President Ram Nath Kovind: రాజ్యాంగానికి సమానత్వమే ఆలంబన
సామాజిక అసమానతలను వ్యతిరేకిస్తూ, సమానత్వ భావనను చాటిచెప్పిన మహనీయుడు రామానుజాచార్యులు అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రస్తుతించారు. ముచ్చింతల్ శ్రీరామనగరంలో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు 12వ రోజైన ఆదివారం రాష్ట్రపతి
రామానుజులే మన నేతలకు ప్రేరణ
సువర్ణమూర్తి ఆవిష్కరణలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
ఈనాడు - హైదరాబాద్
సామాజిక అసమానతలను వ్యతిరేకిస్తూ, సమానత్వ భావనను చాటిచెప్పిన మహనీయుడు రామానుజాచార్యులు అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రస్తుతించారు. ముచ్చింతల్ శ్రీరామనగరంలో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు 12వ రోజైన ఆదివారం రాష్ట్రపతి తన సతీమణి సవితా, కుమార్తె స్వాతిలతో కలిసి హాజరయ్యారు. 120 కిలోల రామానుజుల బంగారు విగ్రహాన్ని ఆయన మధ్యాహ్నం 3.57 గంటలకు ఆవిష్కరించారు. అనంతరం పుష్పార్చనలో పాల్గొన్నారు. కేంద్రాన్ని సందర్శించాక సభలో రాష్ట్రపతి ప్రసంగించారు. ‘రామానుజులు ప్రవచించిన సమానత్వమనే మౌలిక సూత్రమే మన రాజ్యాంగానికి ఆలంబన. ఆయన బాటలోనే మనం నిర్దేశించుకున్న ప్రాథమిక హక్కులు రాజ్యాంగాన్ని పరిపుష్టం చేస్తున్నాయి. మహాత్మాగాంధీ, అంబేడ్కర్ సహా ఎందరో నేతలు రామానుజాచార్యుల సమానత్వ భావనతో ప్రేరణ పొందారు. అంబేడ్కర్ పుట్టిన గ్రామం, ముచ్చింతల్లోని శ్రీరామనగరం సమానత్వాన్ని చాటిచెప్పే పవిత్రక్షేత్రాలు. రామానుజులు బోధించిన విశిష్టాద్వైతం సిద్ధాంతం మాత్రమే కాదు. అది మన నిత్యజీవితానికి ఉపయోగపడే అంశం. ఆయన సువర్ణమూర్తిని లోకార్పణం చేయడం సంతోషదాయకం. శ్రీరామనగరంలో సమానత్వం విలసిల్లుతోంది’ అని రాష్ట్రపతి అన్నారు. ఆయన పర్యటనలో గవర్నర్ తమిళిసై, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మై హోం అధినేత జూపల్లి రామేశ్వర్రావు, జీయర్ ట్రస్టు ప్రతినిధులు చలిమెడ లక్ష్మీనర్సింహారావు, జీవీ భాస్కరరావు పాల్గొన్నారు.
దాదాపు రెండున్నర గంటలపాటు పర్యటన
రాష్ట్రపతి పర్యటన దాదాపు రెండున్నర గంటలపాటు సాగింది. ఆయన మధ్యాహ్నం దిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి, అక్కడి నుంచి హెలికాప్టర్లో ముచ్చింతల్కు చేరుకున్నారు. తొలుత భద్రవేదిలోని మొదటి అంతస్తులో బంగారుమూర్తిని ఆవిష్కరించారు. పూజల అనంతరం నగదు కానుకను సమర్పించారు. విగ్రహం ముందు ఉన్న బంగారు శఠారితో చినజీయర్స్వామి రాష్ట్రపతిని, కుటుంబసభ్యులను ఆశీర్వదించారు. తర్వాత వారు మూడో అంతస్తులోని రామానుజుల విరాట్ విగ్రహాన్ని, 108 దివ్యదేశాలను సందర్శించారు. కేంద్రం విశేషాలను చినజీయర్స్వామి వెంట ఉండి వివరించారు. తర్వాత ప్రవచన మండపంలో సుమారు 22 నిమిషాలసేపు రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. తెలుగు కవి అన్నమాచార్య మొదలుకుని ఉత్తర భారతానికి చెందిన మహనీయులను ప్రస్తావిస్తూ.. వారికి రామానుజులు కలిగించిన ప్రేరణను వివరించారు. సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి, కుటుంబసభ్యులు రాజ్భవన్కు పయనమయ్యారు. రాత్రికి అక్కడే బస చేసి సోమవారం ఉదయం దిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.
తెలంగాణలో విశిష్టమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని చూడవచ్చు. గోదావరి ప్రవహిస్తుండడం ద్వారా నా దృష్టిలో ఈ రాష్ట్రం విశేష మహత్యాన్ని కలిగి ఉంది. ఈనాటి కార్యక్రమం ద్వారా దేశంలోని ఆధ్యాత్మిక, సామాజిక పరంపరలోని ఓ ప్రత్యేకమైన అధ్యాయంలో భాగస్వామినయ్యే గొప్ప అవకాశం నాకు లభించింది.
- రాష్ట్రపతి కోవింద్
ఇనుమడిస్తున్న దేశ గౌరవం: చినజీయర్స్వామి
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హయాంలో దేశ గౌరవం ఇనుమడిస్తోందని చినజీయర్స్వామి అన్నారు. ‘కశ్మీర్ నవ్వుతోంది... కాశీ ఆనందంతో మురిసిపోతోంది.. రామచంద్రస్వామి తన స్థానంలో ప్రతిష్ఠకు సిద్ధమవుతున్నారు’ అని ఆయన చెప్పారు. రామానుజుల స్వర్ణమూర్తి ఆవిష్కరణ అనంతరం జరిగిన కార్యక్రమంలో చినజీయర్స్వామి మాట్లాడారు. ప్రపంచంలోని అందరూ భగవంతుడి బిడ్డలేనని, దళితులు, తాడిత పీడితులంటూ ఉండరని రామానుజులు చాటారన్నారు.
వేయికాళ్ల మండపం కూల్చివేతతో.. భక్తులు ఆవేదన చెందారు
తిరుమల శ్రీవారి సన్నిధిలో వేంకటేశ్వరుని వైభవాన్ని చాటేలా నిర్మించిన వేయికాళ్ల మండపం అజ్ఞానుల బారినపడి రూపం కోల్పోయిందని చినజీయర్స్వామి పేర్కొన్నారు. రాష్ట్రపతి పర్యటన పూర్తయిన తర్వాత భక్తులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. మండపం కూల్చివేతపై 20 లక్షల మంది భక్తులు ఆవేదన తెలుపుతూ ‘ఓం నమో వేంకటేశాయ’ నామాన్ని 1100 కోట్ల పర్యాయాలు రాశారని, మండపం అక్కడే తిరిగి రావాలని ప్రార్థించారని ఆయన చెప్పారు. భక్తులు రచించిన పత్రాలను స్తూప రూపంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో జూపల్లి రామేశ్వర్రావు స్థలం ఇచ్చారని వివరించారు. ప్రస్తుత ఆశ్రమానికి ఆగ్నేయంగా నిర్మించిన ఆనంద విమానం కింది భాగంలో ఈ పత్రాలను సురక్షితంగా ఉంచామన్నారు.
ఆవిష్కరణ ఫలకంపై కేసీఆర్ పేరు
సువర్ణమూర్తి మందిరం వద్ద సంబంధిత శిలాఫలకాన్ని కూడా రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. దీనిపై ఒకవైపు రామ్నాథ్ కోవింద్.. మరోవైపు చినజీయర్స్వామి చిత్రాలు చెక్కి ఉన్నాయి. ఫలకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును చెక్కించారు. రామానుజుల సువర్ణమూర్తికి సోమవారం ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. అప్పటి నుంచి నిత్యారాధన, నిత్య నైవేద్యాలు నిర్వహిస్తారు.
రాష్ట్రపతికి గవర్నర్, సీఎంల ఘన స్వాగతం
ఈనాడు, హైదరాబాద్: ముచ్చింతల్లో రామానుజాచార్య సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఆదివారం ఘనస్వాగతం లభించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి రామ్నాథ్, ఆయన సతీమణి సవితలు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ ఆయనకు పుష్పగుచ్ఛాలను అందించి స్వాగతం పలికారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డిలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి రాష్ట్రపతి ఆర్మీ హెలికాప్టర్లో ముచ్చింతల్కు బయల్దేరి వెళ్లారు.
నేడు మహాపూర్ణాహుతికి ముఖ్యమంత్రి కేసీఆర్
ముగియనున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు
ఈనాడు, హైదరాబాద్: శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. ఈ సందర్భంగా ఉదయం యాగశాలల వద్ద నిర్వహించే మహాపూర్ణాహుతికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. అనంతరం 108 దివ్యదేశాల్లో దేవతామూర్తుల కల్యాణోత్సవాలు నిర్వహిస్తారు. చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ దేవతామూర్తుల ప్రాణప్రతిష్ఠలు ఆదివారంతో పూర్తయ్యాయి. దివ్యదేశాల సందర్శనకు సాధారణ భక్తులను సోమవారం నుంచి అనుమతించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం