Piyush Goyal: తెలంగాణ సర్కారుది అసత్య ప్రచారం
ముడిబియ్యం ఎంతైనా కొనుగోలుచేస్తామని చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బియ్యం సేకరించడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ
కేంద్రమంత్రి గోయల్ ధ్వజం
వైఫల్యాలు, వరుస ఓటములతోనే ఆరోపణలు
27 లక్షల టన్నుల బియ్యాన్ని రాష్ట్రప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదు
ఈనాడు, దిల్లీ: ముడిబియ్యం ఎంతైనా కొనుగోలుచేస్తామని చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బియ్యం సేకరించడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్గోయల్ ఆరోపించారు. ‘‘వరుస ఓటములతో అక్కడి ప్రభుత్వం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. అందువల్లే ప్రజలు, రైతులను ఇబ్బందులుపెట్టే పనిచేస్తోంది. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే అబద్ధపు ప్రచారాలు చేస్తోంది. వాటిని నమ్మొద్దు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలు, రైతులకు అండగా ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. బియ్యం సేకరణపై కేంద్రంతో తేల్చుకోవడానికి రాష్ట్ర మంత్రులు దిల్లీలో మకాం వేసిన నేపథ్యంలో పీయూష్గోయల్ కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్రావు, పార్టీ నేతలు గరికపాటి మోహన్రావు, డీకే అరుణ, విజయశాంతిలతో కలిసి తన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఇదివరకు ఎన్నడూలేనంత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యాంశాలు...
తెలంగాణకు అండగా ప్రధాని మోదీ
‘‘ప్రధాని మోదీ ఎప్పుడూ తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటారు. పార్టీ నేతలంతా రాష్ట్ర విషయాలను కేంద్రం దృష్టికి తీసుకొస్తూ ప్రభుత్వం నుంచి మద్దతు తీసుకుంటున్నారు. దానివల్ల గత అయిదేళ్లలో తెలంగాణ నుంచి వడ్ల సేకరణ మూడు రెట్లు, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5-6 రెట్లు పెరిగింది.
రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు లెక్కలు ఆశ్చర్యకరం
కొన్ని లెక్కలు చెబితే రాష్ట్ర ప్రభుత్వం అక్కడి ప్రజలను ఏ స్థాయిలో తప్పుదోవపట్టిస్తుందో అర్థమవుతోంది. రబీ సీజన్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన బియ్యంలో ఇప్పటివరకూ 27 లక్షల టన్నులు ఇవ్వలేదు. తెలంగాణను ప్రత్యేక కేసుగా పరిగణించి 20 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం అదనంగా తీసుకోవడానికి అంగీకరించాం. వాస్తవానికి ఉప్పుడు బియ్యాన్ని తెలంగాణ ప్రజలే తినరు. దానికి దేశంలో డిమాండ్ లేకపోయినా రాష్ట్ర రైతుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకోవడానికి అంగీకరించాం. అయినప్పటికీ ఈరోజువరకూ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సీఐకి 14 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం, 13 లక్షల టన్నుల సాధారణ బియ్యం ఇవ్వలేదు. ఇప్పటికే నాలుగుసార్లు తేదీ పొడిగించాం. త్వరగా ఇవ్వమని పదేపదే చెబుతున్నా వారు వినిపించుకోవడంలేదు. ఇప్పటికైనా ఆ బియ్యం త్వరగా ఇవ్వాలని కోరుతున్నాం. మున్ముందు ముడి బియ్యం మాత్రమే ఇవ్వాలని ఏడాది క్రితమే చెప్పాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రాష్ట్ర అవసరాలకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత బియ్యమైనా ఉంచుకోవచ్చు. అంతకుమించి అదనంగా ఉన్న బియ్యాన్ని దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మీ నుంచి కొనుగోలుచేస్తామని హామీ ఇచ్చాం. డిమాండ్ ఉన్న బియ్యాన్నే ఇవ్వాలని ఎంఓయూలో స్పష్టంగా పేర్కొన్నాం. అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఉండాల్సిన అవసరం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క లేఖ కూడా రాలేదు
ఎఫ్సీఐలో గోదాములు ఖాళీగా లేవన్న ప్రచారం అబద్ధం. 27 లక్షల టన్నుల కోటా బియ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ నుంచి మాకు ఒక్క లేఖకూడా రాలేదు. కేంద్రం రైలు రేక్లు ఇవ్వలేదని చెప్పడంకూడా అసత్యం. ఎన్ని రేక్లు కావాలన్నా సరఫరాచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేం ఎలా తరలిస్తామన్నదానితో వారికి సంబంధం లేదు. వారు ఇవ్వాల్సిన సరకు ఇస్తేచాలు. 27 లక్షల టన్నుల సరకు రబీదే అయి ఉండాలి. అదికూడా తెలంగాణది అయి ఉండాలి. బయటినుంచి తెచ్చి మాకు ఇవ్వడం కుదరదు. పౌరసరఫరాల మంత్రిగా గతంలో పనిచేసిన ఈటల రాజేందర్కు అక్కడి విషయాలు బాగా తెలుసు.
కేంద్రం నేరుగా కొనుగోలుచేయదు
తెలంగాణ డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ (డీసీపీ) రాష్ట్రం కాబట్టి కేంద్రం నేరుగా రైతుల నుంచి కొనుగోలుచేయదు. రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి వడ్లు కొనుగోలుచేసి బియ్యంగా మార్చి ఎఫ్సీఐకి ఇవ్వాలి. ఎంఓయూలోని క్లాజ్ 18 ప్రకారం రాష్ట్రంలో మిగిలిన బియ్యాన్ని ఎఫ్సీఐకి ఇవ్వాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది నుంచి ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని అక్టోబరు 4న లేఖ ఇచ్చింది. ఈటల రాజేందర్ విజయం తర్వాత తెరాస నాయకులు అకస్మాత్తుగా ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు’’ అని కేంద్రమంత్రి పీయూష్గోయల్ పేర్కొన్నారు.
ముడిబియ్యం ఎంతైనా కొనడానికి సిద్ధం
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల వెన్నంటి ఉందని నేను రాజ్యసభ, లోక్సభల్లో చెప్పాను. కానీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సరఫరా చేస్తామని చెప్పిన మొత్తాన్నే ఇవ్వలేకపోతోంది. వచ్చే సంవత్సరానికి ఎంత ముడి బియ్యం ఇచ్చినా కొనడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తూ అబద్ధాలు చెబుతోంది. ముఖ్యమంత్రి, నేతలు నాపై, కిషన్రెడ్డిపై ప్రయోగించిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నాను. మా పేర్లతో వారు అబద్ధాలు చెబుతున్నారు. వాటిని ఉపసంహరించుకోవాలి
-పీయూష్గోయల్
మేం బిజీ... వారికి పని లేదేమో..!
తెలంగాణ మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పడం అబద్ధం. శనివారం దిల్లీకొచ్చి కూర్చొని అలా ప్రచారం చేయడం తగదు. నేనేమీ వారిని ఆహ్వానించలేదు. నేను శని, ఆదివారాల్లో ముంబయి, ఉత్తర్ప్రదేశ్లలో ఉన్నాను. మేమంతా మాపనుల్లో బిజీగా ఉన్నాం. వారెలా అంత ఖాళీగా ఉన్నారో తెలియడంలేదు. వారికి చేయడానికి ఏం పనిలేదా? ప్రజలకు సేవచేసే ఉద్దేశం వారిలో కనిపించడం లేదు.
-పీయూష్గోయల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది. -
అనారోగ్య క్లెయిమ్ పరిమితి రూ.లక్షకు పెంపు: ఈపీఎఫ్ఓ
ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యుల అనారోగ్య చికిత్సల కోసం ఉద్యోగుల భవిష్య నిధి నుంచి తీసుకునే అనారోగ్య అడ్వాన్సు క్లెయిమ్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు ఈపీఎఫ్వో పెంచింది. -
ఉపాధి హామీకి కూలీలను పెంచాలి
రాష్ట్రంలో ఎండలు మండుతుండటంతో జాతీయ ఉపాధి హామీ పథకానికి వచ్చే కూలీల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో తక్షణ చర్యలు చేపట్టాలని... కూలీల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం అధికారులకు తాజాగా ఆదేశాలు జారీచేసింది. -
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
రాజ్భవన్లో సీతారామ కల్యాణం
రాజ్భవన్లోని కమ్యూనిటీ హాలులో బుధవారం సీతారామ కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సతీమణి సుమతి రాధాకృష్ణన్తో కలిసి కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. -
చెరువుల కబ్జాలతో ముప్పే
చెరువులు, కుంటలు కబ్జాలతో కుచించుకు పోతున్నాయని.. వాటిలో నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోతోందని.. జల వనరులను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందంటూ న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ హైకోర్టుకు లేఖ రాశారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?