Cyclone Gulab effect: ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు నేడు సెలవు
గులాబ్ తుపాను ప్రభావ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు మంగళవారం సెలవుదినంగా సర్కారు ప్రకటించింది. రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణశాఖ ...
శాసనసభ, మండలి 1వ తేదీకి వాయిదా
గులాబ్ తుపాను ప్రభావ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు మంగళవారం సెలవుదినంగా సర్కారు ప్రకటించింది. రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో ముందు జాగ్రత్తగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర శాఖలైన రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, పురపాలక, పంచాయతీరాజ్, నీటిపారుదల, రోడ్లు భవనాల శాఖలను సెలవు నుంచి మినహాయించారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ఉండాలని, భారీ వర్షాలతో ఏవిధమైన ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. మరోవైపు తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలకు సైతం మూడు రోజుల పాటు వాయిదా వేశారు. వచ్చే నెల మొదటి తేదీ శుక్రవారం నాడు మళ్లీ ఉభయసభలు ఉదయం పది గంటలకు సమావేశమవుతాయని సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్రెడ్డిలు తెలిపారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం సమావేశాల ముగింపు సందర్భంగా ఉభయసభలు మంగళవారం సమావేశమవుతాయని పోచారం, భూపాల్రెడ్డిలు ప్రకటించారు. రాష్ట్రంలో వరదల ఉద్ధృతి దృష్ట్యా తమ నియోజకవర్గ ప్రజలను ఆదుకునేందుకు వీలుగా సమావేశాలను వాయిదా వేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోచారం, భూపాల్రెడ్డిలను కోరారు. దీనిపై వారు స్పందించి సీఎం కేసీఆర్, విపక్షాల నేతలను సంప్రదించారు. వారు కూడా ఆమోదం తెలపడంతో ఉభయ సభలను మూడు రోజుల పాటు వాయిదా వేయాలని నిర్ణయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూన్ 8-11 మధ్య నైరుతి రుతుపవనాల ప్రవేశం
రానున్న వానాకాలంలో రాష్ట్రమంతటా సాధారణ వర్షపాతం మించి అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. -
గల్ఫ్ కార్మికులకు బోర్డు
గల్ఫ్, ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నామని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
వైభవంగా సీతారాములవారి ఎదుర్కోలు ఉత్సవం
సీతారాముల కల్యాణ ఘడియలు సమీపించడంతో భద్రాచల దివ్యక్షేత్రం శోభాయమానంగా మారింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రామాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. పారాయణలతో అంతా రామమయమైంది. -
తెలంగాణ వైపు ఏనుగుల మంద!
మహారాష్ట్రలో సంచరిస్తున్న ఏనుగుల మంద తెలంగాణలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అటవీశాఖ భావిస్తోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా నుంచి రాష్ట్రంలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ డివిజన్లో అడుగుపెట్టొచ్చని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. -
చందా సరిగా కట్టరు.. కార్మికులకు వైద్యసేవలు అందవు..!
కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) పరిధిలోకి వచ్చే కార్మికులకు వైద్యసేవల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సంస్థ చర్యలు చేపట్టింది. కార్మికుల వైద్యసేవల బీమా చందా సొమ్ము సక్రమంగా చెల్లించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోనుంది. -
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ 7కి వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు మే 7వ తేదీకి వాయిదా వేసింది. -
శిరోముండనం చేయించి.. కనుబొమలు తీయించి
ఎన్నికల్లో రిగ్గింగ్పై ప్రశ్నించడమే ఆ దళిత యువకుల పాలిట శాపమైంది. మమ్మల్నే ప్రశ్నించే అంతటివారా? అంటూ అరాచక నేతలు ఆగ్రహించారు.. పంచాయితీకి పిలిపించారు. -
బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై వేటు
జగన్ ప్రభుత్వం గత అయిదేళ్లుగా మద్యం ద్వారా కొనసాగిస్తున్న దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) ఎండీ డి.వాసుదేవరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
‘శివ అన్నపురెడ్డి’ పేరిట ఉన్న ఫేస్బుక్ ఖాతా మాయం
న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై అసభ్య దూషణల కేసులో నిందితుడైన మణి అన్నపురెడ్డి.. తన రూపం, పేరు మార్చేసుకుని ‘శివ అన్నపురెడ్డి’ పేరిట ఇన్నాళ్లూ కొనసాగిస్తున్న ఫేస్బుక్ ఖాతాను తొలగించేశారు. -
శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు శిక్ష
దళిత యువకులకు అమానవీయంగా శిరోముండనం చేసి, మీసాలు, కనుబొమలు తీసేయించిన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ, మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు దోషి అని విశాఖపట్నం కోర్టు తేల్చింది. -
జులై శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల రేపు
భక్తుల సౌకర్యార్థం జులై నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే ఈనెల 18న నుంచి ఆన్లైన్లో విడుదల చేయనుంది. -
వైకాపా పోస్టులను తొలగించండి
వైకాపా పెట్టిన కొన్ని పోస్టులను తొలగించాలని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. -
వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డి తప్పించుకోలేరు
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి నిందితుడని, ఇందుకు శాస్త్రీయమైన ఆధారాలున్నాయని వివేకా కుమార్తె సునీత స్పష్టం చేశారు. -
అసామాన్య అనన్య
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఏపీల నుంచి సుమారు 60 మంది విజేతలుగా నిలిచారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. -
కళాకారులకు పదవీ విరమణ ఉండదు
నాటక రంగానికి తుర్లపాటి రామచంద్రరావు విశేష సేవలు అందించారని ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు కొనియాడారు. మంగళవారం రాత్రి వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని త్యాగరాయగానసభలో జరిగిన తెలుగు రంగస్థల దినోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. -
కేసుల వివరాలు అందించిన పోలీసులు
భాజపా తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేసుల వివరాలను పోలీసులు అందజేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మంగళవారం హైకోర్టుకు నివేదించారు. -
కవిత బెయిల్ పిటిషన్పై విచారణ 22కి వాయిదా
ఈడీ తనపై నమోదుచేసిన కేసులో పూర్తిస్థాయి బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. -
భద్రాద్రి సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి
భద్రాచలం సీతారామస్వామి కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం రాత్రి అనుమతిచ్చింది. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో అంగరంగ వైభవంగా కల్యాణం జరగనున్న విషయం తెలిసిందే. -
ప్రచార రథంపై చెప్పుల దండ
ఎన్నికల ప్రచార రథాన్ని అడ్డుకొని.. అభ్యర్థి చిత్రపటంపై చెప్పులతో దాడి చేసినందుకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. -
18 నుంచి సికింద్రాబాద్-దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు
సికింద్రాబాద్-దానాపూర్ల మధ్య ఏప్రిల్, మే నెలల్లో అన్రిజర్వుడ్ ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది. ఏప్రిల్ 18 నుంచి జూన్ 29 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఐ లావాదేవీలు.. ఫోన్పే, గూగుల్పే ఆధిపత్యానికి NPCI చెక్..!
-
పేదలకు ఉచితంగా 10 గ్యాస్ సిలిండర్లు.. టీఎంసీ మేనిఫెస్టో విడుదల
-
270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘన.. యువతికి రూ.1.36 లక్షల జరిమానా
-
నరైన్ అరుదైన రికార్డు.. శ్రేయస్ అయ్యర్కు రూ.12 లక్షల జరిమానా
-
భారతీయుడు అడుగుపెట్టే వరకు జాబిల్లి యాత్రలు: ఇస్రో చీఫ్
-
మాదాపూర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అరెస్ట్