Telangana News: దక్కేది పరి‘శ్రమే’
నిరుద్యోగ యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఉపాధికి ఆసరా అయ్యేందుకు చేపట్టిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం-పీఎంఈజీపీ)లో రాష్ట్ర పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. వడపోత పేరిట అధికారులు పెద్దఎత్తున దరఖాస్తులు తిరస్కరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏడాదికి లక్ష దరఖాస్తులు వస్తుంటే లబ్ధిదారుల సంఖ్య 500-700 లోపే. వీరికి సైతం రుణాలివ్వడానికి బ్యాంకులు మోకాలడ్డుతున్నాయి.
ఏడాదికి వెయ్యి మందికీ ప్రయోజనం చేకూర్చని పీఎంఈజీపీ పథకం
తిరస్కరణకు గురవుతున్న అధికశాతం దరఖాస్తులు
నిరుద్యోగులకు రుణ ప్రయాసలు
ఈనాడు - హైదరాబాద్
నిరుద్యోగ యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఉపాధికి ఆసరా అయ్యేందుకు చేపట్టిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం-పీఎంఈజీపీ)లో రాష్ట్ర పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. వడపోత పేరిట అధికారులు పెద్దఎత్తున దరఖాస్తులు తిరస్కరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏడాదికి లక్ష దరఖాస్తులు వస్తుంటే లబ్ధిదారుల సంఖ్య 500-700 లోపే. వీరికి సైతం రుణాలివ్వడానికి బ్యాంకులు మోకాలడ్డుతున్నాయి. ఏడాదికి కనీసం వేయి మందికైనా లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యం నీరుగారిపోతోంది.
సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల స్థాపన కోసం 18 ఏళ్లు దాటిన వారికి తయారీ రంగంలో రూ.25 లక్షలు, సేవా రంగంలో రూ.10 లక్షల చొప్పున పీఎంఈజీపీ పథకం కింద బ్యాంకుల ద్వారా రుణసాయం అందుతుంది. కేంద్రం 2008లో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీని కింద జనరల్ కేటగిరి వారు ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, మహిళ, మాజీ సైనికులు, దివ్యాంగులు, పర్వత ప్రాంతాల వారు అయిదు శాతం తమ వాటాగా చెల్లించాలి. పట్టణ ప్రాంతాల్లోని జనరల్ కేటగిరి అభ్యర్థులకు 15 శాతం, ప్రత్యేక కేటగిరి వారికి 25 శాతం రాయితీని ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఇస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో జనరల్ కేటగిరి వారికి 25 శాతం, ప్రత్యేక కేటగిరి వారికి 35 శాతం రాయితీ ఇస్తారు. మొదట్లో రూ.5-10 లక్షల విలువైన ప్రాజెక్టులే ఉండగా ఆ తర్వాత క్రమేపీ విలువను పొడిగించారు. దీనికి అనుగుణంగా దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది. సాయం అరకొరగానే అందుతోంది. 2021-22లో కేవలం 519 మందికే రుణాలిచ్చారు. 2016లో రాష్ట్రంలోని జిల్లాలు 10 నుంచి 33కి పెరిగాయి. సాయాన్ని మూడు రెట్లు పెంచాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరినా స్పందన లేదు. వేయి మందికి రుణసాయ లక్ష్యాన్ని ఏ సంవత్సరం సాధించలేదు. 33 జిల్లాల్లో సగటున ఒక జిల్లాకు 16 మంది వరకే సాయం అందింది.
చేతులెత్తేస్తున్న బ్యాంకులు
మొత్తంగా రాష్ట్ర స్థాయిలో 90 వేల వరకు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. మిగిలిన పదివేలను జిల్లాల వారీగా రుణసాయం అందించేందుకు బ్యాంకులకు పంపిస్తున్నారు. వాటిని బ్యాంకులు వెంటనే ఆమోదించకుండా తిరిగి పరిశీలనలు చేస్తున్నాయి. అభ్యర్థుల ఆర్థిక స్థితిని చూసి కొంత మందికే సాయం చేస్తున్నాయి. బ్యాంకులకు దరఖాస్తులు వచ్చినట్లు తెలిసి అభ్యర్థులు వాటి చుట్టూ ప్రదక్షిణలు చేసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఒక సంవత్సరం తిరస్కరించిన దరఖాస్తులను ఈ పథకంలో మళ్లీ పరిగణనలోనికి తీసుకోవడం లేదు. మరుసటి యేడాది మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే.
ప్రాథమిక దశలోనే తిరస్కరణ
హైదరాబాద్ బాలానగర్కు చెందిన చంద్రశేఖర్, సురేశ్లు ఐటీఐ పూర్తి చేశారు. బాలానగర్, గాంధీనగర్లలో వివిధ కంపెనీల్లో పని చేశారు. సొంతంగా లేత్ మిషన్ ఏర్పాటు చేసుకొని తమ కాళ్ల మీద తాము నిలబడాలని పీఎంఈజీపీ కింద దరఖాస్తు చేసుకున్నారు. వారికి బ్యాంకుల నుంచి పిలుపే రాలేదు. ఎంపిక కోసం నిర్వహించిన ప్రాథమిక దశలోనే ద]రఖాస్తు తిరస్కరణకు గురైందని తెలపడంతో వారు నిరాశకు గురయ్యారు.
ప్రదక్షిణలు తప్పడం లేదు
- సాగర్, హైదరాబాద్
డిగ్రీలో బీటెక్ పూర్తి చేసి సొంతంగా చిన్న పరిశ్రమ కోసం పీఎంఈజీపీలో వరుసగా మూడేళ్లుగా ప్రాజెక్టు రిపోర్ట్తో దరఖాస్తు చేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం దరఖాస్తు తిరస్కరిస్తున్నారు. బ్యాంకు అధికారులను అడిగితే సమాధానం లేదు. పథకం పేరిట నిరుద్యోగులను ఊరిస్తున్నారే తప్ప సాయం అందడం లేదు.
ఇవ్వలేమంటున్నారు
- రామరాజు, వరంగల్
జిరాక్స్ సెంటర్ ఏర్పాటు కోసం పీఎంఈజీపీలో దరఖాస్తు చేసుకున్నాను. బ్యాంకుల చుట్టూ ఎనిమిది నెలలుగా తిరుగుతున్నాను. రుణం మంజూరు చేయడం లేదు. లక్ష్యం తక్కువగా ఉంది, ఈ పథకం కింద రుణాలు ఇవ్వలేమని చెబుతున్నారు.
యువత ఆశలు నెరవేర్చాలి
- కె.సుధీర్రెడ్డి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు
చాలా మంది యువత సూక్ష్మ, చిన్న పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్నారు. జిల్లాకు కనీసం వేయి మందికైనా అవకాశం కల్పించాలి. గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. 2008 నుంచి ఉన్న పథకాన్ని ఇప్పటికైనా విస్తృతపరచాలి. నిబంధనలు సులభతరం చేయాలి. పరిశ్రమలకు ఇచ్చే మొత్తాన్ని రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలు చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే