Rakesh Tikait: పోరు ఆగదు
స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలవుతున్నా.. దేశంలో వ్యవసాయరంగం కుదుటపడలేదని, రైతులు నిత్య సమస్యలను ఎదుర్కొంటున్నారని భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి, సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేశ్ టికాయిత్ తెలిపారు....
రైతులకు న్యాయం జరిగే వరకూ వెన్నంటి ఉంటాం
పంజాబ్ తరహా సేకరణ అన్ని రాష్ట్రాల్లో ఉండాలి
వ్యవసాయానికి ప్రత్యేక మంత్రి మండలి అవసరం
రైతుబంధును దేశమంతటా అమలు చేస్తే మేలు
‘ఈనాడు’ ఇంటర్వ్యూలో సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేశ్ టికాయిత్
ఈనాడు, హైదరాబాద్: స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలవుతున్నా.. దేశంలో వ్యవసాయరంగం కుదుటపడలేదని, రైతులు నిత్య సమస్యలను ఎదుర్కొంటున్నారని భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి, సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేశ్ టికాయిత్ తెలిపారు. వారికి న్యాయం జరిగే వరకు తాము వెన్నంటి ఉంటామని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాల రద్దుకు ఏడాది పాటు అన్నదాతలు పోరాడారన్నారు. భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో ఒప్పంద సేద్యాన్ని ప్రోత్సహిస్తోందని తెలిపారు. గోదాములన్నీ అంబానీ, అదానీలకు ఇచ్చేస్తున్నారని ఆరోపించారు. కనీస మద్దతు ధరతో పాటు పంజాబ్లా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని పంటలను కేంద్రమే కొనుగోలు చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాగుకు పెట్టుబడిగా ఇస్తున్న రైతుబంధు మంచి పథకమని, దానిని దేశమంతటా అమలు చేయాలంటూ కేంద్రాన్ని కోరతామన్నారు. వ్యవసాయం ప్రాధాన్యం దృష్ట్యా ప్రత్యేక మంత్రిమండలి ఉండాలన్నారు. గురువారం హైదరాబాద్కు వచ్చిన ఆయన ‘ఈనాడు’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్య్వూ ఇచ్చారు.
కేంద్రం వ్యవసాయ చట్టాలు రద్దు చేసింది కదా.. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి?
కేంద్రం కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే నల్ల చట్టాలు తెచ్చింది. వాటి రద్దు ఉద్దేశాలపైనా మాకు సందేహాలున్నాయి. ఇవే కాదు ఇంకెన్నో రకాలుగా రైతులకు అన్యాయం జరుగుతోంది. పంటలకు గిట్టుబాటు లేదు. 1967లో గోధుమ ధర క్వింటాలుకు రూ.70. ఇప్పటి ఖర్చులతో పోలిస్తే అది రూ. 7,600 కావాలి. అయితే రూ. 2 వేలకు మించడం లేదు. రైతు కష్టానికి తగ్గ ఫలితం దక్కితేనే వ్యవసాయానికి మేలు. దీని కోసమే మా ప్రయత్నం. స్వామినాథన్ కమిషన్ 200 సిఫార్సులు చేస్తే ఒక్కటీ అమలు చేయలేదు. వ్యవసాయానికి సంబంధించి 18 ప్రభుత్వ శాఖలున్నాయి. వాటి మధ్య సమన్వయమే లేదు. ఈ శాఖలన్నింటితో కలిసి వ్యవసాయానికి ప్రత్యేక మంత్రిమండలి (కేబినెట్) ఉండాలి. అన్ని శాఖల మంత్రులు ఒకేచోట కూర్చొని సమస్యలను పరిష్కరించాలి.
దేశ రాజధానిలో ఏడాది పాటు ఆందోళన ఎలా సాధ్యమైంది?
కేంద్రం కుట్రపూరితంగా కరోనా సమయంలో చట్టాలు చేసి అన్నదాతలను భయపెట్టాలని చూసింది. అయినా ఎవరూ భయపడలేదు. మున్ముందూ ఇదే పోరాట పంథా ఉంటుంది. రైతు సమస్యల పరిష్కారానికి కేంద్రం కమిటీ వేయాలి. ప్రతి పంటకు మద్దతు ధర కల్పించేలా చట్టం తేవాలి. విద్యుత్ చట్టసవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి. విత్తన బిల్లు తేకుండా ప్రైవేటు కంపెనీలకు కొమ్ముకాస్తోంది. డిమాండ్లను కేంద్రం అంగీకరిస్తేనే ఇళ్లకు వెళతాం.
పంటల కొనుగోలు విధానం ఎందుకు అమలు కావడం లేదు?
పంటల సేకరణ బాధ్యత కేంద్రానిదే. కానీ భాజపా అధికారంలో ఉన్నచోట ఒకలా.. ఇతర ప్రభుత్వాలు ఉన్నచోట మరోలా వ్యవహరిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం కేంద్రం చేతుల్లోనే ఉంది. పంజాబ్లో వరి, గోధుమలను కొంటోంది. అన్ని రాష్ట్రాల్లో అన్ని పంటలను కొనాలనే మేం ఉద్యమిస్తున్నాం.
దేశంలో గోదాముల కొరత అని చెబుతోంది కదా..?
గోదాములన్నింటినీ అదానీ, అంబానీలకు కేంద్రం అమ్మేసింది. రైళ్లు, పోర్టులు, ఎయిర్పోర్టులు.. ఇలా మొత్తం దేశాన్ని అమ్మేస్తోంది.
పంట మార్పిడి జరగాలని కేంద్రం చెబుతోంది?
దీనిపై ప్రస్తుతం కేంద్రంలో స్పష్టమైన విధానమే లేదు. నిజంగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని భావిస్తే వాటికి ప్రోత్సాహకాలు, రాయితీలను కేంద్రమే ఇవ్వాలి. యూరప్లో పంట మార్పిడికి ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నాయి. పంట పరిహారం విధానం కూడా విదేశాల్లో బాగుంది.
కనీస మద్దతు ధర సాధ్యం కాదని అంటోంది కదా..?
కేంద్రానికి పంటల కొనుగోలు భారం కాదు. వ్యాపారులు రైతుల వద్ద కొని దానిని లాభంతో ప్రభుత్వానికి విక్రయిస్తుంటారు. ఇదెలా జరుగుతోంది? ఈ అవినీతి అంతం కావాలంటే కనీస మద్దతు ధర అన్నదాతకు హక్కుగా మారాలి.
ఏ రాష్ట్రంలో రైతుల పరిస్థితి మెరుగ్గా ఉంది?
అన్ని రాష్ట్రాల్లోనూ రైతులు మెరుగుపడాలి. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు ఇవ్వడం అభినందనీయం. దీంతో పాటు నిరంతర ఉచిత విద్యుత్ను ఇవ్వడం రైతులకెంతో మేలు. ఈ పథకాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి సమాచారం కోరాం. వీటన్నింటిని అన్ని రాష్ట్రాల సీఎంలను కలిసి అందజేస్తాం. దేశవ్యాప్తంగా రైతులకు నేరుగా నగదు బదిలీ కోసం ఆందోళన చేస్తాం.
మీ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి?
త్వరలోనే సంయుక్త కిసాన్మోర్చా సమావేశం ఉంది. దానిలో భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?