Omicron: 20 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్
ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ గురించి తాజాగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగు చూడటానికి ముందే... గత అక్టోబరులోనే ఈ కొత్త వేరియంట్ పలు దేశాలకు వ్యాపించినట్టు స్పష్టమవుతోంది.
దక్షిణాఫ్రికా కంటే ముందే నైజీరియాలో నమోదు
యూరోపియన్ దేశాల్లో 44కు చేరిన కొత్త వేరియంట్ బాధితులు
టోక్యో: ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ గురించి తాజాగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగు చూడటానికి ముందే... గత అక్టోబరులోనే ఈ కొత్త వేరియంట్ పలు దేశాలకు వ్యాపించినట్టు స్పష్టమవుతోంది. అయితే, దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది? టీకా వల్ల కలిగే రోగనిరోధక శక్తిని ఇది తప్పించుకుంటుందా? అన్న కీలక విషయాల్లో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. పలు ఐరోపా దేశాల్లో డెల్టా కారణంగా పెద్దసంఖ్యలో బాధితులు ఆసుపత్రుల్లో చేరుతున్న క్రమంలోనే, ఒమిక్రాన్ కేసులు కూడా నమోదవుతున్నాయి. కొత్త వేరియంట్ కారణంగా యూరోపియన్ యూనియన్లోని 11 దేశాల్లో ఇప్పటివరకూ 44 కేసులు నమోదయ్యాయి! వీరిలో చాలామంది ఆఫ్రికా దేశాలకు వెళ్లి వచ్చినవారేనని తేలింది. తాజాగా మరిన్ని దేశాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఈ వేరియంట్ వ్యాపించిన దేశాల సంఖ్య 20కు చేరింది.
అక్టోబరు ప్రారంభంలోనే తొలికేసు?
నైజీరియాలో ఒమిక్రాన్ తొలి కేసు నమోదైంది. అక్టోబరులో సేకరించిన నమూనాలను పరీక్షించగా కొత్త వేరియంట్ నిర్ధారణ అయినట్టు ఆ దేశ జాతీయ ప్రజాఆరోగ్య సంస్థ బుధవారం వెల్లడించింది. కొత్త వేరియంట్ గురించి దక్షిణాఫ్రికా అప్రమత్తం చేయడానికి కొన్నివారాల ముందే అక్కడి నుంచి వచ్చినవారి నుంచి ఈ నమూనాలను సేకరించినట్టు తెలిపింది. ఆఫ్రికా నుంచి ఇటీవల సౌదీ అరేబియా వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్టు పరీక్షల్లో నిర్ధారణ అయింది.
అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు
డిసెంబరు చివరి వరకూ కొత్త రిజర్వేషన్లను తీసుకోవద్దని అంతర్జాతీయ ఎయిర్స్ లైన్స్ సంస్థలను జపాన్ ఆదేశించింది. దేశంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైనందున, అత్యవసర చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. నవంబరు 22 నుంచి దేశ వ్యాప్తంగా అమలుచేస్తున్న లాక్డౌన్ను ఆస్ట్రియా సర్కారు ఈనెల 11 వరకూ పొడిగించింది. అత్యవసర వస్తువుల దుకాణాలను ఇకపై సాయంత్రం 7 గంటలకే మూసివేయాలని ఆదేశించింది. క్రిస్మస్ ట్రీ అమ్మకాలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. ఒమిక్రాన్పై చర్చించేందుకు అత్యవసరంగా బ్లాక్ లీడర్స్ స్థాయి సమావేశం నిర్వహించాలన్న ప్రతిపాదనను యురోపియన్ యూనియన్ నిరాకరించింది. డిసెంబర్ 16న నేతల సమావేశానికి ముందు... 27 దేశాల ఆరోగ్యశాఖ మంత్రులు ప్రస్తుత పరిస్థితులను అంచనా వేస్తారని ఈయూ అధికారి తెలిపారు. ప్రస్తుతం జర్మనీ, ఆస్ట్రియా, దక్షిణ కొరియాల్లో డెల్టా కారక కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి.
విదేశాల నుంచి రాక.. ఆరుగురికి పాజిటివ్!
దిల్లీ: దక్షిణాఫ్రికా తదితర ఎట్-రిస్క్ దేశాల నుంచి 3,476 మంది ప్రయాణికులు బుధవారం భారత్ వచ్చారు. వీరికి పరీక్షలు నిర్వహించగా, ఆరుగురికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ నిమిత్తం ప్రయోగశాలకు పంపారు. కేంద్ర ఆరోగ్యశాఖ ఈ వివరాలు తెలిపింది. వీరిలో నెదర్లాండ్స్, బ్రిటన్ నుంచి వచ్చినవారు నలుగురు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఆరుగురిని లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రికి తరలించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి. దక్షిణాఫ్రికాతో పాటు బ్రిటన్, బ్రెజిల్, బోట్స్వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్లను కేంద్రం ఎట్-రిస్క్ దేశాలుగా పేర్కొన్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.