KCR: అందరికీ బంధువవుతాం
‘ఎంతో గుండె ధైర్యంతో తెలంగాణ సాధించామని, ఇప్పుడు అదే దమ్ముతో ఎంత ఖర్చైనా వెనకాడకుండా దళితబంధు పథకం అమలు చేస్తున్నామని, దానిని సంపూర్ణంగా విజయవంతం చేస్తామని’ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
ఏడేళ్లలో రూ. 23 లక్షల కోట్ల సంపద పేదలకు పంచుతాం
నర్సింహులు అణగారిన ప్రజల గొంతుక
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు
తెరాసలో చేరిన మోత్కుపల్లి
తెలంగాణ తెచ్చాక నేను పక్కకు జరుగుదామనుకున్నా.. అయితే కొత్త రాష్ట్రం ఎవరి చేతిలో పెడితే ఎలా ఉంటుందోనని కొందరు ఆందోళన వ్యక్తం చేయడంతో నేనే పగ్గాలు చేపట్టా. ఏడ్చేటోడు ఎప్పుడూ ఏడుస్తుంటాడని లెక్క చేయకుండా తెలంగాణను ఓ దారిలో పెట్టా. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది.
- సీఎం కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: ‘ఎంతో గుండె ధైర్యంతో తెలంగాణ సాధించామని, ఇప్పుడు అదే దమ్ముతో ఎంత ఖర్చైనా వెనకాడకుండా దళితబంధు పథకం అమలు చేస్తున్నామని, దానిని సంపూర్ణంగా విజయవంతం చేస్తామని’ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దయనీయస్థితిలో ఉన్న బలహీనవర్గాలను ఆదుకోడానికి తెచ్చిన ఈ పథకాన్ని, తన ప్రాణం పోయినా ఆపేది లేదన్నారు. ఒక్క దళితబంధుతోనే ఆగిపోబోమని, బీసీలు, గిరిజనులు, మైనారిటీలు, ఈబీసీ, ఇతర వర్గాల పేదలకు కూడా వర్తింపజేస్తామన్నారు. దళితబంధుకు రూ. 1.73 లక్షల కోట్లు వెచ్చిస్తున్నామని, వచ్చే ఏడేళ్లలో ఇతర వర్గాలకు రూ. 23 లక్షల కోట్ల సంపద పంచుతామన్నారు. తెరాసకు రాజకీయం ఒక యజ్ఞమని, మిగతావాళ్లకు ఒక ఆట అని అన్నారు. ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయని, ఒకసారి గెలుస్తుండొచ్చు, ఒకసారి ఓడుతుండొచ్చు కానీ తెలంగాణ అభివృద్ధి ఆగదన్నారు. బలమైన నాయకత్వం ఉంటేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని చెప్పారు. కల్యాణలక్ష్మి వచ్చాక ఎవరైనా కట్నం అడిగితే దవడ వాచేలా కొట్టాలన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తెరాసయే గెలుస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు సోమవారం తెలంగాణ భవన్లో తెరాసలో చేరారు. సీఎం ఆయనకు గులాబి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘‘తెలంగాణ సమాజం అత్యంత దారుణమైన పరిస్థితులను అనుభవించింది. నేను మంత్రిగా ఉన్న సమయంలో ఓ సీఎం మాట్లాడుతూ.. తెలంగాణకు పెట్టుబడులు రావని అన్నారు. నేను గొడవపడ్డాను. తెలంగాణ వస్తే అభివృద్ధి జరగదని చిత్రీకరించారు. స్వరాష్ట్రమే సమస్యలకు పరిష్కారమని ఉద్యమం ప్రారంభించాం.
రాష్ట్రంలో ఎస్సీల వద్ద అతి తక్కువగా 13 లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉంది. జనాభాలో అత్యల్పంగా.. 9 శాతం ఉన్న ఎస్టీల వద్ద 22 లక్షల ఎకరాల భూమి ఉంది.
దళితబంధు యజ్ఞం
దళితబంధుకు రూ. 1.7 లక్షల కోట్లు వెచ్చిస్తున్నాం. ఈ పెట్టుబడి రూ. 10 లక్షల కోట్లు సంపాదిస్తుంది. వచ్చే ఏడేళ్లలో రూ. 23 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది. అందులో రూ. 1.7 లక్షల కోట్లు పెద్ద ఖర్చుకాదు. భారత దళిత సమాజానికి తెలంగాణ దళిత సమాజం దిక్సూచి కావాలి. దళితబంధు అమలు కోసం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీలుంటాయి. పథకాన్ని అవే అమలు చేస్తాయి.
ఎన్నికల కోసం కాదు
దళితబంధు ఆలోచన నాదే. దాన్ని ఎన్నికల కోసం తేలేదు. కొందరికి అవగాహన లేక గందరగోళం చేస్తున్నారు. ఇందులో పార్టీలు లేవు. రాజకీయాలు లేవు. దళితుడు అయితే సరిపోతుంది. దళితబంధును ఆరు నూరైనా ముందుకు తీసుకుపోతాం. బంతిలో కూర్చుంటే.. అందరికీ వంతు వస్తుంది. కులంతో పనిలేదు. పేదరికమే లెక్క. రెడ్డి, వెలమ, బ్రాహ్మణులలో పేదలు లేరా?
కల్యాణలక్ష్మి గురించి ఒకాయన నాతో మాట్లాడుతూ.. ‘కేసీఆరే లక్ష ఇస్తున్నారు. నువ్వేమి ఇస్తామని పెళ్లిచూపుల సందర్భంగా అడుగుతున్నారని’ తెలిపాడు. వాడి పళ్లు ఊడేలా దవడ మీద కొట్టమని చెప్పా.
మోత్కుపల్లికి తగినస్థాయి కల్పిస్తాం
మోత్కుపల్లి పరిచయం అక్కర్లేని వ్యక్తి, అణగారిన ప్రజల గొంతుకగా ఉన్నారు. నాకు అత్యంత సన్నిహితుడు. ఇద్దరం ఎన్నో ఏళ్లు కలిసి పనిచేశాం. మా స్నేహం రాజకీయాలకు అతీతమైంది. ఆయనకు కరోనా వచ్చినప్పుడు వైద్యులతో మాట్లాడాను. రూ.కోటి ఖర్చయినా ఫర్వాలేదని చెప్పాను. దళితబంధు అమలుకు నిర్ణయించాక ఆయనకు ఫోన్ చేశాను. సమావేశాలకు మోత్కుపల్లి హాజరయ్యారు. రేపు యాదాద్రికి వెళ్తున్నాను. అక్కడికి కూడా ఆహ్వానించాను. రాజకీయాల్లో ఎన్నేళ్లు ఉన్నామనేది ముఖ్యం కాదు. ఏం సాధించామన్నదే ముఖ్యం. మోత్కుపల్లి సేవలను సద్వినియోగం చేసుకుంటాం’’ అని సీఎం అన్నారు.
తెలంగాణలో సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పరిష్కారమవుతున్నాయి. రైతులు, నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోయాయి. మళ్లీ ఊళ్లు కళకళలాడుతున్నాయి. తెలంగాణకు కావాల్సినవి ఎన్నో ఉన్నాయి. అట్టడుగువర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి.
కేసీఆర్లాంటి సీఎంను చూడలేదు: మోత్కుపల్లి
ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ ‘‘రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుతున్న సీఎం కేసీఆర్. ప్రజలకు కావాల్సింది పేదలను ఆదుకునే నాయకుడు. నా అనుభవంలో కేసీఆర్ లాంటి సీఎంను ఎక్కడా చూడలేదు. రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపేందుకు కంకణం కట్టుకున్నారు. దళితబంధు తెచ్చారు. రైతుబంధు ఇస్తున్నారు. ప్రతి ఇంటికి మంచినీళ్లు తెచ్చారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి గొప్ప కార్యక్రమాలు పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన నాయకత్వంలో పనిచేయడం నా అదృష్టం’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం