విశాఖ ఇండస్ట్రీస్, విజిలెన్స్సెక్యూరిటీ ఖాతాల్లోకి భారీగా నగదు జమ..!
బషీర్బాగ్లోని ఐడీబీఐ బ్యాంకులో రెండు సంస్థల ఖాతాల్లోకి జమైన భారీ నగదును ఫ్రీజ్ చేసినట్లు మధ్యమండలం డీసీపీ వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు.
రూ.8 కోట్లు ఫ్రీజ్ చేసిన పోలీసులు
ఈనాడు, హైదరాబాద్: బషీర్బాగ్లోని ఐడీబీఐ బ్యాంకులో రెండు సంస్థల ఖాతాల్లోకి జమైన భారీ నగదును ఫ్రీజ్ చేసినట్లు మధ్యమండలం డీసీపీ వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఎన్నికల సమయంలో బ్యాంకు లావాదేవీలపై ఈసీ అధికారులు నిఘా ఉంచారు. ఖాతాల్లో జమయ్యే అక్రమ నగదు వివరాలను సేకరిస్తున్నారు. ఈ నెల 13న విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాల్లోకి రూ.8 కోట్లు జమయ్యాయి. గుర్తుతెలియని ఖాతా నుంచి పెద్దఎత్తున నగదు బదిలీ కావటంపై సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. రంగంలోకి దిగిన పోలీసులు సదరు లావాదేవీలపై ఆరా తీసి నగదును స్తంభింపజేశారు. ఈ మేరకు ఐడీబీఐ బ్రాంచి మేనేజర్, నోడల్ అధికారి, ఆదాయపన్నుశాఖ, ఈడీ జాయింట్ డైరెక్టర్లకు లేఖ ద్వారా తెలియజేశామని డీసీపీ తెలిపారు. రెండు సంస్థల ఖాతాల్లోకి భారీ ఎత్తున నగదు జమ చేసిన వారి గురించి ఆరా తీస్తున్నామని డీసీపీ తెలిపారు. పూర్తి ఆధారాలు లభించాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా ఓ ప్రధాన పార్టీకి చెందిన కీలక నాయకుడి కోసమే నగదు బదిలీ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాగార్జున సాగర్ డ్యాంపై సమసిన వివాదం
నాగార్జునసాగర్ డ్యాం వద్ద నాలుగు రోజులుగా నెలకొన్న వివాదం ఆదివారం ఉదయంతో సమసిపోయింది. ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నీటి వాటాను సక్రమంగా ఇవ్వడం లేదని బుధవారం రాత్రి ఆ రాష్ట్ర అధికారులు పోలీసు బలగాలతో డ్యాంపైకి ప్రవేశించి తెలంగాణ అధికారుల అనుమతి లేకుండా కుడి కాల్వ ద్వారా నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. -
ఓపీఎస్ అమలుకే ఉద్యోగులు మద్దతిచ్చారు
పాత పింఛన్ విధానం (ఓపీఎస్) అమలు చేస్తుందన్న నమ్మకంతో ఎన్నికల్లో ఓట్ ఫర్ ఓపీఎస్ నినాదంతో కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ఇచ్చామని తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
తిరుమలలో ఘనంగా కార్తిక స్నపన తిరుమంజనం
పవిత్ర కార్తిక మాసంలో నిర్వహించే కార్తిక వనభోజన మహోత్సవంలో భాగంగా ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. -
Congress - RevanthReddy: చెయ్యెత్తి జై కొట్టిన తెలంగాణ
‘హస్త’వాసి ఫలించింది.. ఆ ధాటికి ‘కారు’ వెనకబడింది. మార్పు కావాలంటూ కాంగ్రెస్ చేసిన ఉద్ధృత ప్రచారం ఆ పార్టీని విజయతీరానికి చేర్చింది. ఎట్టకేలకు తెలంగాణ పీఠం దక్కింది. సుమారు దశాబ్దం తర్వాత భారాస దూకుడుకు కాంగ్రెస్ కళ్లెం వేయగలిగింది. -
Revanth Reddy: సీఎంగా రేవంత్!
తెలంగాణలో సోమవారం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. కాంగ్రెస్ ప్రతినిధిబృందం ఆదివారం రాత్రి గవర్నర్ తమిళిసైని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపింది. -
ఇక ప్రగతి భవన్ కాదు... ప్రజా భవన్
పదేళ్ల తర్వాత తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెప్పారు. గతానికి భిన్నంగా ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతిపక్షంతోపాటు అన్ని పార్టీల సహకారంతో ప్రజాస్వామిక పరిపాలన అందిస్తామన్నారు. -
సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా
ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆదివారం సాయంత్రం గవర్నర్ తమిళిసైకి అధికారుల ద్వారా తన రాజీనామా లేఖను పంపించారు. కేసీఆర్ రాజీనామాను గవర్నర్ తమిళిసై ఆదివారం రాత్రి ఆమోదించారు. -
డీజీపీ అంజనీకుమార్పై సస్పెన్షన్ వేటు
తెలంగాణ డీజీపీ అంజనీకుమార్పై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. -
నిరంజన్రెడ్డి కాన్వాయ్పై దాడి
భారాస అభ్యర్థి, మంత్రి నిరంజన్రెడ్డి కాన్వాయ్పై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఫలితాల సరళిని అంచనా వేసిన ఆయన 12వ రౌండ్ నడుస్తుండగా లెక్కింపు కేంద్రం నుంచి తిరిగి బయల్దేరారు. -
జేఈఈ దరఖాస్తు ఫీజు పెంపు
ఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తు ఫీజును వరుసగా రెండో ఏడాదీ పెంచారు. అమ్మాయిలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు గత ఏడాది రూ.1450 ఉండగా దాన్ని రూ.1600లకు, ఇతరులకు రూ.2,900ల నుంచి రూ.3,200లకు పెంచినట్లు ఐఐటీ... -
ఇదీ సంగతి!


తాజా వార్తలు (Latest News)
-
Michaung Cyclone: నిజాంపట్నం వద్ద 10 నంబర్ ప్రమాద హెచ్చరిక.. తీరప్రాంత ప్రజల్లో ఉలిక్కిపాటు
-
Jio AirFiber: జియో ఎయిర్ఫైబర్లోనూ డేటా బూస్టర్ ప్లాన్.. ధర ఎంతంటే?
-
Kiara Advani: డ్యాన్స్ చేయమంటే నవ్వులు పంచిన కియారా: ఈ డ్రెస్సులో చేయలేనంటూ!
-
Telangana: ముఖ్యమంత్రి.. మంత్రివర్గంపై కొలిక్కిరాని చర్చలు
-
GST: ఈ ఏడాది సగటు జీఎస్టీ వసూళ్లు రూ.1.66 లక్షల కోట్లు
-
Chandrababu: చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా