Parboiled rice: ఉప్పుడు బియ్యం కొనం
రాష్ట్రాల నుంచి ఇక మీదట ఉప్పుడు(బాయిల్డ్ రైస్) బియ్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ఆహార, పౌరసరఫరాలశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. వడ్లు, బియ్యం కొనాలంటూ తెలంగాణలో ఆందోళన నేపథ్యంలో శాఖ వర్గాలు పలు అంశాలపై
అంచనాలకు మించి వరి, గోధుమ ఉత్పత్తి
పంటల వైవిధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి
నూనె గింజలు, పప్పుల సాగును ప్రోత్సహించాలి
కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ వెల్లడి
ఈనాడు, దిల్లీ: రాష్ట్రాల నుంచి ఇక మీదట ఉప్పుడు(బాయిల్డ్ రైస్) బియ్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ఆహార, పౌరసరఫరాలశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. వడ్లు, బియ్యం కొనాలంటూ తెలంగాణలో ఆందోళన నేపథ్యంలో శాఖ వర్గాలు పలు అంశాలపై తమ వైఖరిని వెల్లడించాయి. ‘‘కేరళ, తమిళనాడు, బిహార్, ఒడిశా రాష్ట్రాల్లో గతంలో ఉప్పుడు బియ్యం వినియోగం ఎక్కువగా ఉండేది. అది ప్రస్తుతం తగ్గిపోయింది. తమకు అవసరమున్నంత మేర ఆ రాష్ట్రాలే సేకరించుకుంటున్నాయి. ఏటా ఖరీఫ్(వానాకాలం) పంటకాలం ఆరంభంలోనే ఏ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం ఎంత.. ఉత్పత్తి ఎంత.., కేంద్రం ఎంత సేకరించాలనే దానిపై ఆయా రాష్ట్రాల అధికారులతో సమావేశమై నిర్ణయిస్తాం. దీనికి అనుగుణంగా సేకరణ, కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుంది. వానాకాలం పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల(ఎల్ఎంటీ) బియ్యం సేకరించాలని ఆగస్టు 17న కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒప్పందానికి వచ్చారు. తర్వాత కేంద్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్ గోయల్తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమై.. 90 ఎల్ఎంటీ బియ్యం కొనాలని కోరారు. ఆ రాష్ట్ర అధికారులు 75 ఎల్ఎంటీ కొనాలని లేఖలు రాశారు. వీరితోపాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, త్రిపుర, అస్సాం రాష్ట్రాల నుంచి బియ్యం ఎక్కువగా కొనాలనే డిమాండ్ వస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వరి, గోధుమ సాగువిస్తీర్ణం ఎక్కువవుతోంది. దేశీయ అవసరాలు, వినియోగం, నిల్వలు పోనూ మిగిలినవి ఎగుమతి చేస్తున్నాం. దేశంలో ఉప్పుడు బియ్యం వినియోగం బాగా తగ్గిపోయింది. తెలంగాణ నుంచి గతేడాది 44.75 ఎల్ఎంటీ బాయిల్డ్ రైస్ కొన్నాం. తాము భవిష్యత్తులో ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని గోయల్కు కేసీఆర్ తెలిపారు. పంజాబ్ పండించిన వరిలో 90 శాతం కొంటున్నారనే వాదన వినిపిస్తున్నారు. అక్కడ గోధుమ ఎక్కువగా పండిస్తారు. తెలంగాణలో ప్రధాన ఆహారం వరి.. అందుకే కొనుగోళ్లు, సేకరణ విషయంలో పంజాబ్తో తెలంగాణను పోల్చడం సరికాదు. యాసంగి(రబీ) పంటకు సంబంధించి ఎంత కొనాలనేది నిర్ణయించలేదు. దేశవ్యాప్తంగా వరి, గోధుమ సాగు విస్తీర్ణం బాగా పెరగడంతో ఉత్పత్తి పెరిగింది. నిల్వలు ఎక్కువయ్యాయి. పంటల వైవిధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుతం పప్పులు, నూనెగింజలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈక్రమంలో పప్పులు, ఆయిల్పాం వంటి పంటల సాగును ప్రోత్సహిస్తున్నాం’’ అని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఆయా అంశాలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన సమాచారం...
* కేంద్ర వ్యవసాయశాఖ ముందస్తు అంచనాల ప్రకారం తెలంగాణలో 2021-22లో 16.90 లక్షల హెక్టార్లలో వరి సాగవుతుంది. 54.26 ఎల్ఎంటీ ధాన్యం పండుతుంది. తెలంగాణలో వరి ప్రధాన ఆహారం కనుక ఆగస్టు 17న నిర్ణయించిన మేరకే మిగులు (40ఎల్ఎంటీ బియ్యం) ఉంటుంది.
* తెలంగాణ ప్రభుత్వం నివేదించిన ప్రకారం వరిసాగు విస్తీర్ణానికి, ఉత్పత్తి అంచనాకు మధ్య తేడాలుండడంతో కేంద్ర వ్యవసాయ శాఖ వివరణ కోరింది.
* మహలనోబిస్ నేషనల్ క్రాప్ ఫోర్కాస్ట్ సెంటర్ (ఎంఎన్సీఎఫ్సీ) నుంచి అందిన రిమోట్ సెన్సింగ్ డేటా ప్రకారం 2021-22 వానాకాలంలో తెలంగాణలో 2.374 మిలియన్ హెక్టార్లలో వరి పంట సాగవగా.., 75.43 ఎల్ఎంటీ ధాన్యం ఉత్పత్తవుతుంది.(హెక్టారుకు 3177 కిలోల చొప్పున)
* 40 ఎల్ఎంటీ నుంచి 90 ఎల్ఎంటీకి బియ్యం సేకరణ పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నవంబరు 17న లేఖ రాసింది. కానీ కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం వానాకాలం పంట ఉత్పత్తి 75.43 ఎల్ఎంటీ మాత్రమే. వారి విజ్ఞప్తిని పరిశీలిస్తున్నాం.
* 2020-21 ఖరీఫ్ కాలంలో 24.75 ఎల్ఎంటీ ఉప్పుడు బియ్యం ఇస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మిగిలినవి ముడి బియ్యం రూపంలో ఇస్తామంది.
* ఈఏడాది అక్టోబరు 11 నాటికి ఎఫ్సీఐ వద్ద 46.28 ఎల్ఎంటీ ఉప్పుడు బియ్యం నిల్వలున్నాయి. ఇంకా 32.73 ఎల్ఎంటీ సేకరించాల్సి ఉంది. ఈ మొత్తం కలిస్తే 79 ఎల్ఎంటీ అవుతుంది. ఏటా 20 ఎల్ఎంటీ ఉప్పుడుబియ్యం వినియోగిస్తున్నారు. అలా చూసినా ఎఫ్సీఐ వద్ద ఇంకో నాలుగేళ్లకు సరిపడా నిల్వలు ఉంటాయి.
* తెలంగాణ నుంచి 2020-21 యాసంగిలో 24.75 ఎల్ఎంటీ ఉప్పుడుబియ్యం తీసుకోవాలని ఒప్పందం కుదిరినా.. ఆ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు అదనంగా 20 ఎల్ఎంటీ తీసుకోవడానికి కేంద్రం అంగీకరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. -
మావోయిస్టు నేతలపై రివార్డు
మావోయిస్టు అగ్రనేతల తలలకు రాష్ట్ర పోలీసులు వెల కట్టారు. వారి ఆచూకీ చెబితే లక్షల్లో రివార్డు ఇస్తామని ప్రకటించారు. -
కందులకు గరిష్ఠ ధర రూ.11,246
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో కందులకు మంచి ధర పలుకుతోంది. మంగళవారం రైతులు మార్కెట్కు 50 క్వింటాళ్ల కందులు తీసుకురాగా.. క్వింటాకు గరిష్ఠ ధర రూ.11,246గా పలికింది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
చెరువుల పరిరక్షణకు తీసుకున్న చర్యలేంటి?: హైకోర్టు
హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో చెత్త, నిర్మాణ వ్యర్థాలతో నిండిపోతున్న జల్పల్లి, ఉమ్దాసాగర్ చెరువులతోపాటు ఇతర చెరువుల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ హైకోర్టు ప్రభుత్వానికి మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. -
కోర్టు ఆవరణలో నిందితులకు సంకెళ్లపై వివరణ ఇవ్వండి
రంగారెడ్డి జిల్లా కూకట్పల్లి జిల్లా కోర్టు ఆవరణలో నిందితులకు పోలీసులు సంకెళ్లు వేసి తీసుకురావడంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. -
రేకుల డబ్బాలు కావు.. నివాస గృహాలే!
ఇక్కడ కనిపిస్తున్నవి రేకుల డబ్బాలు అనుకుంటే పొరపాటే. అవి నివాస గృహాలే. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోని పేదలకు 2008లో అప్పటి ప్రభుత్వం పేదలకు నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్