సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే!
వయస్సుతో ప్రమేయం లేకుండా జీవితంలో సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని, దీనికి బిట్స్ పిలానీ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ విద్యార్థులే నిదర్శనమని సైయెంట్ వ్యవస్థాపక ఛైర్మన్, బోర్డు సభ్యుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ బీవీఆర్ మోహన్రెడ్డి అన్నారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ బీవీఆర్ మోహన్రెడ్డి
బిట్స్ స్నాతకోత్సవంలో 7,514 మందికి పట్టాల అందజేత
శామీర్పేట, న్యూస్టుడే: వయస్సుతో ప్రమేయం లేకుండా జీవితంలో సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని, దీనికి బిట్స్ పిలానీ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ విద్యార్థులే నిదర్శనమని సైయెంట్ వ్యవస్థాపక ఛైర్మన్, బోర్డు సభ్యుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ బీవీఆర్ మోహన్రెడ్డి అన్నారు. ఆదివారం బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలానీ హైదరాబాద్ క్యాంపస్లో నిర్వహించిన వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగామ్స్ కోర్సులో ఉత్తీర్ణులైన విద్యార్థుల స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓవైపు సంస్థల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే బిట్స్ పిలానీ అందిస్తున్న వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ కార్యక్రమంలో చేరి పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం అభినందనీయమన్నారు.
బిట్స్ పిలానీ కులపతి పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఆచార్య కుమార మంగళం బిర్లా పంపిన సందేశాన్ని ఆ విద్యాసంస్థ ఉప కులపతి ఆచార్య వి.రాంగోపాల్ స్నాతకోత్సవంలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా 7,514 మందికి పట్టాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐటీ, ఐటీఈఎస్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, బీఎఫ్ఎస్ఐ, ఫార్మా అండ్ హెల్త్కేర్, ఆటోమోటివ్ ఎనర్జీ రంగాల డైనమిక్ అవసరాలను తీర్చడంలో బిట్స్ అందిస్తున్న సేవలను వివరించారు. ఈ కోర్సుల్లో నేర్చుకున్న అంశాలను తమకు సహకరించిన సంస్థలకు ప్రయోజనం చేకూరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ ఆచార్య జి.సుందర్ మాట్లాడుతూ.. 43 ఏళ్లుగా 1.14 లక్షల మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇక్కడ అందిస్తున్న వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ కోర్సులను ఉపయోగించుకున్నారని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Cyclone Michaung: దూసుకొస్తున్న మిచౌంగ్
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం.. ఆదివారానికి తుపానుగా బలపడనుంది. -
విధి నిర్వహణలో కృష్ణా బోర్డు విఫలం
‘‘శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణాబోర్డు నిర్వహించాలని కేంద్ర జలశక్తి శాఖ నోటిఫికేషన్ జారీచేసినా కృష్ణాబోర్డు వాటిని తన ఆధీనంలోకి తీసుకోవడంలో విఫలమైంది. -
కొబ్బరి చెట్టంత ఎత్తుకు బొప్పాయి
సాధారణంగా బొప్పాయి చెట్టు 10 నుంచి 15 అడుగుల ఎత్తు పెరుగుతుంది. అనకాపల్లి జిల్లా మునగపాకలోని పి.బాబుకు చెందిన భూమిలో నాటిన మొక్క 25 అడుగులకు పెరిగింది. -
నెలలు నిండకుండానే పుట్టిన శిశువుకు సీపీఆర్
నెలలు నిండని గర్భిణికి అత్యవసర పరిస్థితుల్లో కీసర 108 సిబ్బంది పురుడు పోసి, శిశువుకు అంబులెన్స్లో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. -
Trains: సంక్రాంతికి ఏపీకి వెళ్లే రైళ్లు ఫుల్.. వందల్లో వెయిటింగ్ లిస్ట్
సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు డిమాండ్ భారీగా ఉంది. పండగకి సుమారు నెలన్నర ముందే వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉంది. -
మిచౌంగ్ తుపాను ప్రభావం.. భారీ సంఖ్యలో రైళ్ల రద్దు
ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాల్లో ‘మిచౌంగ్’ తుపాను నేపథ్యంలో భారీ సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. -
సాగర్ కుడి కాలువకు నీటి విడుదల నిలిపివేత
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతకు కారణమైన సాగర్ కుడికాలువ నీటి విడుదలను రాత్రి 10.30 గంటలకు ఏపీ అధికారులు నిలిపివేశారు. -
ఇంజినీరింగ్లో 6జీ పాఠాలు
భారతదేశాన్ని 6జీ టెక్నాలజీకి సిద్ధం చేసేందుకు, ఆ రంగంలో నిపుణులను తయారు చేసేందుకు ఇంజినీరింగ్ విద్యలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. -
కృష్ణా జలాల వివాదంపై 6న దిల్లీలో భేటీ
కృష్ణా జలాల వివాదంపై ఈ నెల ఆరో తేదీ వరకు సంయమనం పాటించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సూచించారు. -
ఉద్యోగులకు ఒక డీఏ చెల్లింపునకు ఈసీ అనుమతి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్దారులకు పెండింగ్లో ఉన్న 3 డీఏల్లో ఒకటి చెల్లించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. -
మొక్కల్లో పోషకాల శుద్ధి ప్రక్రియపై పేటెంట్
మొక్కల్లో పోషకాలను వేరుచేసి, శుద్ధి చేయడం ద్వారా క్రిమికీటకాల బారి నుంచి కాపాడుకునే విధానంపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఆచార్యులు కె.పద్మశ్రీ, ఎం.కె.అరుణశ్రీలకు పేటెంట్ దక్కింది. -
సీఆర్పీఎఫ్ బలగాలకు ఏపీ అనుమతి నిరాకరణ
నాగార్జునసాగర్ డ్యాం వద్ద ఘర్షణ వాతావరణాన్ని నిరోధించడానికి కేంద్రం పంపించిన సీఆర్పీఎఫ్ బలగాలు శుక్రవారం రాత్రి ఎడమ(తెలంగాణ)వైపు పైలాన్ వద్దకు, కుడి(ఏపీ) వైపు రైట్ బ్యాంకు వద్దకు చేరుకున్నాయి. -
స్థానిక ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన వివక్షాపూరితం
ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్నవారు స్థానిక సంస్థల్లో ఎన్నికలకు అనర్హులన్న నిబంధనను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. -
బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని 12 నుంచి చలో దిల్లీ
ప్రస్తుతం జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో చట్టసభల్లో 50 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం బిల్లుపెట్టాలని, అందుకు ప్రధాని మోదీ చొరవ తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. -
నవంబరులో రికార్డు స్థాయి ఆదాయం: ద.మ.రైల్వే
ప్రయాణికులు, సరకు రవాణా ద్వారా నవంబరులో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించినట్లు ద.మ.రైల్వే శనివారం ప్రకటించింది. -
నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ శనివారం తెలిపింది. -
పార్టీ ఫిరాయింపులను అడ్డుకోవాల్సిందే
ఒక పార్టీలో గెలిచి మరో పార్టీకి వెళ్లే ప్రయత్నాలను పౌర సమాజం అడ్డుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. పార్టీలు, సభాపతి, న్యాయస్థానాలు వీటిని అడ్డుకోని పక్షంలో మార్పు ప్రజల్లోంచే రావాలన్నారు. -
ఉపా చట్టాన్ని కొత్త ప్రభుత్వం రద్దు చేయాలి
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటుచేసి ఉపా చట్టాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జపనీస్ భాషపై వ్యాస రచన పోటీ
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని విద్యార్థుల్లో జపనీస్ భాషలో నైపుణ్యం పెంపు, భావ వ్యక్తీకరణను ప్రోత్సహించడానికి ఆ భాషలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయ సాంస్కృతిక విభాగం సీనియర్ కో-ఆర్డినేటర్ లోక్నాథన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
IND vs AUS: ఐదో టీ20 మ్యాచ్.. టాస్ నెగ్గిన ఆసీస్.. భారత్ ఫస్ట్ బ్యాటింగ్
-
Rajasthan Election Result: రాజస్థాన్లో భాజపా విజయం.. సీఎం రేసులో ఎవరెవరు?
-
Revanth Reddy: హస్తానికి జీవం పోసి.. అధికారానికి చేరువ చేసి..! రేవంత్ ప్రస్థానమిది
-
TS Elections: అంతటా కాంగ్రెస్ హవా.. హైదరాబాద్లో డీలాకు కారణమిదేనా?
-
TS Elections - BJP: తెలంగాణలో గతంకంటే పుంజుకున్న భాజపా
-
KTR: ప్రతిపక్ష పార్టీగా సమర్థంగా వ్యవహరిస్తాం: కేటీఆర్