Konijeti Rosaiah: అభిమాన నేతకు అంతిమ వీడ్కోలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్యకు కాంగ్రెస్ నాయకులు, అభిమానులు బరువెక్కిన హృదయాలతో అంతిమ వీడ్కోలు పలికారు. ఆయన భౌతికకాయాన్ని అమీర్పేట ధరమ్కరమ్ రోడ్డులోని ఇంట్లో ప్రజల
కడసారి చూపు కోసం తరలివచ్చిన శ్రేణులు
రోశయ్య పార్థివ దేహానికి నేతల నివాళులు
సోనియా తరఫున హాజరైన మల్లికార్జున ఖర్గే
అమీర్పేట, గాంధీభవన్, శామీర్పేట, న్యూస్టుడే: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్యకు కాంగ్రెస్ నాయకులు, అభిమానులు బరువెక్కిన హృదయాలతో అంతిమ వీడ్కోలు పలికారు. ఆయన భౌతికకాయాన్ని అమీర్పేట ధరమ్కరమ్ రోడ్డులోని ఇంట్లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దూతగా అంత్యక్రియలకు హాజరయ్యారు. కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, ప్రముఖ సినీనటుడు చిరంజీవి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు, తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఎంపీలు సురేశ్రెడ్డి, టీజీ వెంకటేష్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కేంద్ర మాజీమంత్రి పల్లంరాజు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు రామకృష్ణ టంగుటూరి, తెరాస పార్లమెంటరీ నేత కె.కేశవరావు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ తిరుమలగిరి సురేందర్ తదితరులు సందర్శించి నివాళులర్పించారు. ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు.. మధ్యాహ్నం 12 గంటలకు భౌతికకాయాన్ని నాంపల్లిలోని గాంధీభవన్కు తీసుకువచ్చారు. తెలుగు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి, శైలజానాథ్, మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, వి.హనుమంతరావు తదితరులు ఆయన పార్థివ దేహాన్ని ఉంచిన పేటికను మోస్తూ గాంధీభవన్ లోపలికి తీసుకువెళ్లారు. కాంగ్రెస్ పార్టీ, ఈ దేశం గొప్ప ప్రజాస్వామ్యవాదిని కోల్పోయాయని రేవంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్అలీ, బలరాం నాయక్, సీతక్క, మల్లు రవి, జి.నిరంజన్ పాల్గొన్నారు. అభిమాన నేతను కడసారి చూసేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అక్కడి నుంచి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దేవరయాంజల్ గ్రామంలో ఉన్న వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర సాగింది. రోశయ్య కుమారులు శివ సుబ్బారావు, శ్రీనివాసమూర్తి దహన సంస్కారాలు నిర్వహించారు. డాక్టర్ గీతారెడ్డి, శ్రీధర్బాబు, మర్రి శశిధర్రెడ్డి, సంపత్కుమార్, మాజీమంత్రి నక్కా ఆనంద్బాబు, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ దామోదర్, నిజామాబాద్ ఎమ్మెల్యే గణేశ్ గుప్త, ఏపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, ఏఐసీసీ కార్యదర్శి రుద్రరాజు పద్మరాజు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఇన్ఛార్జి కలెక్టర్ హరీష్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖుల నివాళి
కాంగ్రెస్ గొప్ప నేతను కోల్పోయిందని మల్లికార్జున ఖర్గే అన్నారు. రోశయ్య మరణవార్త విని సోనియాగాంధీ తీవ్రంగా చలించిపోయారని తెలిపారు. ఆయన 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారని, ఏ పదవి అప్పగించినా సమర్థంగా నిర్వర్తించారని పేర్కొన్నారు. ఏఐసీసీ, సోనియాగాంధీ తరఫున ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రోశయ్య మృతి రాజకీయ వ్యవస్థకు తీరనిలోటని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. సభలో ఎంతగా ఘర్షణ పడినా శత్రువుల మాదిరి కాకుండా, రాజకీయ ప్రత్యర్థుల్లాగే చూసేవారని పేర్కొన్నారు. నాటి సీఏం వై.ఎస్.రాజశేఖరరెడ్డికి కవచంలా ఉన్న ఘనత రోశయ్యకు దక్కుతుందని అన్నారు. అవినీతి ఆరోపణలకు దూరంగా ఉంటూ రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలిచారని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆర్థికమంత్రి అంటే ఇప్పటికీ రోశయ్యే గుర్తుకొస్తారని పేర్కొన్నారు. శాసనసభలో, పార్లమెంట్లో ఆయనను చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నామని తెలిపారు. ఆయనొక నిఘంటువు వంటివారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎంత కోసం ఉన్నా ముఖంలో ఎప్పుడూ చూపలేదని, ఎంత క్లిష్టమైన సమస్యనైనా చాకచక్యంగా పరిష్కరించేవారని గుర్తుచేసుకున్నారు.
ప్రకాశం జిల్లాలో విగ్రహం పెడతాం: బాలినేని
తెలుగు ప్రజలకు చిరకాలం గుర్తుండిపోయే వ్యక్తి రోశయ్య అని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి అన్నారు. వివాదరహితుడిగా తోటి శాసనసభ్యులకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రకాశం జిల్లాలో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?