Rythu Bandhu: 28 నుంచి రైతు బంధు పంపిణీ
రైతుబంధు నగదును ఈ నెల 28 నుంచి పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. అప్పటినుంచి పది రోజుల్లోగా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామన్నారు. దళితబంధును ప్రభుత్వం యథాతథంగా అమలు చేస్తుందని,
యథాతథంగా దళిత బంధు
నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల బదలాయింపులు పూర్తి
యాసంగిలో కిలో ధాన్యం కూడా కొనం
ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతుల్ని చైతన్యపరచాలి
కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: రైతుబంధు నగదును ఈ నెల 28 నుంచి పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. అప్పటినుంచి పది రోజుల్లోగా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామన్నారు. దళితబంధును ప్రభుత్వం యథాతథంగా అమలు చేస్తుందని, ఇప్పటికే ప్రకటించిన విధంగా హుజూరాబాద్ నియోజకవర్గం, రాష్ట్రంలోని మరో 4 మండలాల పరిధిలో లబ్ధిదారుల కోసం పూర్తిస్థాయిలో త్వరలో నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల సూచనల మేరకు 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు కార్యాచరణ చేపట్టాలన్నారు. రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యం కొనలేమంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినందున... రాష్ట్రప్రభుత్వం ఆ సీజన్లో కిలో వడ్లు కూడా కొనుగోలు చేయదని, కొత్తగా కొనుగోలు కేంద్రాలూ నెలకొల్పబోమని స్పష్టం చేశారు. కొత్త జోనల్ విధానంలో ఉద్యోగుల బదలాయింపులను నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. శనివారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి.. జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, కేటీఆర్, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎర్రబెల్లి, ప్రశాంత్రెడ్డి, మహమూద్అలీ, గంగుల, మల్లారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, సబిత, సత్యవతి, పువ్వాడ, తలసాని, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, విప్ సుమన్, మాజీ మంత్రి మోత్కుపల్లి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ సోమేశ్కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం ప్రసంగంలో ముఖ్యాంశాలు...
రైతులను కాపాడుకుందాం
‘‘రైతుబంధు పథకంతో పంట పెట్టుబడి సాయాన్ని, బీమాతో అన్నదాతలకు భరోసాను కల్పిస్తున్నాం. ఎన్ని కష్టాలొచ్చినా వాటిని కొనసాగిస్తాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్ఠం చేసే దిశగా రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న దార్శనిక వ్యవసాయ విధానాలు దేశంలో ఎక్కడా లేవు. సాగునీటి ప్రాజెక్టులు కట్టి నీటివనరులను మెరుగు పరచుకున్నాం. 24 గంటలపాటు రైతులకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నాం. వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా కేంద్రం అనుసరిస్తున్న విధానాల నుంచి రైతుల్ని కాపాడుకునే బాధ్యత కలెక్టర్లకు, అధికారులకు ఉంది. మీరంతా క్షేత్రస్థాయిలోకి వెళ్లి, ధాన్యం కొనబోమనే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలి. భారత ఆహార సంస్థ నిర్లక్ష్యం వల్ల గోదాముల్లో మగ్గిపోతున్న బియ్యం నిల్వలు పేరుకుపోతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇందుకు సంబంధించి కేంద్రానికి లేఖలు రాయాలని చెప్పాలి. వానాకాలం పంటల సాగుపై ముందస్తు ప్రణాళిక ఉండాలి. పత్తి, కంది వంటి ప్రత్యామ్నాయ లాభసాటి పంటల సాగుపై దృష్టి సారించాలి.
స్థానికులకు నష్టం కలగొద్దు
కొత్త జోనల్ విధానంలో ఉద్యోగుల బదలాయింపులను నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలి. స్థానికులకు నష్టం జరగకుండా కేటాయింపులు జరగాలి. వెనకబడిన, మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయగలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. భార్యాభర్తలైన (స్పౌస్) ఉద్యోగులు ఒకచోట అయితేనే ప్రశాంతంగా పనిచేయగలుగుతారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో భార్యాభర్తల కేటాయింపు అంశాలను పరిష్కరించాలి. కొత్త జోనల్ వ్యవస్థతో ప్రభుత్వ పాలన క్షేత్రస్థాయిలోకి అందుబాటులోకి వస్తుంది. స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
దళిత బంధుకు త్వరలోనే నిధులు
తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ‘దళిత బంధు’ లక్ష్యం. దీనిద్వారా నూరుశాతం రాయితీ కింద అందించే రూ.10 లక్షలు, దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే కాకుండా.. సామాజిక పెట్టుబడిగా మారి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతంగా పటిష్ఠం చేయడంలో దోహదపడుతుంది. మీరు ఇప్పటివరకు చేసిన ఏ పనిలోనూ లేని సంతృప్తి దళిత బంధును అమలు చేయడంలో దొరుకుతుంది. దళిత కుటుంబాల ఆర్థికస్థితిని మెరుగుపరిచేందుకు ఉన్న అన్ని అవకాశాలను, వ్యాపార, ఉపాధి మార్గాలను శోధించాలి. అందుకు దళిత మేధావులు, విశ్రాంత ఉద్యోగుల సలహాలు, సూచనలు స్వీకరించాలి.
ఒమిక్రాన్పై ఆందోళన వద్దు
ఒమిక్రాన్పై ఆందోళన వద్దు. దాని నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. వైద్యఆరోగ్యశాఖను అప్రమత్తం చేశాం. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి’’ అని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అధికారులు మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉందంటూ.. అప్పటివరకు చేపట్టిన చర్యలను సీఎంకు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ