MLC Elections: 12 స్థానాలకు 102 నామినేషన్లు
రాష్ట్రంలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 102 నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లను తెరాస మద్దతుదారులు
ఆదిలాబాద్లో ఒకే స్థానానికి 24 మంది నామినేషన్లు
నిజామాబాద్లో ఇద్దరే..
కరీంనగర్లో స్వతంత్రుడిగా తెరాస మాజీ మేయర్
మెదక్, ఖమ్మం బరిలో కాంగ్రెస్
రంగారెడ్డిలో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ పత్రాల చించివేతతో ఉద్రిక్తత
రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ పత్రాలు చించివేస్తున్న వ్యక్తి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 102 నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లను తెరాస మద్దతుదారులు చించివేయడంతో రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. నామినేషన్ల గడువు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. తెరాస అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ మెదక్, ఖమ్మంలలో తన అభ్యర్థులను నిలిపింది. కరీంనగర్ మాజీ మేయర్, తెరాస నేత రవీందర్సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. బుధవారం నామినేషన్ల పరిశీలన జరగనుండగా.. 26 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. డిసెంబరు 10న ఎన్నికలు జరగనున్నాయి. 14న ఫలితాలు వెల్లడిస్తారు.
* నిజామాబాద్లో తెరాస అభ్యర్థినిగా ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్ వేయగా.. అందులో ‘మద్దతు సంతకాలు’ తమవి కావని ఇద్దరు ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో వివాదం ఏర్పడింది.
* గారెడ్డి జిల్లాలో 2 స్థానాలకు తెరాస అభ్యర్థులుగా ప్రస్తుత ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పట్నం మహేందర్రెడ్డి నామినేషన్ వేశారు. మరో స్వతంత్ర అభ్యర్థి సైతం దాఖలు చేశారు.
* రీంనగర్లో రెండు స్థానాలకు 27 మంది నామినేషన్లు వేశారు. తెరాస అభ్యర్థులుగా ప్రస్తుత ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్రావు, మాజీ మంత్రి ఎల్.రమణ బరిలో నిలిచారు. తనకు కీలక పదవి ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్న మాజీ మేయర్ రవీందర్సింగ్ అధిష్ఠానం ఆదేశాలను ధిక్కరించి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మరో 24 మంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.
* హబూబ్నగర్లో 2 స్థానాలకు 10 మంది నామినేషన్లు వేశారు. తెరాస అభ్యర్థులుగా ప్రస్తుత ఎమ్మెల్సీలు కూచికుళ్ల దామోదర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మరో ఎనిమిది మంది స్వతంత్రులు నామినేషన్లు దాఖలుచేశారు.
* మ్మంలో ఒక స్థానానికి తెరాస అభ్యర్థిగా తాతా మధుసూదన్, కాంగ్రెస్ తరఫున రాయల నాగేశ్వరరావులతో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
* మెదక్లో ఒక స్థానానికి ఏడుగురు నామినేషన్లు వేశారు. వీరిలో తెరాస అభ్యర్థిగా డాక్టర్ యాదవరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థినిగా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య నిర్మలతో పాటు అయిదుగురు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.
* నల్గొండ జిల్లాలో ఒక స్థానానికి 11 మంది నామినేషన్లు వేశారు. తెరాస అభ్యర్థిగా ఎంసీ కోటిరెడ్డితో పాటు మరో 10 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
* వరంగల్లో ఒక స్థానానికి 14 నామినేషన్లు దాఖలయ్యాయి. తెరాస అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మరో 13 మంది స్వతంత్ర అభ్యర్థులు ఈ జాబితాలో ఉన్నారు.
* ఆదిలాబాద్ జిల్లాలో ఒక స్థానానికి 24 నామినేషన్లు దాఖలయ్యాయి. వీరిలో తెరాస అభ్యర్థిగా దండె విఠల్, మరో 23 మంది స్వతంత్రులు ఉన్నారు.
మూడోసారి నామినేషన్ దాఖలుకు వెళ్తున్న స్వతంత్ర అభ్యర్థి శైలజ చేతిలో పత్రాలను లాక్కునేందుకు
యత్నిస్తున్న వ్యక్తిని నిలువరిస్తున్న పోలీసులు
అఫిడవిట్లో కవిత కుటుంబ ఆస్తులు..
ఈనాడు, నిజామాబాద్: తన పేరుపై రూ.14.78 కోట్లు, భర్త పేరిట రూ.14 కోట్లు, ఇద్దరు పిల్లల పేర్లపై రూ.8.90 లక్షల చరాస్తులున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆమె పేరుపై రూ.9.30 కోట్లు, భర్త పేరిట రూ.9.39 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు పొందుపరిచారు. దంపతులిద్దరి పేరిట రూ.21.62 కోట్ల అప్పులు ఉన్నట్లుగా చూపారు. ఉద్యమ సమయంలో రెండు కేసులు నమోదైనట్లు ప్రస్తావించారు.
రంగారెడ్డిలో ఘర్షణ..
స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ పత్రాలను తెరాస మద్దతుదారులు చించివేయడంతో రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. మంగళవారం ఉదయం తెరాస అభ్యర్థులు పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజు తమ అనుచరులతో కలిసి వచ్చి నామినేషన్లు వేశారు. వారికి మద్దతుగా వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున కలెక్టరేట్ గేటు వద్దే వేచి ఉన్నారు. అదే సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి భార్య, రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు చింపుల శైలజ కలెక్టరేట్కు వచ్చారు. వారిని అక్కడున్న నాయకులు అడ్డుకుని నామినేషన్ పత్రాలు లాక్కొని చించివేశారు. అలా మూడుసార్లు జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో తన కుమారుడు అశ్విన్రెడ్డిపై, ప్రపోజర్స్పైనా దాడి జరిగిందని సత్యనారాయణరెడ్డి వాపోయారు. పోలీసులు లాఠీఛార్జీ చేసి పరిస్థితిని అదుపు చేశారు. ఈ ఘటనపై శైలజ సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధుల ఫోన్లను పట్నం మహేందర్రెడ్డి పీఏ మల్లారెడ్డి లాక్కోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా