతులు ఏర్పాటు చేసుకున్న వలలో చిరుత పులి చిక్కి మృతి చెందింది. -
ఉపకరించిన ఓటరు సమాచార కేంద్రాలు
ఓటరు స్లిప్పులు అందని ఓటర్లకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సమాచార కేంద్రాలు ఉపకరించాయి. రెండు.. అంతకుమించి కేంద్రాలు ఉన్న చోట వాటిని ఏర్పాటు చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
Dhootha web series review: నాగచైతన్య ఫస్ట్ వెబ్సిరీస్ ‘దూత’.. ఎలా ఉంది?
-
CM Kcr: ఎగ్జిట్ పోల్స్తో పరేషాన్ కావొద్దు.. మళ్లీ భారాసదే విజయం: సీఎం కేసీఆర్
-
Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 20,250 ఎగువన రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ
-
Biden: పన్నూ హత్యకు కుట్ర..భారత్కు ఏకంగా సీఐఏ చీఫ్ను పంపిన బైడెన్!
-
కాంగ్రెస్కు అచ్చేదిన్.. ఇది కూటమి విజయం: ఎగ్జిట్ పోల్స్పై సంజయ్ రౌత్
-
KRMB: సాగర్ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి: ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ