Paddy Procurement: ధాన్యం కొనుగోళ్లపై అదే అస్పష్టత
ధాన్యం కొనుగోళ్ల విషయంలో అస్పష్టత తొలగిపోలేదు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగినందున ధాన్యం కొనుగోళ్లను పెంచాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి పీయూష్
కేంద్ర మంత్రి గోయల్తో భేటీలో లభించని హామీ
ఏడాదికి ఒకేసారి కొనుగోళ్ల లక్ష్యం నిర్దేశించాలని రాష్ట్ర బృందం వినతి
26న మరోసారి సమావేశం
దిల్లీలో మంగళవారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో రాష్ట్ర మంత్రి కేటీఆర్
ఈనాడు, దిల్లీ: ధాన్యం కొనుగోళ్ల విషయంలో అస్పష్టత తొలగిపోలేదు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగినందున ధాన్యం కొనుగోళ్లను పెంచాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి పీయూష్ గోయల్కు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, నిరంజన్రెడ్డిల నేతృత్వంలోని బృందం విన్నవించగా.. స్పష్టమైన హామీ లభించలేదు. కేంద్ర మంత్రిని దిల్లీలోని కృషి భవన్లో రాష్ట్ర బృందం మంగళవారం సాయంత్రం కలిసింది. తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగినందున ఏడాదికి 120 లక్షల నుంచి 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం(100-120 ఎల్.ఎం.టి.ల బియ్యం) సేకరించాలని కేంద్ర మంత్రి గోయల్కు రాష్ట్ర మంత్రులు విజ్ఞప్తి చేశారు. 23 రకాల పంటలకు సంబంధించి ముందుగానే కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ప్రకటించినట్లుగా... ఏడాదికి ఒకేసారి లక్ష్యం నిర్దేశించాలని, వానాకాలం, యాసంగిలకు వేర్వేరుగా లక్ష్యాలు వద్దని కోరారు. పంజాబ్ నుంచి కొనుగోలు చేసినట్లు పండిన పంటలో 90 శాతం కొనాలని విజ్ఞప్తి చేశారు. ఒక దశలో 60 నుంచి 70 ఎల్ఎంటీ వరకు బియ్యం కొనుగోలుకు ఆయన సానుకూలత వ్యక్తం చేశారని, ఉప్పుడు బియ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనబోమని స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే ఒప్పందం ప్రకారం.. గతేడాదికి సంబంధించి బ్యాలెన్స్గా 5.25 ఎల్ఎంటీల ఉప్పుడు బియ్యం తీసుకునేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఏడాది లక్ష్యాన్ని ఒకేసారి నిర్దేశిస్తే యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేలా రైతులను ఒప్పిస్తామన్నట్లు తెలంగాణ బృందం చెప్పినట్లు తెలియవచ్చింది. సాయంత్రం 6.40 నుంచి 7.50 గంటల వరకు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రుల నేతృత్వంలోని బృందం మధ్య చర్చలు సాగాయి.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్.
చిత్రంలో రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్రెడ్డి, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు
సమావేశం మధ్యలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర బృందం వెల్లడించిన అంశాలపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్తో మాట్లాడారు. గంటకుపైగా సమావేశం కొనసాగినా ఏఒక్క అంశంపైనా పూర్తిస్థాయిలో వీరిమధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. కేంద్ర మంత్రితో చర్చించిన అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మరోసారి కలుస్తామని రాష్ట్ర మంత్రులు గోయల్కు తెలిపారు. ఈ నెల 26న మరోసారి భేటీ అవుదామని కేంద్ర మంత్రి సూచించారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర మంత్రుల నేతృత్వంలోని బృందం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రితో భేటీ అయిన బృందంలో తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్సభాపక్షనేత నామా నాగేశ్వరరావు, ఉపనేత కొత్త ప్రభాకర్రెడ్డి, పలువురు ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్కుమార్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు. కేంద్ర మంత్రితో సమావేశంలో చర్చించిన అంశాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మీడియాతో మాట్లాడతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈనెల 26న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి నేతృత్వంలోని బృందం మరోసారి కేంద్ర మంత్రులను కలవనున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలకు రాజ్యసభ సభ్యుడు సురేష్రెడ్డి మంగళవారం మధ్యాహ్నం తన నివాసంలో విందు ఇచ్చారు.
సురేష్రెడ్డి ఇంట విందుకు హాజరైన సీఎం కేసీఆర్, ఎంపీ నామా నాగేశ్వరరావు
3 గంటలకు పైగా నిరీక్షణ
కేంద్ర మంత్రి గోయల్ను కలుసుకునేందుకు రాష్ట్ర మంత్రుల నేతృత్వంలోని బృందం అపాయింట్మెంట్ కోరగా మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఫోన్ చేసి రావాలని కార్యాలయాధికారులు తెలిపారు. అయితే అదే సమయానికి రాష్ట్ర బృందం గోయల్ కార్యాలయానికి చేరుకుంది. భారత్-అమెరికా ట్రేడ్ పాలసీ ఫోరం ద్వైపాక్షిక సమావేశానికి హాజరైన కేంద్ర మంత్రి.. సాయంత్రం 6.40 గంటలకు తన కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటివరకు సుమారు 3.40 గంటల పాటు రాష్ట్ర బృందం నిరీక్షించాల్సి వచ్చింది.
కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్కు నమస్కరిస్తున్న కేటీఆర్, చిత్రంలో పీయూష్ గోయల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ