Omicron: వ్యాక్సినేషన్ రేటు తగ్గడమే కారణమా?
కొవిడ్ వ్యాప్తి తగ్గుతున్న క్రమంలోనే కొత్త వేరియంట్లు ఉద్భవిస్తుండటం ఆందోళనకరంగా మారింది. ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తర్వాత టీకా పంపిణీ, వైరస్ మ్యూటేషన్లు, కొత్త వైరస్పై వ్యాక్సిన్ల
టీకాలు విస్తృతంగా ఇవ్వకపోవడం వల్లే ఒమిక్రాన్ పుట్టి ఉండొచ్చని నిపుణుల విశ్లేషణ
దిల్లీ: కొవిడ్ వ్యాప్తి తగ్గుతున్న క్రమంలోనే కొత్త వేరియంట్లు ఉద్భవిస్తుండటం ఆందోళనకరంగా మారింది. ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తర్వాత టీకా పంపిణీ, వైరస్ మ్యూటేషన్లు, కొత్త వైరస్పై వ్యాక్సిన్ల సమర్థత అంశాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాక్సినేషన్ విస్తృతి తక్కువగా ఉండటం వల్లే కొత్త రకాలు పుట్టుకొస్తుండొచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు.
కొత్త వేరియంట్లు ఎలా పుడతాయంటే?
రోగి శరీరంలో వైరస్ తన ప్రతిరూపాలను తయారుచేసుకుంటుంది. సాధారణంగానే ఈ ప్రతిరూపాల్లో కొన్ని మార్పులు కనిపిస్తాయి. మానవుల్లో ఇన్ఫెక్షన్ కలిగించేందుకు కొన్ని సార్స్ వైరస్లు మాత్రమే అవసరమవుతాయి. ఇవి ఊపిరితిత్తుల్లోకి చేరి పునరుత్పత్తి చేయడం ప్రారంభిస్తే రోగికి ప్రమాదకరంగా మారుతుంది. రోగి శరీరంలో లక్షల కొద్దీ వైరస్ కణాలు పుట్టుకొస్తాయి. ఇందులో కొన్ని కణాలు రోగి శరీరం నుంచి (శ్వాసకోశం ద్వారా) బయటకు వచ్చి ఇతరులకు వ్యాపిస్తాయి. వైరస్ కణాలు ఉద్భవించే క్రమంలో ఆర్ఎన్ఏ పునరుత్పత్తి సరిగా జరగదు. దీంతో వైరస్ నిర్మాణంలో తప్పులు దొర్లుతాయి. తద్వారా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయి.
కొన్ని వేరియంట్లు ఎందుకు ప్రమాదకరం?
వైరస్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించినప్పుడు కొన్ని వేరియంట్లు కణాల్లోకి చొరబడే సామర్థ్యాన్ని అధికంగా కలిగి ఉంటాయి. మరికొన్ని రకాలు మాత్రం పునరుత్పత్తిలో మెరుగ్గా ఉంటాయి. కొన్ని ‘ఫిట్టర్’ వేరియంట్లు ప్రధాన వైరస్గా మారుతుంటాయి. ఎవరికైనా సార్స్-కోవ్-2 సోకితే.. ఆ రోగి శరీరం మరింత చురుకైన వేరియంట్లను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది.
వేగంగా వ్యాపిస్తుందా?
ఒమిక్రాన్ వేరియంట్కు సంబంధించిన స్పైక్ ప్రోటీన్లో 32 ఉత్పరివర్తనలు ఉన్నట్లు వెల్లడైంది. వ్యాప్తిని అధికం చేసే మ్యూటేషన్లతో పాటు రోగనిరోధకతను ఏమార్చే మార్పులూ ఇందులో ఉన్నాయి. కాబట్టి ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంది.
వైరస్ మార్పులపై వ్యాక్సిన్ల ప్రభావం?
డెల్టా సహా సార్స్-కోవ్-2పై ప్రస్తుత వ్యాక్సిన్లు ప్రభావవంతంగానే పనిచేస్తున్నాయి. ఈ టీకాలు వైరస్లోని స్పైక్ ప్రొటీన్ను లక్ష్యంగా చేసుకుంటాయి. ఆ ప్రొటీన్ సాధారణంగా ఎక్కువ మార్పులకు లోను కాదు. కాబట్టి వైరస్పై టీకాలు ఇంకా పనిచేస్తున్నాయి. అయితే, బీటా, గామా, లాంబ్డా, మ్యూ వంటి కొన్ని వేరియంట్లు వ్యాక్సిన్ ఇమ్యూనిటీని కొంతమేర ఎదుర్కొంటున్నాయి. రోగనిరోధక వ్యవస్థ వాటిని గుర్తించకపోవడమే ఇందుకు కారణం. అయితే, రోగనిరోధకతను ఎదిరించే వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా పరిమితంగానే ఉన్నాయి.
తక్కువ వ్యాక్సినేషన్ రేటు కారణమా?
టీకా కవరేజీకి, సార్స్-కోవ్-2 వేరియంట్లు పుట్టుకురావడానికి మధ్య ఉన్న సంబంధంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. అయితే వ్యాక్సినేషన్ విస్తృతి తక్కువగా ఉంటే నిర్దిష్ట ప్రాంతంలో వైరస్ వ్యాప్తి పెరిగి కొత్త వేరియంట్లు ఉద్భవించే ప్రమాదం పెరుగుతుంది. దక్షిణాఫ్రికాలో వ్యాక్సినేషన్ రేటు 24 శాతం మాత్రమే ఉండటం ఇక్కడ ప్రస్తావనార్హం. వ్యాక్సిన్ సమర్థత సుదీర్ఘకాలం ఉండాలి.
దక్షిణాఫ్రికాలో తక్కువ వ్యాక్సిన్ కవరేజీ సైతం ఒమిక్రాన్ పుట్టుకకు కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదకరమైన ఒమిక్రాన్ ఆవిర్భావానికి వైరస్లో ఇదివరకు సంభవించిన మార్పులు సైతం కారణమై ఉండొచ్చు. మ్యూటేషన్లు అధికంగా ఉన్న వేరియంట్లు ఇదివరకూ పుట్టుకొచ్చాయి. అయితే అవేవీ ఇంత వేగంగా వ్యాప్తి చెందలేదు. వ్యాక్సిన్ కవరేజీని పెంచడం ద్వారా వైరస్లో మార్పులను పరిమితం చేయవచ్చు. టీకా విస్తృతి అనేది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొత్త వేరియంట్ల వ్యాప్తిని కట్టడి చేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్