Harish Rao: కిషన్రెడ్డివి పచ్చి అబద్ధాలు
కేంద్రమంత్రి హోదాలో ఉండి తెలంగాణపై పచ్చి అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తున్న కిషన్రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. వైద్యకళాశాలల గురించి తెలంగాణ అడగలేదని,
ఎయిమ్స్కు ఏడాదిన్నర క్రితమే స్థలం ఇచ్చాం
వైద్యకళాశాలల కోసం ఎన్నో విజ్ఞప్తులు చేశాం
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్రావు
ఈనాడు, హైదరాబాద్: కేంద్రమంత్రి హోదాలో ఉండి తెలంగాణపై పచ్చి అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తున్న కిషన్రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. వైద్యకళాశాలల గురించి తెలంగాణ అడగలేదని, బీబీనగర్ ఎయిమ్స్కు స్థలమివ్వలేదని అబద్ధాలు చెప్పడం సరికాదని అన్నారు. ఎయిమ్స్కు స్థలంతో పాటు భవనం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని, వైద్యకళాశాలల మంజూరు కోసం కేంద్రానికి పలు దఫాలు విన్నవించినా ఒక్కటి కూడా మంజూరు చేయనందుకు కిషన్రెడ్డి బాధ్యత వహించాలన్నారు. కేంద్రంలోని భాజపా తెలంగాణను చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 157 వైద్య కళాశాలలను మంజూరు చేసిన కేంద్రం.. రాష్ట్రానికి ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. ధాన్యం కొనబోమని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని.. దానికి వత్తాసుగా కిషన్రెడ్డి మాట్లాడుతున్నారని, ఉప్పుడు బియ్యం ఎవరూ తినరంటూ సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారని తెలిపారు. గతంలోనూ తెలంగాణ ప్రజలకు ఎర్రబస్సు తప్ప ఏమీ తెలియదని కిషన్రెడ్డి అవమానకరంగా మాట్లాడారని, ఇప్పుడూ అదే ధోరణితో మాట్లాడుతున్నారని ఆరోపించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ‘‘భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ అబద్ధాలు చెబుతుంటే.. తానేం తక్కువ తినలేదనే భావనతో కిషన్రెడ్డి అదే పని చేస్తున్నారు. ఇటీవల విలేకరుల సమావేశంలో, ఆ తర్వాత ఆయన ట్విటర్లో బీబీనగర్ ఎయిమ్స్కు తెలంగాణ ప్రభుత్వం స్థలం ఇవ్వలేదని పేర్కొన్నారు. బీబీనగర్లో నిమ్స్కు సంబంధించిన స్థలంలో భవనాన్ని నిర్మించి, దానిని కోరితే ఎయిమ్స్కు ఇచ్చాం. ఇలా ఇచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణయే. వైద్యకళాశాలకు స్థలం కావాలంటే గత ఏడాది మేలో 24 ఎకరాల స్థలమిచ్చాం. వైద్యకళాశాలల గురించి తెలంగాణ అధికారులు కేంద్రాన్ని సంప్రదించలేదని చెప్పడం దారుణం. అప్పటి రాష్ట్ర వైద్యమంత్రి లక్ష్మారెడ్డి కేంద్రమంత్రులు నడ్డా, హర్షవర్ధన్లను ఎన్నోసార్లు కలిసి వైద్యకళాశాలల గురించి మాట్లాడారు. మూడో దశలో ఇస్తామని హర్షవర్ధన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా అదీ నెరవేరలేదు. అనేక రాష్ట్రాలకు కళాశాలలు ఇచ్చి తెలంగాణపై సవతి ప్రేమ చూపారు. కేంద్రం మొండిచేయి చూపినా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వైద్యకళాశాలల సంఖ్యను 21కి పెంచారు. మరో 12 కళాశాలల అవసరం ఉంది. వాటిని వెంటనే ఇప్పించాలి. కిషన్రెడ్డికి దమ్ముంటే విభజన చట్టం హామీలను అమలు చేయించాలి. బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేయించాలి. ఎస్సీ వర్గీకరణ, బీసీల జనగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. వాటిని ఆమోదింపజేయాలి.
పార్లమెంటులోనూ నిలదీస్తాం
కిషన్రెడ్డి యాసంగి గురించి మాట్లాడకుండా వానాకాలం ధాన్యం సేకరణ గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఉన్న వాతావరణ పరిస్థితుల ప్రకారం ఉప్పుడు బియ్యమే వస్తాయి. అవి కొనబోమని, ముడిబియ్యం కావాలని కిషన్రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. శుక్రవారం తెరాస ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగే ధర్నాలు ప్రారంభం మాత్రమే. రాష్ట్ర హక్కుల సాధన కోసం ఇవి కొనసాగిస్తాం. పార్లమెంటులోనూ కేంద్రాన్ని నిలదీస్తాం’’ అని హరీశ్రావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!