Omicron: తగ్గుతోంది కానీ..
ఒమిక్రాన్ బారినపడినా..3-4 రోజుల్లోనే ఎక్కువ మంది కోలుకుంటున్నారు. వారం రోజుల తర్వాత తిరిగి విధుల్లోకి చేరుతున్నవారూ ఉన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ అత్యధిక శాతం
దగ్గు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం..
ఒమిక్రాన్లో వేధిస్తున్న ప్రధాన సమస్యలివి
జ్వరం, జలుబు, గొంతునొప్పి తగ్గుముఖం
ఆసుపత్రిలో చేరికలు అతి స్వల్పం
ఈనాడు, హైదరాబాద్: ఒమిక్రాన్ బారినపడినా..3-4 రోజుల్లోనే ఎక్కువ మంది కోలుకుంటున్నారు. వారం రోజుల తర్వాత తిరిగి విధుల్లోకి చేరుతున్నవారూ ఉన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ అత్యధిక శాతం మందిలో గొంతుకే పరిమితమవుతుండటంతో.. ఆసుపత్రుల్లో చేరికలు కూడా అతి స్వల్పంగా ఉంటున్నాయని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు త్వరగానే తగ్గుముఖం పట్టినా..దగ్గు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం వంటివి మాత్రం వదలట్లేదు. వీటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, లక్షణాలకు అనుగుణంగా మందులు వాడడం ద్వారా నయమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దగ్గు తీవ్రత పెరిగినా..స్వల్ప దగ్గు కూడా 6-7 రోజులకూ తగ్గకపోయినా.. వైద్యుడిని సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. అత్యధిక సందర్భాల్లో గొంతు వరకే పరిమితమైన ఒమిక్రాన్.. స్వల్ప సమయాల్లో ఊపిరితిత్తుల్లోకి చేరే అవకాశాలున్నాయనీ..దీన్ని తొలిదశలో గుర్తించడం ద్వారా ముప్పు నుంచి తప్పించుకోవడానికి అవకాశముంటుందని వైద్యులు వివరిస్తున్నారు.
రెండోదశ కంటే భిన్నంగా..
కొవిడ్ రెండోదశలో డెల్టా వేరియంట్ విజృంభించినప్పుడు..అధికుల్లో శ్వాసకోశాలపై దుష్ప్రభావం పడింది. ఒమిక్రాన్ బాధితుల్లో పెద్దగా సమస్యలు ఎదురవడం లేదు.శ్వాసకోశాల్లో ఇన్ఫెక్షన్కు గురైనవారు కూడా ఒక శాతం కంటే తక్కువ మందే ఉంటున్నారు. ఆసుపత్రిలో చేరేవారు కూడా అతి స్వల్ప సంఖ్యలోనే ఉంటున్నారు.
ఒమిక్రాన్లో కనిపిస్తున్న లక్షణాలివి..
అత్యధికుల్లో తొలుత గొంతులో ఇబ్బంది, దురదతో వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. కొందరిలో తలనొప్పితోనూ వ్యాధి మొదలవుతోంది. పారాసెటమాల్ ఇచ్చినా తగ్గడం లేదు. తలనొప్పి కొందరికి ఒకవైపే వచ్చి తీవ్రంగా వేధిస్తుంది. ఆ తర్వాత గొంతునొప్పి, జలుబు, దగ్గు, జ్వరం ఎక్కువగా ఉంటోంది. కొందరు చలి జ్వరంతోనూ ఇబ్బంది పడుతున్నారు. డెంగీలో వచ్చినట్లుగా ఒళ్లునొప్పులు వస్తున్నాయి. ఉన్నట్టుండి చెమట పడుతోంది. పిల్లల్లో కొందరికి వాంతులు వస్తున్నాయి. కళ్లు కూడా ఎర్రబడుతున్నాయి. కొందరిలో వ్యాధి తగ్గినా కూడా.. 2-3 వారాలైనా దగ్గు తగ్గడం లేదు. దీనికి వేర్వేరు కారణాలుంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.సైనస్, గొంతు ఇన్ఫెక్షన్ వల్ల కూడా దగ్గు రావచ్చు. రాత్రివేళ పడుకున్నప్పుడు సైనస్ల నుంచి తెమడ ముక్కులోకి.. అక్కడి నుంచి గొంతులోకి జారుతుంది. దీన్ని బయటకు పంపించే ప్రక్రియలో భాగంగా దగ్గు వస్తుంది.అందుకే రాత్రి పూట ఎక్కువవుతుంది. పారాసెటమాల్ వేసుకున్నా తగ్గకపోతే.. ఇతర మందులు ప్రయత్నించాల్సి ఉంటుంది.
సీటీ స్కాన్లు చేయించడం లేదు
ఇప్పుడొస్తున్న ఇన్ఫెక్షన్లలో 95 శాతానికి పైగా ఒమిక్రానే. వైరస్ గొంతు వరకే పరిమితమవుతోంది. శ్వాసకోశాల్లోకి వెళ్లడం లేదు. గతంలో డీ డైమర్ విపరీతంగా పెరిగి, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు డీ డైమర్ కూడా పెరగడం లేదు. ఎక్స్రే, సీటీ స్కాన్లు కూడా చేయడంలేదు. నిమోనియా వైపు ఎక్కువ కేసులు వెళ్లడం లేదు. చాలా కొద్దిమందిలో..అదీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి మాత్రమే ఆక్సిజన్ అవసరమవుతోంది. నిమ్స్లో అయితే ఒమిక్రాన్ బాధితుల్లో ఒక్కరు కూడా వెంటిలేటర్ పైకి వెళ్లలేదు. దీనివల్ల ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా సంభవించలేదు. చాలామంది పారాసెటమాల్తోనే కోలుకుంటున్నారు. దగ్గు మూణ్నాలుగు రోజుల కంటే ఎక్కువగా ఉంటే దగ్గు మందు ద్రావణాన్ని సూచిస్తున్నాం.గొంతునొప్పి మూణ్నాలుగు రోజులైనా తగ్గకపోతే..అజిత్రోమైసిన్ వంటి యాంటిబయాటిక్స్ ఇస్తున్నాం.
- డాక్టర్ పరంజ్యోతి, పల్మనాలజీ విభాగాధిపతి, నిమ్స్
లక్షణాలు తీవ్రమైతే ఆసుపత్రికి
డెల్టాలో సాధారణంగా పొడి దగ్గు వచ్చేది. ఒమిక్రాన్లో తెమడతో కూడా దగ్గు వస్తోంది. లక్షణాలు తక్కువగా ఉండి ఎక్కువ రోజులున్నా కూడా సీఆర్పీ వంటి కొన్ని పరీక్షలు చేయిస్తున్నాం.ఎందుకంటే అంతర్లీనంగా ఏమైనా ఉన్నాయా అనేది పరిశీలించాల్సిన అవసరముంది. నిమోనియా దశకు వెళ్లినప్పుడు ఆయాసం, ఛాతీ పట్టేసినట్లుగా ఉండడం, మానసికంగా అయోమయ స్థితి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంట్లో చికిత్స పొందుతున్న క్రమంలో.. మగతగా ఉండడం..రక్తంలో ఆక్సిజన్ శాతం 94 కంటే తక్కువకు పడిపోతుండడం.. నాడి కొట్టుకోవడం 100 దాటుతున్నా..నిస్సత్తువ ఆవహించినా..డీడైమర్, సీఆర్పీ వంటి పరీక్షల్లో ఫలితాలు ఉండాల్సిన దాని కంటే 2-3 రెట్లు అధికంగా ఉన్నా..వెంటనే ఆసుపత్రిలో చేరాలని గుర్తుంచుకోవాలి.
- డాక్టర్ విశ్వనాథ్ గెల్లా, ప్రముఖ శ్వాసకోశ నిపుణులు, ఏఐజీ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్