Congress Meeting: కాంగ్రెస్లో మాటల ‘ఈటెలు’
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘోర పరాజయం కాంగ్రెస్లో కాక రేపింది. నేతలు మాటల ఈటెలు విసురుకున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓటమిపై పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కె.సి.వేణుగోపాల్ అధ్యక్షతన శనివారం ఇక్కడి
భట్టిపై వేణుగోపాల్ ఆగ్రహం
ఉత్తమ్, పొన్నం పరస్పర విమర్శలు
సమావేశానికి హాజరైన బోసురాజు, రేవంత్రెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్
ఈనాడు, దిల్లీ: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘోర పరాజయం కాంగ్రెస్లో కాక రేపింది. నేతలు మాటల ఈటెలు విసురుకున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓటమిపై పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కె.సి.వేణుగోపాల్ అధ్యక్షతన శనివారం ఇక్కడి వార్రూంలో సమీక్ష నిర్వహించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, సీతక్క, పీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి, వి.హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, మాజీ మంత్రులు దామోదర రాజనరసింహా, షబ్బీర్అలీ, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాస్కీ, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, హుజూరాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బల్మూరి వెంకట్లు పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... హుజూరాబాద్ ఉప ఎన్నికలకు తెరాస, భాజపా అభ్యర్థులు ముందుగా సిద్ధమవడం, అభ్యర్థిలో ఎంపికలో ఆలస్యం, 1983 నుంచి కాంగ్రెస్ గెలవకపోవడం, ధన ప్రభావం, అన్నింటికి మించి ఈటల రాజేందర్ను పార్టీలోకి తీసుకువచ్చే విషయంలో సకాలంలో స్పందించకపోవడం వంటి కారణాలను రేవంత్రెడ్డి వివరించారు. ఈటలను పార్టీలో చేర్చుకోవడాన్ని కొందరు వ్యతిరేకించారంటూ భట్టి విక్రమార్క చెప్పబోతుండగా కె.సి.వేణుగోపాల్ అడ్డుకున్నారు. ఈటల చేరికను వ్యతిరేకిస్తూ మీరు నాతో మాట్లాడిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. మీరు తప్పు చేసి ఇతరులపై నెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈటలను చేర్చుకునే విషయంలో తాత్సారం, నిర్లక్ష్యం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. ఈ దశలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుని ‘హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమిపై సమీక్ష నిర్వహించడం సరైందే.అయితే హుజూర్నగర్, దుబ్బాక, జీహెచ్ఎంసీ, నాగార్జునసాగర్ ఫలితాలపై ఎందుకు సమీక్ష నిర్వహించలేద’ని ప్రశ్నించారు.ఈ ఉపఎన్నిక ఫలితాలకు, ప్రస్తుత రాష్ట్ర నాయకత్వానికి ఎటువంటి సంబంధం లేదని, ఏడేళ్లుగా నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న కౌశిక్రెడ్డికి నాటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. రాహుల్గాంధీ రాష్ట్రానికి వచ్చినప్పుడు సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు వేరే పార్టీలో ఉండడానికి కారకులెవరో అందరికీ తెలుసన్నారు. నాడు నియోజకవర్గంలో పరిస్థితిని తాను వివరించినా మౌనంగా ఉండాలని ఉత్తమ్ చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విమర్శలకు ఆగ్రహించిన ఉత్తమ్ పరుష పదజాలం ఉపయోగించడంతో పొన్నం అందుకు దీటుగా బదులిచ్చారు. ఫలితంగా ఒక్కసారిగా వార్ రూంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కె.సి.వేణుగోపాల్, మాణికం ఠాగూర్లు శాంతింపజేశారు. వార్ రూంలో ఉదయం నాయకులతో సమావేశమైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కె.సి.వేణుగోపాల్ సాయంత్రం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో విడివిడిగా సమావేశమయ్యారు. అనంతరం నాయకులు విలేకరులతో మాట్లాడారు...
క్షేత్రస్థాయి నివేదిక తీసుకుంటాం: ఠాగూర్
తెలంగాణలో కాంగ్రెస్ను బలమైన శక్తిగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. 2023 ఎన్నికలకు సిద్ధమయ్యాం. హుజూరాబాద్ ఎన్నికలపై అందరి నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం. హుజూరాబాద్లో పని చేసిన ద్వితీయ శ్రేణి నేతల నుంచి సమాచారం తీసుకోవడానికి ఏఐసీసీ నుంచి పరిశీలకులను నియమించాం. వారి నుంచి క్షేత్రస్థాయి నివేదిక తీసుకుంటాం. తెరాస, భాజపాలది గల్లీలో కుస్తీ.. దిల్లీలో దోస్తీ. ఆ పార్టీల తీరును ఎండగడతాం. కాంగ్రెస్ ఎప్పటికీ భాజపాకు మద్దతు ఇవ్వదు
సోదరునిపై ధృతరాష్ట్ర ప్రేమతోనే: పొన్నం
పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి తన సోదరుడు కౌశిక్ రెడ్డిపై చూపిన ధృతరాష్ట్ర ప్రేమే హుజూరాబాద్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి కారణం. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని ముందే వివరించినా ఉత్తమ్ పట్టించుకోలేదు. గతంలో పీసీసీ అధ్యక్షులుగా పని చేసిన కేశవరావు, డి.శ్రీనివాస్లు కోవర్టులుగా వ్యవహరించి రాజ్యసభ సభ్యులయ్యారు. గత పీసీసీ అధ్యక్షుని చలవతో ఆయన తమ్ముడు కౌశిక్రెడ్డి ఎమ్మెల్సీ అవుతున్నారు. ఈ అంశంపై అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశాను.
కలిసికట్టుగా పోరాడుతూ ప్రజలకు అండగా నిలుస్తాం: రేవంత్రెడ్డి
సీనియర్ల సహకారం, అనుభవం, ఆలోచనలు, సూచనలు తీసుకొని ప్రజా సమస్యలపై నేతలంతా కలిసికట్టుగా పోరాడేలా ఏఐసీసీ దిశానిర్దేశం చేసింది. రేపటి నుంచి క్షేత్ర స్థాయిలో కార్యాచరణకు దిగుతాం. భాజపా, తెరాస రాజకీయ ఎత్తుగడలు, ప్రజావ్యతిరేక చర్యలపై రెట్టించిన ఉత్సాహంతో పోరాడతాం. ప్రజలకు అండగా నిలుస్తాం. హుజూరాబాద్ ఫలితాలను ఓ ఉప ఎన్నిక ఫలితాలుగా కాకుండా ఓ అధ్యయనంగా తీసుకుంటాం. ఆ ప్రాంత ప్రజల ఆలోచనాసరళికి భిన్నంగా ఫలితాలు ఉన్నాయి. ఈ అంశంతో పాటు పార్టీ కార్యకర్తల పనితనం, నాయకత్వం మమేకమయ్యే తీరుపై అధ్యయనం చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ