ఏడాది పీజీ కోర్సులు!
పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు అంటే ఇప్పటివరకు రెండేళ్లు చదవాల్సి వచ్చేది. ఇక నుంచి నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీని పూర్తి చేసిన వారు ఏడాది పీజీ కోర్సు చదువుకునే వెసులుబాటు కల్పిస్తూ యూజీసీ పచ్చజెండా ఊపింది.
నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ పూర్తిచేసిన వారికి వెసులుబాటు
రెండేళ్ల పీజీలో ఏడాది తర్వాత మానుకుంటే డిప్లొమా పట్టా
యూజీసీ ముసాయిదా మార్గదర్శకాల జారీ
ఈనాడు, హైదరాబాద్: పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు అంటే ఇప్పటివరకు రెండేళ్లు చదవాల్సి వచ్చేది. ఇక నుంచి నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీని పూర్తి చేసిన వారు ఏడాది పీజీ కోర్సు చదువుకునే వెసులుబాటు కల్పిస్తూ యూజీసీ పచ్చజెండా ఊపింది. త్వరలో ఆ కోర్సులను అందుబాటులోకి తీసుకురానుంది. విద్యా ప్రణాళిక, క్రెడిట్ ఫ్రేమ్వర్క్లకు సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. దానిపై అభ్యంతరాలు, సూచనలను పంపేందుకు తుది గడువు డిసెంబరు 15వ తేదీగా నిర్ణయించింది. వాటిని పరిశీలించి డిసెంబరు లేదా జనవరిలో తుది మార్గదర్శకాలు విడుదల చేస్తారు. నూతన జాతీయ విద్యా విధానం-2020కు అనుగుణంగా పీజీ విద్యలో మార్పులకు శ్రీకారం చుట్టిన యూజీసీ.. అందులో భాగంగానే పలు నిర్ణయాలు తీసుకుంది.
ముఖ్యాంశాలు..
- మూడేళ్ల డిగ్రీ పూర్తిచేసిన వారు ఇప్పటి మాదిరిగానే రెండేళ్ల పీజీ చదువుతారు. నాలుగేళ్ల ఆనర్స్ పూర్తిచేసిన వారు మాత్రం ఏడాదిపాటు పీజీ చదవొచ్చు. డిగ్రీలో చదివిన సబ్జెక్టుల్లో ఏదైనా ఒక సబ్జెక్టును పీజీలో ఎంచుకొని పూర్తి చేయవచ్చు.
- మూడేళ్లు డిగ్రీ చదివిన వారు రెండేళ్ల పీజీలో చివరి ఏడాది పూర్తిగా పరిశోధనకే కేటాయిస్తారు. ప్రథమ సంవత్సరం చదివి మానుకుంటే పీజీ డిప్లొమా పట్టా అందజేస్తారు. తర్వాత ఆసక్తి ఉన్నప్పుడు రెండో ఏడాది పూర్తి చేస్తే పీజీ ధ్రువపత్రం ఇస్తారు.
- ఆఫ్లైన్లో చదవాలా? ఆన్లైన్లో చదవాలా.. ఆఫ్లైన్, ఆన్లైన్ విధానాల్లో చదవాలా? అన్నది విద్యార్థుల ఇష్టం.
- మరిన్ని అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆర్టిఫిషియల్ లెర్నింగ్తో అనుసంధానించిన హెల్త్కేర్, అగ్రికల్చర్, లా తదితర కోర్సులను ప్రవేశపెట్టుకునేందుకు అనుమతి ఇస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Cyclone Michaung: దూసుకొస్తున్న మిచౌంగ్
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం.. ఆదివారానికి తుపానుగా బలపడనుంది. -
విధి నిర్వహణలో కృష్ణా బోర్డు విఫలం
‘‘శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణాబోర్డు నిర్వహించాలని కేంద్ర జలశక్తి శాఖ నోటిఫికేషన్ జారీచేసినా కృష్ణాబోర్డు వాటిని తన ఆధీనంలోకి తీసుకోవడంలో విఫలమైంది. -
కొబ్బరి చెట్టంత ఎత్తుకు బొప్పాయి
సాధారణంగా బొప్పాయి చెట్టు 10 నుంచి 15 అడుగుల ఎత్తు పెరుగుతుంది. అనకాపల్లి జిల్లా మునగపాకలోని పి.బాబుకు చెందిన భూమిలో నాటిన మొక్క 25 అడుగులకు పెరిగింది. -
నెలలు నిండకుండానే పుట్టిన శిశువుకు సీపీఆర్
నెలలు నిండని గర్భిణికి అత్యవసర పరిస్థితుల్లో కీసర 108 సిబ్బంది పురుడు పోసి, శిశువుకు అంబులెన్స్లో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. -
Trains: సంక్రాంతికి ఏపీకి వెళ్లే రైళ్లు ఫుల్.. వందల్లో వెయిటింగ్ లిస్ట్
సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు డిమాండ్ భారీగా ఉంది. పండగకి సుమారు నెలన్నర ముందే వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉంది. -
మిచౌంగ్ తుపాను ప్రభావం.. భారీ సంఖ్యలో రైళ్ల రద్దు
ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాల్లో ‘మిచౌంగ్’ తుపాను నేపథ్యంలో భారీ సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. -
సాగర్ కుడి కాలువకు నీటి విడుదల నిలిపివేత
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతకు కారణమైన సాగర్ కుడికాలువ నీటి విడుదలను రాత్రి 10.30 గంటలకు ఏపీ అధికారులు నిలిపివేశారు. -
ఇంజినీరింగ్లో 6జీ పాఠాలు
భారతదేశాన్ని 6జీ టెక్నాలజీకి సిద్ధం చేసేందుకు, ఆ రంగంలో నిపుణులను తయారు చేసేందుకు ఇంజినీరింగ్ విద్యలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. -
కృష్ణా జలాల వివాదంపై 6న దిల్లీలో భేటీ
కృష్ణా జలాల వివాదంపై ఈ నెల ఆరో తేదీ వరకు సంయమనం పాటించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సూచించారు. -
ఉద్యోగులకు ఒక డీఏ చెల్లింపునకు ఈసీ అనుమతి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్దారులకు పెండింగ్లో ఉన్న 3 డీఏల్లో ఒకటి చెల్లించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. -
మొక్కల్లో పోషకాల శుద్ధి ప్రక్రియపై పేటెంట్
మొక్కల్లో పోషకాలను వేరుచేసి, శుద్ధి చేయడం ద్వారా క్రిమికీటకాల బారి నుంచి కాపాడుకునే విధానంపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఆచార్యులు కె.పద్మశ్రీ, ఎం.కె.అరుణశ్రీలకు పేటెంట్ దక్కింది. -
సీఆర్పీఎఫ్ బలగాలకు ఏపీ అనుమతి నిరాకరణ
నాగార్జునసాగర్ డ్యాం వద్ద ఘర్షణ వాతావరణాన్ని నిరోధించడానికి కేంద్రం పంపించిన సీఆర్పీఎఫ్ బలగాలు శుక్రవారం రాత్రి ఎడమ(తెలంగాణ)వైపు పైలాన్ వద్దకు, కుడి(ఏపీ) వైపు రైట్ బ్యాంకు వద్దకు చేరుకున్నాయి. -
స్థానిక ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన వివక్షాపూరితం
ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్నవారు స్థానిక సంస్థల్లో ఎన్నికలకు అనర్హులన్న నిబంధనను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. -
బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని 12 నుంచి చలో దిల్లీ
ప్రస్తుతం జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో చట్టసభల్లో 50 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం బిల్లుపెట్టాలని, అందుకు ప్రధాని మోదీ చొరవ తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. -
నవంబరులో రికార్డు స్థాయి ఆదాయం: ద.మ.రైల్వే
ప్రయాణికులు, సరకు రవాణా ద్వారా నవంబరులో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించినట్లు ద.మ.రైల్వే శనివారం ప్రకటించింది. -
నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ శనివారం తెలిపింది. -
పార్టీ ఫిరాయింపులను అడ్డుకోవాల్సిందే
ఒక పార్టీలో గెలిచి మరో పార్టీకి వెళ్లే ప్రయత్నాలను పౌర సమాజం అడ్డుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. పార్టీలు, సభాపతి, న్యాయస్థానాలు వీటిని అడ్డుకోని పక్షంలో మార్పు ప్రజల్లోంచే రావాలన్నారు. -
ఉపా చట్టాన్ని కొత్త ప్రభుత్వం రద్దు చేయాలి
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటుచేసి ఉపా చట్టాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జపనీస్ భాషపై వ్యాస రచన పోటీ
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని విద్యార్థుల్లో జపనీస్ భాషలో నైపుణ్యం పెంపు, భావ వ్యక్తీకరణను ప్రోత్సహించడానికి ఆ భాషలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయ సాంస్కృతిక విభాగం సీనియర్ కో-ఆర్డినేటర్ లోక్నాథన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
TS Results: ‘కారు’కు నిరాశ.. ఆరుగురు మంత్రులకు షాక్
-
Social Look: క్యూట్ ట్రైనర్తో మహేశ్ బాబు.. మీనాక్షి మిక్స్డ్ మార్షల్ మార్ట్స్
-
KCR: ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా.. ఆమోదించిన గవర్నర్
-
IND vs AUS: ఐదో టీ20 మ్యాచ్.. టాస్ నెగ్గిన ఆసీస్.. భారత్ ఫస్ట్ బ్యాటింగ్
-
Rajasthan Election Result: రాజస్థాన్లో భాజపా విజయం.. సీఎం రేసులో ఎవరెవరు?
-
Revanth Reddy: హస్తానికి జీవం పోసి.. అధికారానికి చేరువ చేసి..! రేవంత్ ప్రస్థానమిది