ఎక్కువ దొరికింది తెలంగాణలోనే!
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ధన ప్రభావం విపరీతంగా కనిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 20వ తేదీ నాటికి ఈ రాష్ట్రాల్లో రూ.1,760 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకొంది.
స్వాధీనం చేసుకున్న నగదులో 60% ఇక్కడిదే..
5 రాష్ట్రాల ఎన్నికల్లో ఇప్పటి వరకు రూ. 1,760 కోట్ల సొత్తు పట్టివేత
ఈనాడు, దిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ధన ప్రభావం విపరీతంగా కనిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 20వ తేదీ నాటికి ఈ రాష్ట్రాల్లో రూ.1,760 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకొంది. ఇందులో రూ.659.2 కోట్ల సొత్తుతో తెలంగాణ తొలి స్థానంలో, రూ.650.7 కోట్లతో రాజస్థాన్ రెండో స్థానంలో నిలిచాయి. మొత్తం అయిదు రాష్ట్రాల్లో కలిపి రూ.372.9 కోట్ల నగదును స్వాధీనం చేసుకోగా అందులో 60% (రూ.225.23 కోట్లు) తెలంగాణలోనే లభించింది. మద్యం, డ్రగ్స్, విలువైన లోహాల స్వాధీనంలోనూ తెలంగాణే తొలిస్థానాన్ని ఆక్రమించింది. ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో 2018 ఎన్నికల సమయంలో దొరికిన రూ.239.15 కోట్లతో పోలిస్తే ఈసారి ఇప్పటివరకు దొరికిన సొత్తు విలువ 636% అధికంగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ అయిదు రాష్ట్రాల కంటే ముందు జరిగిన గుజరాత్, హిమాచల్ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, కర్ణాటక ఎన్నికల్లో రూ.1,400 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నామని.. అది ఆయా రాష్ట్రాల్లో అంతకు ముందు అయిదేళ్ల కిందట స్వాధీనం చేసుకున్న మొత్తంతో పోలిస్తే 1009.12% అధికమని ఈసీ వెల్లడించింది. ఈసారి తాము ఎన్నికల వ్యయ పర్యవేక్షణ వ్యవస్థ (ఈఎస్ఎంస్) ద్వారా అభ్యర్థుల వ్యయంపై నిఘా ఉంచినట్లు పేర్కొంది. 228 మంది అనుభవజ్ఞులైన అధికారులు, ఇతర కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన అధికారులను అయిదు రాష్ట్రాల ఎన్నికల వ్యయ పర్యవేక్షణకు నియమించినట్లు తెలిపింది. అత్యధిక వ్యయం జరగడానికి అవకాశం ఉన్న 194 అసెంబ్లీ నియోజకవర్గాలపై సూక్ష్మస్థాయిలో దృష్టి సారించినట్లు వెల్లడించింది. ధన ప్రభావ నియంత్రణ చర్యలు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఇకముందు కూడా కొనసాగుతాయని, స్వాధీనం చేసుకొనే సొత్తు విలువ మరింత పెరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేడిగడ్డ కుంగుబాటు కేసును సీబీఐకి అప్పగించండి
మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ పోలీసు స్టేషన్లో నమోదైన కేసును సీబీఐకి బదలాయించేలా ఆదేశాలివ్వాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. -
JEE Main: జేఈఈ మెయిన్కు 12.30 లక్షల దరఖాస్తులు
దేశవ్యాప్తంగా జనవరి 24వ తేదీ నుంచి జరగనున్న జేఈఈ మెయిన్ తొలి విడతకు రికార్డు స్థాయిలో 12.30 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. -
ఉత్తరాది రాష్ట్రాలది గోముద్ర!: డీఎంకే ఎంపీ వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై స్పందన
ఉత్తరాది రాష్ట్రాలు ‘గోమూత్రాని’కి నిదర్శనం కాదని, వాటిది ‘గోముద్ర’ అని తెలంగాణ గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. అవి పవిత్ర గోమాతకు చిహ్నమని తెలిపారు. -
TS News: మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు!
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలను మార్చి 1 నుంచి ప్రారంభించేందుకు ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమోదం తీసుకొని ఈ వారం రోజుల్లో టైంటేబుల్ను ప్రకటించనుంది. -
Anganwadi Vacancy: తెలంగాణలో 8,815 అంగన్వాడీ పోస్టులు ఖాళీ
తెలంగాణలో 8,815 అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. శుక్రవారం లోక్సభలో ఓ ప్రశ్నకు ఆమె ఈ సమాధానం ఇచ్చారు. -
Prajadarbar: బాధలు విన్నారు.. భరోసా ఇచ్చారు!
‘చాలా కాలంగా తిరుగుతున్నా భూ సమస్య పరిష్కారం కాలేదు. ప్రభుత్వం నేరుగా దరఖాస్తు తీసుకోవడంతోనైనా న్యాయం జరుగుతుందన్న ఆశ ఏర్పడింది’ అని ఒకరు.. ‘విద్యుదాఘాతంతో చేతులు పోయాయి. -
కేసీఆర్కు తుంటి మార్పిడి
మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో గురువారం రాత్రి జారిపడటంతో ఎడమ తుంటి భాగంలో తీవ్ర గాయమైంది. -
Telangana Ministers: మంత్రుల శాఖలపై కసరత్తు.. నేడు ప్రకటించే అవకాశం
రాష్ట్ర మంత్రులకు కేటాయించాల్సిన శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్, ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్లతో సుదీర్ఘ భేటీలు నిర్వహించారు. -
Telangana: విద్యుత్ సంస్థల అప్పులు రూ.81,516 కోట్లు
రాష్ట్రంలోని 4 విద్యుత్ సంస్థల అప్పులు, నష్టాలపై ఆ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి జరిపిన అంతర్గత సమీక్షలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. -
సివిల్స్ ఇంటర్వ్యూలకు 90 మంది తెలుగు అభ్యర్థులు!
ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్-2023 మెయిన్ పరీక్షల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. ఇంటర్వ్యూలకు మొత్తం 2,844 మంది అర్హత పొందారు. -
వృక్ష విలాపం
పచ్చని చెట్లకు కొందరు విచ్చలవిడిగా మేకులు కొడుతూ ఛిద్రం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బోథ్ ఎక్స్రోడ్డు సమీపంలో ఉన్న టేకు వృక్షాలకు మేకులు కొట్టి.. విత్తనాలు, పురుగు మందులు తదితరాల ప్రకటనలను వేలాడదీస్తున్నారు. -
అటవీ అనుమతుల తర్వాత బెంగళూరు-అమరావతి హైవే పనులు ప్రారంభం
బెంగళూరు నుంచి అమరావతి వరకు నిర్మించ తలపెట్టిన యాక్సిస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణ పనులను అటవీ, వన్యప్రాణి అనుమతులు వచ్చిన తర్వాత ప్రారంభిస్తామని కేంద్ర రహదారులు, రవాణా శాఖ తెలిపింది. -
పాస్పోర్టు వెతలకు సత్వర పరిష్కారం
-
చంద్రబాబు బెయిలు రద్దు కేసు విచారణ జనవరి 19కి వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పూర్తిస్థాయి బెయిలు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నవంబరు 20న ఇచ్చిన తీర్పును రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన కేసుపై విచారణను సుప్రీంకోర్టు జనవరి 19కి వాయిదా వేసింది. -
బల్క్డ్రగ్ పార్కుకు రూ.225 కోట్లు ఇచ్చాం.. ఇప్పటివరకూ ఏమీ ఉపయోగించలేదు
ఏపీలో ఏర్పాటుచేయతలపెట్టిన బల్క్డ్రగ్ పార్కుకు కేంద్ర ఫార్మాస్యుటికల్స్ విభాగం రూ.225 కోట్లు విడుదల చేసినా అందులో ఇంతవరకు ఏమీ ఉపయోగించలేదని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయమంత్రి భగవంత్ ఖూబా తెలిపారు. -
మహిళలకు ‘మహా’వరం
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. -
ఆ ప్రిన్సిపల్ మాకొద్దు..!
ప్రిన్సిపల్ను మార్చాలంటూ కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం బూరుగూడలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు శుక్రవారం ఆందోళనకు దిగారు. -
గ్రామాలపైనా సైబర్ నేరగాళ్ల వల!
ఒకప్పుడు నగరాలు, పట్టణాల్లోనే ఎక్కువగా నమోదయ్యే సైబర్ నేరాలు ఇప్పుడు క్రమేపీ గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తున్నాయి. -
లేత వయసులో నేరాలు... లేటు వయసులో శిక్షలు
రాష్ట్రంలో శిక్షపడి జైళ్లలో ఉన్నవారిలో అధిక శాతం 30-50 ఏళ్ల వారే. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2022 డిసెంబరు నాటికి రాష్ట్రంలోని అన్ని జైళ్లలో కలిపి విచారణలోఉన్న ఖైదీలు 4,200 మందికి పైగా ఉన్నారు. -
ఏపీలో గ్రూపు-1 నోటిఫికేషన్ విడుదల
సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని...గ్రూపు-2 మాదిరిగానే గ్రూపు-1 పోస్టుల భర్తీకి(2023) రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. -
సొంతిల్లు ఉన్నంత మాత్రాన నివాసితుడిగా పరిగణించొద్దు
ఇతర రాష్ట్రాల్లోని తమ ఓటు హక్కును ఆంధ్రప్రదేశ్కు మార్చుకోవటం కోసం వచ్చే ఫాం-8లను పరిశీలించేటప్పుడు.. దరఖాస్తుదారుకు ఆ ప్రాంతంలో సొంతిల్లు ఉన్నంత మాత్రాన అక్కడి నివాసితుడిగా పరిగణించరాదు.


తాజా వార్తలు (Latest News)
-
Allu Aravind: మీ సందేహాలు ఇంకొన్నాళ్లు అలాగే ఉంచండి: అల్లు అరవింద్
-
TS News: ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
-
IND vs SA: సఫారీలతో టీ20 సిరీస్.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
-
Swiggy - Zomato: స్విగ్గీ, జొమాటోతోనే మాకు పోటీ: ఎడిల్విస్ సీఈఓ
-
BRS: ఎమ్మెల్సీలుగా పల్లా, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా
-
వారి అంకితభావానికి ఆశ్చర్యపోయా.. టాలీవుడ్ ప్రముఖులపై నెట్ఫ్లిక్స్ కో-సీఈవో పోస్టు