Cyber Crime: రూ.వందకు రెండొందలు..
మెహిదీపట్నంలో నివాసముంటున్న అనితా ఘోష్కు ఆమె స్నేహితులు రెండు నెలల క్రితం ఓ విషయం చెప్పారు. లవ్లైఫ్ నేచర్ హెల్త్కేర్ సంస్థ కరోనా వైరస్ను తగ్గించే వైద్యపరికరాలు తయారు చేస్తోంది.
రెండ్రోజుల్లో ఇస్తామంటూ సైబర్ నేరగాళ్ల మాయాజాలం
కరోనా వైద్యపరికరాల తయారీ అంటూ మోసం
3 నెలల్లో రూ.300 కోట్లు కొల్లగొట్టిన వైనం
ఈనాడు - హైదరాబాద్
* మెహిదీపట్నంలో నివాసముంటున్న అనితా ఘోష్కు ఆమె స్నేహితులు రెండు నెలల క్రితం ఓ విషయం చెప్పారు. లవ్లైఫ్ నేచర్ హెల్త్కేర్ సంస్థ కరోనా వైరస్ను తగ్గించే వైద్యపరికరాలు తయారు చేస్తోంది. అందులో రూ.100 మదుపు చేస్తే.. రెండు రోజుల్లో రూ.200 ఇస్తున్నారని వివరించారు. దీంతో ఆమె ఆ సంస్థ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో రోజుకు రూ.100, రూ.200 మదుపు చేయడం ప్రారంభించారు. లాభం కూడా క్రమం తప్పకుండా రావడంతో విషయాన్ని ఆమె తన భర్తకు వివరించారు. దీంతో ఆయన నెల రోజుల్లో రూ.4.50 లక్షలు మదుపు చేశారు. ఈసారి లాభం రాకపోగా వారి చరవాణుల్లో లవ్లైఫ్ నేచర్ యాప్ స్తంభించిపోయింది.
* పాతబస్తీలోని మీర్చౌక్లో ఉంటున్న వ్యాపారి చరవాణికి ఎఫ్క్యూ మార్కెట్స్ పేరుతో ఒక లింక్ వచ్చింది. తమ కంపెనీలో మదుపు చేస్తే రూ.లక్షకు రోజుకు రూ.5వేల నుంచి రూ.10 వేల వరకూ లాభం వస్తుందని అందులో ఉంది. యాప్ను డౌన్లోడ్ చేసుకున్న వ్యాపారి తొలుత రూ.1.50 లక్షలు మదుపు చేశారు. రెండురోజుల తర్వాత మీకు రూ.15 వేల లాభం వచ్చిందని ప్రకటించారు. దీంతో ఆ వ్యాపారి పెద్దమొత్తంలో మదుపు చేస్తూ వెళ్లారు. రూ.36 లక్షలు పెట్టాక ఆయన ఖాతాలో రూ.5కోట్ల మొత్తం ఉందని సైబర్ నేరస్థుడు చెప్పాడు. విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా.. యాప్ పనిచేయడం ఆగిపోయింది.
ఇదంతా సైబర్ నేరగాళ్లు చేస్తున్న మాయ. తెలుగు రాష్ట్రాలతోపాటు మెట్రో నగరాల్లోనూ వేర్వేరు ప్రకటనలు, లింకులతో ప్రచారం నిర్వహిస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. మొబైల్ యాప్ ద్వారా రూ.లక్ష మదుపు చేస్తే.. ఇరవై రోజుల్లో మరో లక్ష రూపాయలు వస్తాయంటూ చెబుతున్నారు. వరుసగా నాలుగైదుసార్లు లాభాలు చూపించాక, పెద్ద ఎత్తున నగదు బదిలీ చేయించుకుని మొబైల్ యాప్స్ను చరవాణుల్లోంచి తొలగిస్తున్నారు.
లవ్లైఫ్ హెల్త్కేర్ ఉత్పత్తుల పేరుతో యాప్
ఇలాంటి మోసాలు ఎక్కువగా దిల్లీ కేంద్రంగా జరుగుతున్నాయి. డిజిటల్ మోసాలకు పాల్పడుతున్నవారు సెల్ఫోన్ నెట్వర్క్ కంపెనీల పొరుగుసేవల విభాగాల నుంచి మెట్రో నగరాల్లో ఉంటున్న వారి ఫోన్ నంబర్లను గంపగుత్తగా కొంటున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల్లో నివసిస్తున్న వ్యక్తుల వివరాలను పరిశీలించి జాబితాను తయారు చేసుకుంటున్నారు. వారికి లైఫ్లైన్ ఎఫ్క్యూ మార్కెట్స్ లిమిటెడ్, యాక్సన్, మాల్ 008 యాప్ల పేర్లతో వాట్సప్ నంబర్లకు లింకులు పంపుతున్నారు. వాటిని క్లిక్ చేయగానే బాధితులతో ఛాటింగ్ ప్రారంభించి వారికి డీమ్యాట్ తరహాలో ప్రత్యేకంగా ఓ డిజిటల్ ఖాతాను ప్రారంభిస్తున్నారు. ఆ ఖాతాలో నగదు విత్డ్రా మాత్రం సైబర్ నేరస్థుల చేతుల్లో ఉంటోంది. ఇలా రెండు నెలల్లో రూ.300 కోట్ల వరకు స్వాహా చేసుంటారని సమాచారం.
తెరవెనుక చైనా కంపెనీలు!
హైదరాబాద్తో పాటు, విజయవాడలో కూడా దీనిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు... బాధితులు తెలిపిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి, లవ్లైఫ్ నేచర్ కంపెనీపై దృష్టి కేంద్రీకరించారు. ఈ వెబ్సైట్ను అమెరికాలోని అరిజోనాలో మూడు నెలల క్రితం సృష్టించినట్టు తెలుసుకున్నారు. దీని వెనక చైనా కంపెనీలున్నట్టు అనుమానిస్తున్నారు. దిల్లీలో ఓ కార్యాలయాన్ని ప్రారంభించి పది మందిని నియమించుకున్నారని సమాచారం. అనసూయ, సందీప్, శుభి పేర్లతో బాధితులకు ఫోన్లు వచ్చినట్టు తెలుసుకున్న పోలీసులు.. నగదు లావాదేవీలను పరిశీలించారు. కేసును పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని సైబర్క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ వెల్లడించారు.
కేవీఎం ప్రసాద్ ఏసీపీ సైబర్క్రైమ్స్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
జెన్కో అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష వాయిదా
పార్లమెంట్ ఎన్నికల కోడ్ దృష్ట్యా తెలంగాణ జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్) పోస్టుల భర్తీకి ఈ నెల 31న ఆన్లైన్లో నిర్వహించాల్సిన కంప్యూట్ ఆధారిత పరీక్ష (సీబీటీ)ను వాయిదా వేసినట్లు జెన్కో సీఎండీ తెలిపారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజున వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
పర్యాటకులను వేధించొద్దు
తనిఖీల సందర్భంగా పర్యాటకులను వేధించొద్దంటూ అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) తాజాగా లేఖ రాసింది. -
న్యాయస్థానం ఆదేశాలను పాటించడంలేదు
జ్యుడిషియల్ కస్టడీ సమయంలో తనకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో కోర్టు జారీచేసిన ఆదేశాలను తిహాడ్ జైలు అధికారులు పాటించడంలేదని భారాస ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. -
హనుమకొండలో కేటీఆర్పై కేసు నమోదు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు తదితరులు హనుమకొండ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
ప్రత్యేక రైళ్ల పొడిగింపు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఐదు జతల ప్రత్యేక రైళ్లను మరికొద్దిరోజులు పొడిగిస్తున్నట్లు ద.మ.రైల్వే గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. -
పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించండి
బూటకపు పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో గురువారం మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు. -
సంక్షిప్త వార్తలు
ఫోన్ ట్యాపింగ్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్గౌడ్, నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి గురువారం డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్