Corona: కాబోయే అమ్మను కాపాడుకుందాం
హైదరాబాద్ మల్లాపూర్ ప్రాంతానికి చెందిన ఓ గర్భిణి ఇటీవల అయిదు ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఎవరూ చేర్చుకోక చివరికి అంబులెన్సులో తుదిశ్వాస
ఆయాసం, అలసట, నీరసం.. ఏ లక్షణమున్నా నిర్లక్ష్యం చేయొద్దు
రెండో విడతలోనూ గర్భిణులపై కొవిడ్ తీవ్ర ప్రభావం
అత్యవసర పరిస్థితుల్లో హైరిస్క్ ఆసుపత్రికి వెళ్లాలి
ముందుజాగ్రత్తలు పాటిస్తే ఇబ్బంది ఉండదంటున్న వైద్యులు
హైదరాబాద్ మల్లాపూర్ ప్రాంతానికి చెందిన ఓ గర్భిణి ఇటీవల అయిదు ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఎవరూ చేర్చుకోక చివరికి అంబులెన్సులో తుదిశ్వాస విడిచిన ఘటన ప్రతి ఒక్కర్ని కలచివేసింది. కుటుంబాలకు కుటుంబాలనే ఛిన్నాభిన్నం చేస్తున్న కరోనా మహమ్మారి కాబోయే అమ్మలపైనా కనికరం చూపడం లేదు. కొవిడ్ అనుమానంతో ప్రసూతి ఆసుపత్రులు సత్వర వైద్యం అందించక పోవడంతో గర్భిణుల ప్రాణాలకు ముప్పువస్తున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆయాసం, అలసట సమస్యలు గర్భిణుల్లో సాధారణమే అయినా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ లక్షణాన్నీ నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనా సోకినా ముందుజాగ్రత్తలు పాటించాలని, సత్వర చికిత్స అందిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గర్భిణులు పాటించాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలనే అంశాలపై వైద్య నిపుణుల సూచనలతో ప్రత్యేక కథనం..
హైదరాబాద్ చర్లపల్లిలో ఉంటున్న ఓ గర్భిణికి ఇటీవల పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు నాచారంలోని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చేర్చుకోకపోవడంతో దిల్సుఖ్నగర్, బంజారాహిల్స్.. ఇలా పలు ప్రైవేటు ఆసుపత్రులు తిప్పినా ఫలితం లేకపోవడంతో చివరికి ‘గాంధీ’కి తరలించారు. అప్పటికే ఆమె తీవ్ర ఆయాసంతో బాధపడుతోంది. అత్యవసర చికిత్స అందించిన వైద్యులు రెండు రోజుల క్రితమే కడుపులో శిశువు చనిపోయినట్లు తేల్చారు. తల్లికి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆమె కూడా తనువు చాలించింది.
తాజాగా మల్లాపూర్కు చెందిన ఓ గర్భిణికి ఆయాసంతోపాటు ఒంట్లో నలతగా ఉండటంతో స్థానిక ఆసుపత్రిలో చూపించారు. ఇలాంటి సమస్యలు సాధారణమేనంటూ ప్రాథమిక చికిత్స చేసి ఇంటికి పంపించివేశారు. తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించింది. హైదరాబాద్లోని అయిదు ఆసుపత్రులకు వెళ్లినా రకరకాల కారణాలతో ఎవరూ చేర్చుకోలేదు. చివరికి ఆమె అంబులెన్సులోనే కన్నుమూసింది.
నగరానికి చెందిన ఓ గర్భిణికి నెలలు నిండాయి. ఇటీవల ఆయాసం, అలసట సమస్యలు ఉత్పన్నం కావడంతో సాధారణమే అనుకున్నారు. గంటలు గడిచేకొద్దీ తీవ్రం కావడంతో అంబులెన్సులో స్థానిక ఆసుపత్రికి తరలించారు. కరోనాగా అనుమానించిన వైద్యులు ఆమెను చేర్చుకునేందుకు నిరాకరించారు. గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అదే అంబులెన్సులో ‘గాంధీ’కి తరలించారు. అత్యవసర విభాగంలో చేర్చుకున్న వైద్యులు వివిధ పరీక్షలు చేశారు. ఆక్సిజన్ శాతం 85కు పడిపోయినట్లు గుర్తించి వెంటనే ప్రాణవాయువు అందించారు. రెండు రోజుల తర్వాత ఆక్సిజన్ స్థాయులు సాధారణ స్థితికి రావడంతో ప్రసవం చేశారు. కొన్ని రోజుల తర్వాత తల్లీబిడ్డ కోలుకోవడంతో ఇంటికి పంపించారు.
కాలం మారింది. కరోనా మహమ్మారి కాబోయే అమ్మలపైనా కనికరం చూపటం లేదు. గర్భిణులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తొలి విడతలో దాదాపు వెయ్యి మంది గర్భిణులకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందించారు. రెండో విడతలోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం సుమారు 45 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇక్కడ 200 మందికి చికిత్స అందించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచీ వస్తున్నారు. తొలుత స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స కోసం ప్రయత్నిస్తున్నారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు ‘గాంధీ’కి తరలిస్తున్నారు. మరికొందరు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఆఖరి నిమిషంలో వస్తుండటంతో కొందరి పరిస్థితి విషమిస్తోంది. కరోనా సోకినా ముందుజాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
ఆయాసం.. అలసట ఉందా?
గర్భిణుల్లో ఆరో నెల తర్వాత కొంత ఆయాసం, అలసట సాధారణమే. మామూలు స్థితిలో గట్టిగా ఊపిరి తీసుకొని వదిలినప్పుడు పొట్ట, ఛాతీ మధ్యలో ఉన్న భాగం(డయాఫ్రమ్) కిందకి, పైకి కదులుతుంది. గర్భిణుల్లో నెలలు నిండేకొద్దీ కడుపులో ఉన్న శిశువు పెరిగి గర్భసంచి విస్తరిస్తుంది. పొట్ట, ఛాతీ మధ్య కదలిక కష్టమై ఆయాసం, అలసట వస్తుంటాయి. అయితే కరోనా కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో గర్భిణుల్లో కన్పించే ఏ లక్షణాన్నీ నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు పేర్కొంటున్నారు. కరోనా పాజిటివ్ రోగుల్లో రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గడం, మరికొందరిలో గుండె, ఊపిరితిత్తుల్లో సమస్యల వల్ల ఆయాసం వస్తుంది. కొందరు గర్భిణులను తొలి నుంచే రక్తహీనత సమస్య వేధిస్తుంటుంది. ఇది కూడా ఆయాసం, అలసట, నీరసానికి కారణమే. ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైతే నిర్లక్ష్యం చేయకుండా తక్షణం వైద్యులను సంపదించాలని సూచిస్తున్నారు.
ప్రతి నెలా కీలకమే..
- డాక్టర్ మహాలక్ష్మి, గైనకాలజీ విభాగాధిపతి, గాంధీ ఆసుపత్రి
* గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు ప్రతి నెలా కీలకమే. కరోనా కోరలు చాస్తున్న సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో ఏదైనా మార్పు లేదా లక్షణాలు కన్పిస్తే వైద్యులకు చెప్పాలి
* తొలి మూడు నెలలు ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకోవాలి. టీటీ ఇంజక్షన్ తీసుకోవాలి. నాలుగో నెల నుంచి ఫోలిక్ యాసిడ్తోపాటు ఐరన్ కూడా తప్పనిసరి. డెలివరీ తర్వాత ఆరు నెలల వరకు వీటిని తీసుకోవాలి.
* ఆహారంలో నిత్యం గుడ్డు, పాలు, ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు, చికెన్, చేపలు ఉండేలా చూసుకోవాలి. మంచి ఆహారం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
* కొవిడ్ నేపథ్యంలో పరీక్షల పేరుతో ఎక్కువసార్లు ఆసుపత్రికి వెళ్లినా ఇబ్బందే. ముందే వైద్యులతో మాట్లాడి విజిట్లను కుదించుకోవాలి. 2-3 వారాలకు ఒకసారి, మూడో నెలలో మరోసారి, 4-5 నెలల్లో, తర్వాత 8 నెలలో వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.
* జ్వరం, దగ్గు, ఆయాసం, చేతులు, కాళ్ల వాపు, గుండె దడ, కడుపులో శిశువు కదలిక లేకపోవడం లాంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* ఇంట్లోనే డిజిటల్ థర్మామీటర్, బీపీ ఆపరేటర్, పల్స్ ఆక్సీమీటర్ అందుబాటులో పెట్టుకోవాలి. కరోనా సోకి వైద్యుల సూచనలతో హోం ఐసొలేషన్లో ఉన్నవారు జ్వరం, బీపీ, పల్స్, ఆక్సిజన్ స్థాయులు చెక్ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఆక్సిజన్ 95, 93, 94 శాతాలకు తగ్గితే వెంటనే ఆసుపత్రిలో చేరాలి.
ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి
- డాక్టర్ సవితాదేవి, ప్రముఖ గైనకాలజిస్టు
* కొవిడ్ విజృంభిస్తున్న సమయంలో ఇంట్లో గర్భిణులు ఉంటే ముందే ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఆఖరి నిమిషంలో హడావుడి వల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు చికిత్స తీసుకుంటున్న వైద్యునితో దీనిపై చర్చించాలి.
* అత్యవసరమైతే ఎక్కడ చేరాలి? కొవిడ్ సోకితే ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడ చికిత్స అందిస్తున్నారు? తదితర వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. అన్ని ప్రసూతి ఆసుపత్రులు కొవిడ్ సోకిన గర్భిణులకు చికిత్స అందించడం లేవు. హైరిస్క్ సేవలు అందించే కేంద్రాల్లోనే ఈ సేవలున్నాయి. ఎక్కడెక్కడ ఈ హైరిస్క్ ఆసుపత్రులు ఉన్నాయో తెలుసుకోవాలి. ఒకవేళ కొవిడ్ సోకితే తక్షణమే వాటిని సంప్రదించాలి. ప్రస్తుతం ప్రతి ఆసుపత్రిలో ఒక సహాయక కేంద్రం ఏర్పాటు చేశారు. అవసరమైతే ఆ కేంద్రాలను సంప్రదించవచ్చు.
* చాలామంది గర్భిణులకు స్వల్ప లక్షణాలుంటే హోం ఐసొలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా తగ్గిపోతోంది. కొందరి పరిస్థితి విషమిస్తోంది. ఇలాంటివారు ఎలాంటి ఆలస్యం లేకుండా హైరిస్క్ ఆసుపత్రులను సంప్రదించాలి. వెంటనే చికిత్స అందించడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.
* కొవిడ్ సోకిన గర్భిణుల్లో జ్వరం 100 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నా.. తీవ్ర ఆయాసం.. ఆక్సిజన్ 93 శాతం కంటే తగ్గినా.. ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రిలో చేరాలి. సీఆర్పీ, డీ డైమర్, సీబీపీ, ఈఎస్ఆర్ లాంటి పరీక్షలూ చేయాల్సి ఉంటుంది.
* గర్భిణులు కొవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఇతరులకు దూరంగా ఉండటం, చేతుల శుభ్రత, మాస్క్ ధరించడం తప్పనిసరి. ఫంక్షన్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లడం లాంటివి పూర్తిగా తగ్గించుకోవాలి. ఇంట్లోనూ ప్రత్యేక గదిలో ఉండటం శ్రేయస్కరం. మిగతా కుటుంబ సభ్యులతో దూరం నుంచే మాట్లాడాలి. వాడే వస్తువులన్నీ ప్రత్యేకంగా పెట్టుకోవాలి.
* సొంత వైద్యం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. ముఖ్యంగా ఛాతీ స్కానింగ్ లాంటివి నిపుణులైన వైద్యుల సమక్షంలో చేస్తారు. వైరల్ మందులను వైద్యుల సూచనలతోనే తీసుకోవాలి. జ్వరం వస్తే మాత్రం పారాసిటమాల్ లాంటివి ప్రతి 6-8 గంటలకు తీసుకోవచ్చు.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది నేవీ సిబ్బంది మృతి
-
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
-
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ