Gold Prices: అందవేంటి బంగారం!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పసిడి ధర క్రమంగా పెరుగుతోంది. అంతకుముందు బంగారం పదిగ్రాముల ధర రూ.48,600 వరకు ఉండగా.. ఇప్పుడు రూ.54,000కు చేరింది. యుద్ధం కొనసాగితే మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
యుద్ధం కొనసాగితే మరింత పైకి..
అనిశ్చితి మధ్య పెరుగుతున్న ధరలు
దేశీయంగా పడిపోయిన కొనుగోళ్లు
పసిడిలో 10-15% పెట్టుబడులు మేలు
నిపుణుల సలహా
ఈనాడు వాణిజ్య విభాగం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పసిడి ధర క్రమంగా పెరుగుతోంది. అంతకుముందు బంగారం పదిగ్రాముల ధర రూ.48,600 వరకు ఉండగా.. ఇప్పుడు రూ.54,000కు చేరింది. యుద్ధం కొనసాగితే మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ సమయంలో పసిడి కొనాలా వద్దా? ధర ఎంత వరకు వెళ్తుందనే అనుమానాలు కొనుగోలుదారుల్లో లేకపోలేదు.
బంగారం ధర కొద్ది రోజులుగా పెరగడానికి చాలా కారణాలున్నాయి. ప్రధాన కారణం మాత్రం రష్యా-ఉక్రెయిన్ యుద్ధమే. పసిడి ప్రధాన తయారీదారైన రష్యాపై ఆంక్షల వల్ల సరఫరా తగ్గుతుందన్న అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుండడం, రూపాయి మారక విలువ క్షీణిస్తుండడంతో.. పసిడి వైపు పెట్టుబడులు పెరిగి ధరలకు రెక్కలొచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంకా ఎంత పెరగవచ్చు?
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పసిడి ధర 2000 డాలర్ల వరకు పెరగవచ్చని ఆర్ఎల్పీ సెక్యూరిటీస్ ప్రతినిధి రమేశ్ అంటున్నారు. అయితే 1,985 డాలర్ల స్థాయిని అధిగమిస్తేనే అంతవరకు వెళ్లవచ్చని చెబుతున్నారు.ఫెడరల్ రిజర్వ్ తన విధానంలో మార్పులు చేస్తుందన్న అంచనాలున్నా, యుద్ధానికి తోడు అంతర్జాతీయ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో పసిడి ధర పెరుగుతోందన్న అంచనాలున్నాయి.
చమురుకూ..ద్రవ్యోల్బణానికి లంకె..
ఓ వైపు పీపా ముడిచమురు ధర 100 డాలర్ల పైన కదలాడుతోంది. పెట్రో ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం కూడా పైకి ఎగబాకుతుంది. ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యోల్బణ స్థాయులు దశాబ్దాల గరిష్ఠాలకు చేరాయి. భారత్లోనూ అయిదు రాష్ట్రాల ఎన్నికలయ్యాక పెట్రో ధరలు పెంచితే, ద్రవ్యోల్బణమూ పెరగవచ్చు. ఇవన్నీ పసిడి ధరలను మరింత పెంచే అవకాశాలున్నాయి.
ఇప్పుడు ఏం చేయాలంటే..
మదుపరులు నష్టాలను తట్టుకోవడానికి పసిడిని ఎప్పుడూ అనుకూలమైన పెట్టుబడి సాధనంగా భావిస్తుంటారు. పసిడి కొనుగోలును సెంటిమెంటుగా భావించే సాధారణ ప్రజలు కూడా ఇప్పుడు దాన్ని పెట్టుబడిగా చూస్తుండడం విశేషం. బంగారం కొనుగోలుతోపాటు గోల్డ్ ఈటీఎఫ్లను పరిశీలించడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. వీటికి, పసిడి ధరలకు లంకె ఉండడంతో పాటు చాలా తక్కువ మొత్తం(రూ.1000) నుంచీ పెట్టుబడులు పెట్టవచ్చు. డీమ్యాట్ లేకుండానే గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్లోనూ మదుపు చేయవచ్చని చెబుతున్నారు. అనిశ్చిత పరిస్థితుల్లో ఇది నష్టాల నుంచి కాపాడుతుందని అంటున్నారు. మదుపరి మొత్తం పెట్టుబడుల్లో పసిడికి 10-15 శాతం కేటాయించొచ్చని సూచిస్తున్నారు.
శ్రావణం వరకు గిరాకీ ఉండకపోవచ్చు
పసిడి గిరాకీ పెద్దగా లేదు. విజయవాడలో రోజుకు 50-60 కిలోల విక్రయాలుండేవి. ఇప్పుడు సీజను కాకపోవడం, ధర పెరగడంతో అమ్మకాలు అంతగా లేవు. శ్రావణమాసం వరకు డిమాండ్ పెరగకపోవచ్చు. ఉక్రెయిన్- రష్యా యుద్ధం కొనసాగితే ధర రూ.58,000కు చేరినా ఆశ్చర్యం లేదు.
- జవ్వాది సూర్యనారాయణ (రుద్రయ్య), విజయవాడ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
పాత బంగారం విక్రయాలు పెరిగాయి
పసిడి విక్రయాలు బాగా తగ్గాయి. చాలా మంది తమ వద్ద ఉన్న పాత బంగారాన్ని విక్రయిస్తున్నారు. యుద్ధ పరిస్థితులు మరో 10-30 రోజుల పాటు కొనసాగితే ధర గ్రాముకు రూ.200 వరకు పెరగొచ్చు. పరిస్థితులు చక్కబడితే గ్రాముకు రూ.400 వరకు తగ్గే అవకాశం ఉంది.
- మధుసూదన్ కొప్పర్తి, ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు
రూ.56,000కూ వెళ్లవచ్చా?
యుద్ధం కొనసాగినా, ఔన్సు ధర 2,000 డాలర్లకు మించి పెరగకపోవచ్చని విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ, దేశీయ పరపతి విధానాలు, ఆర్థికాంశాలు ధరను నిలువరిస్తాయని అంచనా వేస్తున్నారు. దేశీయంగా పది గ్రాముల ధర రూ.56,000 వరకు చేరవచ్చని తెలంగాణ బులియన్ అసోసియేషన్ కార్యదర్శి చందా శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ పసిడి, డైమండ్ మర్చంట్ల సంఘం వైస్ ప్రెసిడెంట్ బుశెట్టి రామ్మోహనరావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
యూటీఎస్ యాప్ పరిధి పెంపు
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు. -
ఏఈ పోస్టుల జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీజీపీ రవిగుప్తాకు పరిహారం చెల్లించండి
పనిచేయని రిక్లైనర్ సీటును కేటాయించి తీవ్ర అసౌకర్యం కలిగించడం, బిజినెస్(జెడ్) క్లాస్ టికెట్లో ఎకానమీ క్లాస్ సేవలందించిన నేపథ్యంలో డీజీపీ దంపతులకు రూ.2,07,500 పరిహారం చెల్లించాలని సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 ఆదేశించింది. -
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి. -
కాళేశ్వరంపై సత్వర విచారణ
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు. -
మండుతున్న ఎండలు.. భగ్గుమంటున్న అడవులు
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని