TS News: విచారణ పేరిట చిత్రహింసలు
దొంగతనం కేసులో విచారణ పేరిట ఓ 23 ఏళ్ల యువకుడిని పోలీసులు తీవ్రంగా కొట్టారంటూ సూర్యాపేట జిల్లాలోని రామోజీ తండాకు చెందిన గిరిజనులు పోలీస్స్టేషన్ను ముట్టడించారు. తీవ్ర
తీవ్రంగా కొట్టారంటూ పోలీసులపై గిరిజనుల ఆరోపణ
బాధితుడితో ఠాణా వద్ద ఆందోళన
విచారణకు ఆదేశించిన ఎస్పీ
చికిత్స పొందుతున్న వీరశేఖర్
ఆత్మకూర్(ఎస్), సూర్యాపేట నేరవిభాగం, న్యూస్టుడే: దొంగతనం కేసులో విచారణ పేరిట ఓ 23 ఏళ్ల యువకుడిని పోలీసులు తీవ్రంగా కొట్టారంటూ సూర్యాపేట జిల్లాలోని రామోజీ తండాకు చెందిన గిరిజనులు పోలీస్స్టేషన్ను ముట్టడించారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుడితో మూకుమ్మడిగా ఠాణాకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఆత్మకూర్(ఎస్) పోలీస్స్టేషన్ వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. ఈ నెల 4న ఏపూర్లోని తన దుకాణంలో రూ.10 వేల నగదు, 40 మద్యం సీసాలు ఎత్తుకెళ్లినట్లు నిర్వాహకుడు షేక్ సైదులు గత శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రామోజీతండాకు చెందిన బానోత్ నవీన్ను సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అతను మరికొందరి పేర్లను చెప్పడంతో బానోత్ బుచ్చ్యా, బానోత్ లాల్సింగ్, గుగులోతు వీరశేఖర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీరశేఖర్ను బుధవారం మధ్యాహ్నం ఠాణాకు తీసుకొచ్చి విచారించి అర్ధరాత్రి వదిలేశారు. గురువారం ఉదయం మళ్లీ తండాకు వెళ్లి అతన్ని స్టేషన్కు రావాలని అడిగారు. అప్పటికే మంచంపై మూలుగుతున్న వీరశేఖర్ను కుటుంబసభ్యులు, తండావాసులు ఆరాతీయగా.. తనను రాత్రంతా పోలీసులు కొట్టినట్లు అతను తెలిపాడు. దీంతో తండావాసులు ఆగ్రహించి అతడిని ట్రాక్టర్పై ఠాణాకు తీసుకెళ్లి ఆందోళన చేపట్టారు. వారించేందుకు యత్నించిన ఎస్సై ఎం.లింగంతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా వీరశేఖర్కు న్యాయం చేయాలని, ఎస్సైను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. అనంతరం బాధితుడిని ఆటోలో సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ స్పందించి విచారణకు ఆదేశించారు. సూర్యాపేట డీఎస్పీ మోహన్కుమార్ను విచారణ అధికారిగా నియమించారు.
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) పోలీస్స్టేషన్ వద్ద గురువారం ఆందోళన చేపట్టిన
అనంతరం వీరశేఖర్ను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళుతున్న గిరిజనులు
కుడకుడ వద్ద రహదారిపై నిరసన
ఆత్మకూర్(ఎస్) స్టేషన్ నుంచి ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేసేందుకు ట్రాక్టరులో వెళ్తున్న గిరిజనులను చివ్వెంల మండలం కుడకుడ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ట్రాక్టరుతో సహా అక్కడే రహదారిపై ఆందోళన చేపట్టారు. రోడ్డుపై వాహనాలు స్తంభించడంతో అక్కడికి చేరుకున్న డీఎస్పీ మోహన్కుమార్, సూర్యాపేట గ్రామీణ సీఐ విఠల్రెడ్డిలు వారితో చర్చలు జరిపారు. ఎస్సైపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గిరిజనులు ఆందోళన విరమించారు. ఆత్మకూర్(ఎస్) ఠాణాలో మారోమారు సీఐ వారితో మాట్లాడారు. వీరశేఖర్, లాల్సింగ్లపై కేసు లేకుండా చూస్తామని, బాధితుడికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. చోరీ కేసులో లాల్సింగ్ను పోలీసులు విడిచిపెట్టారు. నవీన్, బుచ్చ్యాలను అదుపులో ఉంచుకున్నారు.
తప్పుదారి పట్టించేందుకే: ఎస్.ఐ. లింగం
వీరశేఖర్కు మూర్ఛ, ఇతర ఆరోగ్య సమస్యలుండటంతో బుధవారం రాత్రి ఇంటికి పంపించాం. గురువారం అతన్ని స్టేషన్కు తీసుకురావటానికి సిబ్బంది రామోజీతండాకు వెళ్లారు. అతన్ని విచారిస్తే అసలు నిందితుల పేర్లు వెలుగులోకి వస్తాయనే ఉద్దేశంతో కొందరు కేసును తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు.
నోట్లో గుడ్డలు కుక్కారు: బాధితుని తల్లి
తన కుమారుడ్ని ఆత్మకూర్ (ఎస్) పోలీసులు చిత్రహింసలకు గురిచేసినట్లు వీరశేఖర్ తల్లి గుగులోతు ఖీరి ఆరోపించారు. సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆమె మాట్లాడారు. ‘చోరీకి పాల్పడినట్లు అంగీకరించాలని బలవంతం చేశారు. ససేమిరా అనడంతో నోట్లో గుడ్డలు కుక్కి.. మూడు గంటల పాటు చిత్రహింసలకు గురిచేశారు. వదిలేయాలని ఎస్సై కాళ్లపై పడినా కనికరించలేదు. చివరకు ఎస్సై వాహన డ్రైవర్ సైతం ఠాణా బయట ఉన్న బంధువులకు వీరశేఖర్తో చోరీ చేసినట్లు అంగీకరించేలా చూస్తామంటూ సవాల్ విసిరాడు. ఆ తర్వాత అతను కూడా దాడికి పాల్పడ్డాడు. కదల్లేని స్థితిలో ఉన్న తన కుమారుడిని బుధవారం రాత్రి పోలీసులే ఇంటికి తీసుకొచ్చి వదిలేసి వెళ్లారు’ అంటూ ఆమె రోదించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ