MLC Elections: సుదీర్ఘ కసరత్తు
ఎమ్మెల్యేల కోటాలో పోటీ చేయనున్న తెలంగాణ రాష్ట్రసమితి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. విశ్వసనీయ సమాచారం మేరకు జాబితా తుదిరూపుకొచ్చినా సోమవారం అర్థరాత్రి వరకు అధికారికంగా విడుదల కాలేదు. ఉదయం నుంచి గుత్తా సుఖేందర్రెడ్డి, కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, కౌశిక్రెడ్డి, కోటిరెడ్డి, ఆకుల లలిత, ఎర్రోళ్ల శ్రీనివాస్, మధుసూదనాచారి, మరికొందరు ఆశావహులతో సుదీర్ఘ మంతనాలు జరిగినా.. ఒకటి, రెండు స్థానాలపై చివరి
చివరి నిమిషంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో మార్పులు, చేర్పులు
అధికారికంగా వెల్లడికాని తెరాస జాబితా
పార్టీ అభ్యర్థులకు సమాచారం
ఈనాడు, హైదరాబాద్: ఎమ్మెల్యేల కోటాలో పోటీ చేయనున్న తెలంగాణ రాష్ట్రసమితి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. విశ్వసనీయ సమాచారం మేరకు జాబితా తుదిరూపుకొచ్చినా సోమవారం అర్థరాత్రి వరకు అధికారికంగా విడుదల కాలేదు. ఉదయం నుంచి గుత్తా సుఖేందర్రెడ్డి, కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, కౌశిక్రెడ్డి, కోటిరెడ్డి, ఆకుల లలిత, ఎర్రోళ్ల శ్రీనివాస్, మధుసూదనాచారి, మరికొందరు ఆశావహులతో సుదీర్ఘ మంతనాలు జరిగినా.. ఒకటి, రెండు స్థానాలపై చివరి నిమిషంలో మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నట్లు తెలిసింది. సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి పేరు సైతం పరిశీలనకు వచ్చింది. గవర్నర్ కోటాలో ఆయన ఎంపిక విషయమై చర్చించినట్లు తెలిసింది. వడబోత అనంతరం జాబితాను ఖరారు చేసిన ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్..అభ్యర్థులకు సమాచారం ఇచ్చి వారిని మంగళవారం నామినేషన్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేల కోటాలో ఆరు, గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఒక స్థానానికి అభ్యర్థుల ఎంపికపై సోమవారం ఉదయం నుంచే సీఎం ప్రగతిభవన్లో సమావేశమయ్యారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు, మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డిలతో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ తదితరులు ఇందులో పాల్గొన్నట్లు తెలిసింది. అర్ధరాత్రి వరకు మంతనాల అనంతరం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. ఖరారయిన అభ్యర్థులకు నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని సమాచారం అందింది. పోటీ తీవ్రంగా ఉన్నందున ఆరు స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై గులాబీ పార్టీ అధిష్ఠానం ఆచితూచి కసరత్తు చేసింది. గుత్తా సుఖేందర్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ మధుసూదనచారి, ఆకుల లలిత తదితరుల పేర్లను పరిశీలించింది.
నామినేషన్లకు నేడు చివరి రోజు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు మంగళవారంతో ముగియనుంది. ఈనెల 29న ఎన్నికలు నిర్వహించనున్నారు. అదేరోజు లెక్కింపు జరుగుతుంది. స్థానిక సంస్థల కోటాలో 12 స్థానాలకు మంగళవారం నుంచి 23 వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. డిసెంబరు 10న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
సంక్షిప్త వార్తలు
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?