China: పాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన
భారత్తో సరిహద్దుల్లో తన దూకుడును చైనా మరింత పెంచింది. తమ భూభాగంలో మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరుస్తోంది. ఇందులో భాగంగా తూర్పు లద్దాఖ్లోని పాంగాంగ్ సరస్సుపై ఓ కీలక వంతెనను
సైనికులు, ఆయుధాల సత్వర తరలింపునకు వీలు
భారత బలగాలపై పైచేయి సాధించే ప్రయత్నం
ఈనాడు, హైదరాబాద్: భారత్తో సరిహద్దుల్లో తన దూకుడును చైనా మరింత పెంచింది. తమ భూభాగంలో మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరుస్తోంది. ఇందులో భాగంగా తూర్పు లద్దాఖ్లోని పాంగాంగ్ సరస్సుపై ఓ కీలక వంతెనను ప్రస్తుతం నిర్మిస్తోంది. తాజాగా బయటికొచ్చిన ఉపగ్రహ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. అత్యవసర సమయాల్లో సైనిక బలగాలు, ఆయుధ సామగ్రిని సరిహద్దులకు వేగంగా తరలించేందుకు వంతెన దోహదపడనుంది. దాని నిర్మాణం దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరితగతిన పూర్తిచేసేందుకుగాను దాని నిర్మాణంలో ఫాబ్రికేటెడ్ పద్ధతిని అనుసరిస్తున్నారు. 2020 జూన్ నాటి గల్వాన్ ఘర్షణల తర్వాత భారత సైన్యం పాంగాంగ్ సరస్సుకు దక్షిణం వైపు ఉన్న కీలక కైలాశ్ రేంజ్ పర్వత శిఖరాలను ఆక్రమించింది. అక్కడికి భారీగా బలగాలను తరలించింది. తద్వారా ఆ ప్రాంతంలో చైనా బలగాలపై పైచేయి సాధించింది. అప్పటి నుంచి అక్కడ పట్టు కోసం చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ ప్రణాళికల్లో భాగంగానే తాజాగా వంతెన నిర్మాణాన్ని తలపెట్టింది. డ్రాగన్ భూభాగంలోనే కుర్నాక్ ప్రాంతంలో పాంగాంగ్ సరస్సుసై దాన్ని నిర్మిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే.. భారత సరిహద్దుల్లోని రుడోక్ వరకూ బలగాల తరలింపు సులువవుతుంది. సమీపంలోని సైనిక శిబిరాల నుంచి డ్రాగన్ బలగాలను తరలించడానికి ఇప్పుడు 180 కిలోమీటర్ల దూరం తిరిగి రావాల్సి వస్తోంది. కొత్త వంతెన నిర్మాణంతో ఆ దూరం 50 కిలోమీటర్లకే పరిమితమవుతుంది. భారత్తో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా కొన్నాళ్లుగా దూకుడుగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో అత్యాధునిక గ్రామాలు నిర్మిస్తోంది. భారత సరిహద్దుకు చేరువలో ఇటీవల అనేక ఫార్వర్డ్ ఆపరేషనల్ బేస్ల నిర్మాణం చేపట్టింది. వీటిలో క్షిపణి ప్రయోగ వేదికలు, హెలిపాడ్లు కూడా ఉంటాయి. మరోవైపు- డ్రాగన్ ప్రయత్నాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామని భారత సైనిక అధికారులు చెబుతున్నారు.
ఆధిపత్యం కోసమే..
లద్దాఖ్ ప్రాంతంలో ఆధిపత్యం ప్రదర్శించాలన్న ఉద్దేశంతోనే చైనా హడావుడిగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించిందని భారత సైనిక అధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. ఇప్పటికే పశ్చిమ హిమాలయాల ప్రాంతంలో శరవేగంగా కొన్ని వందల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ను డ్రాగన్ ఏర్పాటుచేసినట్లు చెప్పారు. సైనిక శిబిరాల మధ్య సమాచార వ్యవస్థ నాణ్యంగా, పకడ్బందీగా ఉండేందుకు అది దోహదపడుతుందని తెలిపారు. సంప్రదాయ సమాచార వ్యవస్థలోకి ప్రత్యర్థి దేశాలు చొరబడే అవకాశం ఉంటుందన్న సంగతిని గుర్తుచేశారు. అందుకు తావులేని విధంగా కేబుల్ ద్వారా సైనిక శిబిరాలను అనుసంధానం చేయడం వ్యూహాత్మక చర్యేనని ఆయన వివరించారు. ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను నిర్మించడమే లక్ష్యంగా చైనా ఇటీవల కాలంలో తన భూభాగంలో అనే నిర్మాణాలు చేపట్టిందని పేర్కొన్నారు. కొత్త రహదారులతో పాటు సొరంగాలు, వంతెనల నిర్మాణంపై ఆ దేశం దృష్టి సారించిందని చెప్పారు.
గల్వాన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చైనా
దిల్లీ: కొత్త ఏడాది తొలి రోజునే గల్వాన్ లోయలో చైనా సైనికులు తమ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తద్వారా ఆ లోయ తమదేనని వారు ప్రకటించినట్లయింది. సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే- ఇరు దేశాల మధ్య నిస్సైనీకరణ జోన్ను చైనా అతిక్రమించలేదని భారత సైనిక వర్గాలు స్పష్టం చేశాయి. ఆ దేశ సైనికులు వారి భూభాగంలోనే జాతీయ పతాకాన్ని ఎగరేశారని తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు. -
భూసార పరీక్ష కేంద్రాల పునరుద్ధరణ
రాష్ట్రంలో మూతపడిన 25 భూసార పరీక్ష కేంద్రాలను పునరుద్ధరించాలని, నేల పోషక విలువలు, ఆరోగ్య సమాచార సేవలను రైతులకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
శ్రీరాముడి పట్టాభిషేకం.. పులకించిన భక్తజనం
శ్రీరాముడి మహాపట్టాభిషేక మహోత్సవంతో భద్రగిరి దివ్యక్షేత్రం గురువారం పులకించింది. సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు సీతమ్మతో కలిసి భక్తకోటికి రాజాధిరాజుగా సాక్షాత్కరించాడు. -
కృష్ణా జలాల విడుదలకు కేఆర్ఎంబీ ఉత్తర్వులు
కృష్ణా జలాల విడుదలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. మే నెలాఖరు వరకు నాగార్జునసాగర్ నుంచి రెండు రాష్ట్రాలు 14 టీఎంసీలు వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. -
‘గ్రేటర్’ విద్యుత్ డిమాండ్!
హడలెత్తిస్తున్న ఎండలు.. భరించలేని ఉక్కపోతతో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ వినియోగం అమాంతం పెరుగుతోంది. -
అభిషేక్ బోయిన్పల్లి మధ్యంతర బెయిల్ మే 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్ వ్యాపారి అభిషేక్ బోయిన్పల్లికి ఈనెల 29వ తేదీ వరకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మే 8 వరకు పొడిగించింది. -
జపాన్లో భారత విద్యార్థులకు ఉపకార వేతనాలు
జపాన్లోని జాతీయ విశ్వవిద్యాలయాల్లో 2025లో ప్రవేశాలు పొందే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు తమ దేశ ప్రభుత్వం విద్యా, సాంస్కృతిక, క్రీడ, శాస్త్ర, సాంకేతిక శాఖ(మెక్స్ట్) ద్వారా ఉపకారవేతనాలు ఇస్తుందని చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం గురువారం వెల్లడించింది. -
మహాత్మాగాంధీ సిద్ధాంతాలు ప్రపంచానికి ఆదర్శం
జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలు, అహింసా సిద్ధాంతం ప్రపంచానికి ఆదర్శనీయమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. -
మళ్లీ వరికే పెద్దపీట
రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం సీజన్లో రైతులు వరి, పత్తి సాగుకు పెద్దపీట వేయనున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. -
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్తో అప్రమత్తం
మావోయిస్టులను దెబ్బతీసేందుకు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ప్రయత్నాలు తెలంగాణపైనా ప్రభావం చూపుతున్నాయి. -
చెరువుల పరిరక్షణకు.. చర్యలేమిటో చెప్పండి!
కబ్జాలతో కుచించుకుపోతున్న చెరువులు, కుంటల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ హెచ్ఎండీయేతోపాటు పలు ప్రభుత్వ శాఖలకు గురువారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు