విజయ డెయిరీ విస్తరణ!
రాష్ట్ర ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ) విస్తరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్నేళ్లుగా డెయిరీ కార్యకలాపాలు పెద్దఎత్తున విస్తరిస్తున్నా హైదరాబాద్ కేంద్రంగానే కొనసాగుతున్నాయి.
కొత్తగా 6 జోన్ల ఏర్పాటుకు సన్నాహాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ) విస్తరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్నేళ్లుగా డెయిరీ కార్యకలాపాలు పెద్దఎత్తున విస్తరిస్తున్నా హైదరాబాద్ కేంద్రంగానే కొనసాగుతున్నాయి. పాల సేకరణ తర్వాత హైదరాబాద్కు రవాణా చేయడం, ఉత్పత్తుల తయారీ అనంతరం తిరిగి జిల్లాలకు పంపడం చేస్తున్నారు. దీంతో రవాణా, ఇతర సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో డెయిరీ కార్యకలాపాలను ఆరు జోన్లుగా విభజించి, వికేంద్రీకరణ విధానంలో సాగాలని భావిస్తోంది. తద్వారా పాల సేకరణ నుంచి ఉత్పత్తుల తయారీ వరకూ డెయిరీ సామర్థ్యాన్ని మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ ఆవిర్భావ సమయంలో 64 ఉన్న విజయ డెయిరీ దుకాణాలు (అవుట్లెట్లు, పార్లర్లు) ఇప్పుడు 650కి పెరిగాయి. వీటిని వెయ్యికి పెంచాలని భావిస్తోంది. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఇటీవల సమీక్ష నిర్వహించి విస్తరణ ప్రతిపాదనలపై చర్చించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్లలో కొత్త జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ జోన్ల కేంద్రంగా పాల సేకరణ చేపడతారు. అక్కడే ఉత్పత్తి యూనిట్లు ప్రారంభిస్తారు. జోన్ల ఆధ్వర్యంలో మార్కెటింగ్ చేపడతారు.
త్వరలో మెగా డెయిరీ ప్లాంటు: రోజుకు 5-8 లక్షల లీటర్ల ప్రాసెసింగ్ సామర్థ్యంతో రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో 42 ఎకరాల్లో రూ.250 కోట్లతో విజయ డెయిరీ మెగా ప్లాంటును నిర్మిస్తోంది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలోనే విస్తరణ ప్రతిపాదనలను సైతం సిద్ధం చేశారు. విజయ డెయిరీ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పాల సహకార సంఘాల ద్వారా 4.5 లక్షల లీటర్లు సేకరిస్తోంది. పాలతో పాటు పాల ఆధారిత వివిధ ఉత్పత్తులను తయారుచేసి సొంత దుకాణాల ద్వారా విక్రయిస్తోంది. కొత్తగా విజయ ఐస్క్రీమ్ తయారీకి సిద్ధమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Special Trains: 10 ప్రత్యేక రైళ్ల పొడిగింపు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 10 ప్రత్యేక రైళ్లను డిసెంబరు ఆఖరివారం వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
Hyderabad: హోటళ్లు తెరచుకోక ఇక్కట్లు
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు.. పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం గురువారం సెలవు దినంగా ప్రకటించింది. -
JEE Mains: జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు
జేఈఈ మెయిన్స్ తొలి విడతకు దరఖాస్తు చేసే గడువును డిసెంబరు 4వ తేదీ (రాత్రి 9 గంటల) వరకు పొడిగించారు. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) సవరించిన కాలపట్టికను వెల్లడించింది. -
TS Elections: పట్నం బద్ధకించింది.. పల్లె ఓటెత్తింది
రాష్ట్రంలో రానున్న అయిదేళ్ల పాలనను వేలికొనలతో నిర్ణయించేందుకు పల్లె ఓటర్లు బారులు తీరగా.. పట్టణాలు, నగరాల్లో పెద్దగా ఆసక్తి చూపలేదు. -
Chandrababu: తిరుపతిలో బాబుకు జన నీరాజనం
తెదేపా అధినేత చంద్రబాబుకు తిరుపతిలో ప్రజలు నీరాజనాలు పలికారు. బెయిల్పై విడుదలైన తర్వాత తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయనకు తెలుగుదేశం, జనసేన శ్రేణులు, ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. -
స్వల్ప ఘర్షణలు.. లాఠీఛార్జి
రాష్ట్రంలో గురువారం శాసనసభ ఎన్నికలు చెదురుమదురు ఘటనలు.. స్వల్ప ఘర్షణలు.. అక్కడక్కడా లాఠీఛార్జి మినహా ప్రశాంతంగా ముగిశాయి. -
సాగర్ ప్రాజెక్టు వద్ద ఘర్షణ
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద బుధవారం అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. రాత్రి 12 గంటల ప్రాంతంలో ఏపీ పోలీసులు భారీగా ప్రాజెక్టు వద్దకు చేరుకొని రక్షణ గేట్లు విరగ్గొట్టి తమపై దాడి చేశారని తెలంగాణ పోలీసులు ఆరోపించారు. -
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో జరిగిన లాంగ్ మారథాన్లో ఎన్నో మలుపుల మధ్య పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించగలిగామని డీజీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. -
వరవరరావు రెండో కంటి చికిత్సకు కోర్టు అనుమతి
ఎల్గార్ పరిషద్ - మావోయిస్టు సంబంధాల కేసు(2018)లో నిందితుడిగా ఉన్న వామపక్ష భావజాల కార్యకర్త వరవరరావు ఎడమ కంటికి కేటరాక్టు చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లేందుకు ముంబయిలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది. -
మాంసం లభ్యతలో తెలంగాణ అగ్రస్థానం
దేశంలో మాంసం లభ్యతలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రాథమిక పశుపోషణ గణాంకాల(బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్) వార్షిక నివేదిక-2023 వెల్లడించింది. -
లాసెట్ తొలి విడతలో 5,912 మందికి సీట్లు
లాసెట్ తొలి విడత కౌన్సెలింగ్ సీట్లను గురువారం కేటాయించారు. మూడేళ్లు, అయిదేళ్ల ఎల్ఎల్బీతో పాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లు మొత్తం 6,894 అందుబాటులో ఉన్నాయి. -
మేం నిరాధార ఆరోపణలు చేయలేదు!
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ కుంగడానికి గల కారణాలను వాస్తవాలను పరిగణనలోకి తీసుకొనే చెప్పామని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ తెలిపింది. -
ఇదీ సంగతి!
-
ఉచిత ఇసుక కేసులో.. చంద్రబాబు బెయిల్పై విచారణ 6కు వాయిదా
గత ప్రభుత్వ హయాంలోని ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం తెదేపా అధినేత చంద్రబాబు హైకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ డిసెంబరు 6కు వాయిదా పడింది. -
12 వరకు చంద్రబాబుపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దు
ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుప్రీంకోర్టులో దాఖలు పిటిషన్పై విచారణ డిసెంబరు 12కు వాయిదా పడింది. -
వలలో చిక్కిన చిరుత మృతి
కోతుల నుంచి పంట రక్షణకు రైతులు ఏర్పాటు చేసుకున్న వలలో చిరుత పులి చిక్కి మృతి చెందింది. -
ఉపకరించిన ఓటరు సమాచార కేంద్రాలు
ఓటరు స్లిప్పులు అందని ఓటర్లకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సమాచార కేంద్రాలు ఉపకరించాయి. రెండు.. అంతకుమించి కేంద్రాలు ఉన్న చోట వాటిని ఏర్పాటు చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
CM Kcr: ఎగ్జిట్ పోల్స్తో పరేషాన్ కావొద్దు.. మళ్లీ భారాసదే విజయం: సీఎం కేసీఆర్
-
Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 20,250 ఎగువన రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ
-
Biden: పన్నూ హత్యకు కుట్ర..భారత్కు ఏకంగా సీఐఏ చీఫ్ను పంపిన బైడెన్!
-
కాంగ్రెస్కు అచ్చేదిన్.. ఇది కూటమి విజయం: ఎగ్జిట్ పోల్స్పై సంజయ్ రౌత్
-
KRMB: సాగర్ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి: ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ
-
LPG Cylinder Price: వాణిజ్య సిలిండర్పై రూ.21 పెంపు