TS News: జమునా హేచరీస్ ఆక్రమణలో 70.33 ఎకరాలు
మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబీకులకు చెందిన జమునా హేచరీస్ ఆక్రమణలో 70.33 ఎకరాల ఎసైన్డు, సీలింగ్ భూములున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ వెల్లడించారు. మెదక్ జిల్లా మాసాయిపేట
ఇవన్నీ ఎసైన్డు, సీలింగ్ భూములు
మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ వెల్లడి
సివిల్, క్రిమినల్ చర్యలకు సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ హరీశ్, చిత్రంలో అదనపు కలెక్టర్ రమేశ్, తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్
ఈనాడు, న్యూస్టుడే, మెదక్: మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబీకులకు చెందిన జమునా హేచరీస్ ఆక్రమణలో 70.33 ఎకరాల ఎసైన్డు, సీలింగ్ భూములున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ వెల్లడించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో పేదలకు కేటాయించిన ఈ భూములను కబ్జా చేశారని నిర్ధారించారు. దీంతో పాటు వివిధ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తెలిపారు. క్రిమినల్, సివిల్ చర్యలకు సిఫార్సు చేస్తూ సోమవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి ఈ వివరాలు వెల్లడించారు. ఈటల తమ భూములను ఆక్రమించుకున్నారని 8 మంది రైతులు ఈ ఏడాది ఏప్రిల్లో సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై రెవెన్యూ అధికారులు మే 1న సర్వే నిర్వహించి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందించారు. నోటీసులు ఇవ్వకుండా సర్వే చేస్తున్నారని, ఇతర కారణాలతో జమునా హేచరీస్ ప్రతినిధులు హైకోర్టుకు వెళ్లగా.. అప్పట్లో పూర్తిస్థాయిలో సర్వే జరగలేదు. తాజాగా కలెక్టర్ ఆధ్వర్యంలో నోటీసులు ఇచ్చి గత నెల 16న మళ్లీ సర్వే పనులు ప్రారంభించి వారంలో పూర్తి చేశారు. అనంతరం నివేదిక సిద్ధం చేశారు.
అచ్చంపేటలోని సర్వే సంఖ్య 77లో జమునా హేచరీస్కు వెళ్లేందుకు వేసిన దారిలో సీలింగ్ భూమిగా గుర్తించి ఏర్పాటు చేసిన హద్దురాయి
కలెక్టర్ తెలిపిన వివరాలివీ..
* హకీంపేటలో సర్వే సంఖ్య 97, అచ్చంపేటలో 77, 78, 79, 80, 81, 82, 130 సర్వే సంఖ్యల్లో కలిపి 70.33 ఎకరాలను దౌర్జన్యంగా ఆక్రమించారు. ఇందులో 61.13 ఎకరాలు ఎసైన్డ్ భూమి. 9.19 ఎకరాలు సీలింగ్ (ప్రభుత్వ) భూమి. 49 మంది బీసీలు, నలుగురు ఎస్సీలు, ఇద్దరు ఎస్టీలు, ఒక ఓసీకి చెందిన భూములివి. వాటిని స్వాధీనం చేసుకుని లబ్ధిదారులకు అందించాల్సి ఉంది. ఆక్రమించిన వారు ఎసైన్డు భూముల (బదిలీ నిషేధం) చట్టం ప్రకారం శిక్షార్హులు.
* సర్వే సంఖ్య 81లో అయిదెకరాలు, సర్వే సంఖ్య 130లో మూడెకరాలు జమునా హేచరీస్ పేరిట రిజిస్ట్రేషన్ అయ్యాయి. 2010 నుంచి నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములను రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు గమనించాం. చట్టం ప్రకారం సేల్డీడ్లను రద్దు చేయాలి. వ్యవసాయేతర అవసరాలకు వాడుకునేందుకు.. నమోదు చేసుకోకుండా భారీగా షెడ్ల నిర్మాణం చేపట్టారు. దీనికి సంబంధించి సబ్రిజిస్ట్రార్, తహసీల్దార్లపై విచారణ చేపట్టాలి.
* హేచరీస్ నుంచి వచ్చే వ్యర్థాలను సర్వే సంఖ్య 97లో పోస్తున్నట్లు తేలింది. దీంతో హల్దీవాగుకు అనుసంధానంగా ఉన్న ఎల్క చెరువు నీరు కలుషితమవుతోంది. భూగర్భజలాలతో పాటు వాయు కాలుష్యం నెలకొంటోంది. దీనిపై సమీప గ్రామాల ప్రజలు ఫిర్యాదులు చేశారు. పంచాయతీరాజ్, కాలుష్య నియంత్రణ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
* స్థానిక పంచాయతీల నుంచి అనుమతులు తీసుకోకుండానే హకీంపేట సర్వే సంఖ్య 111లో ఫౌల్ట్రీ ఫీడ్ నిల్వకు గాదెలు నిర్మించారు. అచ్చంపేట సర్వే సంఖ్య 130లో షెడ్లు ఏర్పాటు చేశారు. దీనిపై పంచాయతీ నుంచి తాఖీదులు జారీ అయ్యాయి. వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేసుకోకుండానే నిర్మాణాలు చేపట్టడంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది.
* సర్వే నం 130తో పాటు ఇతర సర్వే సంఖ్యల్లోని ఎసైన్డు భూములను జమునా హేచరీస్కు విక్రయానికి తెల్ల కాగితాలపై రాసుకున్న ఒప్పంద ప్రతులు లభ్యమయ్యాయి.
* ఈ రెండు గ్రామాల పరిధిలో మొత్తం 579 ఎకరాలు పేదలకు పంపిణీ చేశారు. ప్రస్తుతం సర్వే నిర్వహించిన భూముల్లో కాకుండా మరో 300 ఎకరాలకు సంబంధించి సర్వే చేయాలని దాదాపు 30 మంది వినతులు ఇచ్చారు. తమ భూముల్లోకి వెళ్లేందుకు అవకాశం లేకుండా ఆక్రమణలు జరిగాయని వారు చెబుతున్నారు. వాస్తవాలను గుర్తించేందుకు త్వరలో సర్వే చేపడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. -
మావోయిస్టు నేతలపై రివార్డు
మావోయిస్టు అగ్రనేతల తలలకు రాష్ట్ర పోలీసులు వెల కట్టారు. వారి ఆచూకీ చెబితే లక్షల్లో రివార్డు ఇస్తామని ప్రకటించారు. -
కందులకు గరిష్ఠ ధర రూ.11,246
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో కందులకు మంచి ధర పలుకుతోంది. మంగళవారం రైతులు మార్కెట్కు 50 క్వింటాళ్ల కందులు తీసుకురాగా.. క్వింటాకు గరిష్ఠ ధర రూ.11,246గా పలికింది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది.