Telangana News: సం‘క్రాంతి’ బాటలో లక్ష్మీనగర్.. 75వ పుట్టినరోజు వేడుకలకు సిద్ధం
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మరుసటి ఏడాది అది.. గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి నుంచి వలస వచ్చిన కొన్ని కుటుంబాలు.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో బీడు భూములు కొనుగోలు చేసి వ్యవసాయం ఆరంభించాయి.
నాడు వలస ఆవాసం.. నేడు ఆదర్శ గ్రామం
పాపన్నపేట, న్యూస్టుడే: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మరుసటి ఏడాది అది.. గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి నుంచి వలస వచ్చిన కొన్ని కుటుంబాలు.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో బీడు భూములు కొనుగోలు చేసి వ్యవసాయం ఆరంభించాయి. అక్కడే పూరిగుడిసెలు వేసుకొని లక్ష్మీనగర్ పేరుతో ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అలాంటి గ్రామం నేడు చక్కటి రహదారులు, వాటర్ ప్లాంట్, సీసీ కెమెరాలు, గ్రామం పేరుతో వెబ్సైట్, ఫంక్షన్ హాల్, సోలార్ వీధి దీపాలు.. ఇలా అన్ని హంగులూ సమకూర్చుకుని ఆదర్శ గ్రామంగా రూపుదాల్చింది. ఐక్యంగా సాగడం, కమిటీలు ఏర్పాటు చేసుకొని అభివృద్ధి పనులు నిర్వహించుకోవడం తమ విజయ రహస్యమని గ్రామస్థులు చెబుతున్నారు. ఏటా సంక్రాంతికి గ్రామ పుట్టిన రోజు జరుపుకోవడం వారికి ఆనవాయితీ. ఆ రోజు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద.. ఏడాదిలో మృతి చెందిన వారికి పేరు పేరునా నివాళులర్పించడం మరో విశేషం. ఈ సంక్రాంతికి లక్ష్మీనగర్ 75వ పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకోవడానికి గ్రామస్థులంతా ఏర్పాట్లు చేసుకున్నారు. ఐక్యతతో ‘క్రాంతి’ పథంలో అడుగులు వేస్తున్న లక్ష్మీనగర్ విశేషాలివి.
220 కుటుంబాలు.. 1200 జనాభా
అప్పట్లో కొత్తపల్లి పంచాయతీలో భాగంగా ఉన్న లక్ష్మీనగర్ 1995లో ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. గ్రామస్థులు విరాళాలు సేకరించి పంచాయతీ భవనాన్ని నిర్మించుకున్నారు. గ్రామంలో 220 వరకు నివాసాలు.. 1,200 మంది జనాభా ఉన్నారు. వాటర్ ప్లాంట్ కమిటీ, హరితహారం కమిటీ, ఆలయ కమిటీ, సర్వే కమిటీ, ఆక్టివ్ వాలంటీర్ కమిటీలను ఏర్పాటు చేసుకుని ఆయా పనులను నిర్వహించుకుంటున్నారు. ఈ గ్రామానికి చెందిన పెండ్యాల ప్రసాద్ (సాఫ్ట్వేర్ ఇంజినీరు) సంకల్పంతో 2014లో 11 మందితో సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశారు. 2019లో గ్రామానికి చెందిన అనురాధ సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో ఉన్నవారికి కొత్తగా స్వయం ఉపాధి కల్పించే మార్గాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
సాధించారిలా..
గ్రామంలో తాగునీటి ఎద్దడితో పాటు ఫ్లోరైడ్ సమస్య ఉండేది. బాలవికాస సంస్థ సహకారంతో 2015లో నీటి శుద్ధి ప్లాంట్ను ఏర్పాటు చేసుకున్నారు. రూ.8 లక్షలతో భవనం నిర్మించారు. భద్రతలో భాగంగా 13 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. అంతర్గత రహదారులు, మురుగు కాల్వలు నిర్మించుకున్నారు. 2015లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం ప్రారంభించారు. ప్రతివీధిలో సౌర దీపాలు ఏర్పాటు చేసుకున్నారు. సర్కారు, దాతల సహకారంతో రూ.10 లక్షలతో 2019లో వైకుంఠధామం నిర్మించుకున్నారు. 2017లో లక్ష్మీనగర్ ప్రగతి సెంటర్ పేరుతో రూ.50 లక్షలతో ఫంక్షన్హాల్ నిర్మించుకున్నారు. అవర్లక్ష్మీనగర్.కామ్ పేరుతో వెబ్సైట్ను రూపొందించి.. ఎప్పటికప్పుడు గ్రామ విశేషాలను అందులో పొందుపరుస్తున్నారు. ‘‘కమిటీల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాం. ‘వోకల్ ఫర్ లోకల్ లక్ష్మీనగర్’ నినాదంతో మరిన్ని సంక్షేమ పనులు చేపట్టబోతున్నాం. ల్యాబ్తో కూడిన జనరిక్ మెడికల్ దుకాణం ఏర్పాటుతో పాటు, మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం’’ అని పెండ్యాల ప్రసాద్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్