CM KCR: ఒమిక్రాన్పై అప్రమత్తం
తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. గతంలో 11 నుంచి సంక్రాంతి సెలవులు ఇవ్వాలనుకున్నా.. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో మూడు రోజుల ముందే వాటిపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్పై ప్రజలు భయాందోళన చెందనవసరం లేదని, నిరంతరం అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలన్నారు. పనిచేసే చోట్ల అప్రమత్తత పాటిస్తూ మాస్క్లు...
విద్యాసంస్థలకు 8 నుంచే సంక్రాంతి సెలవులు
ప్రజలంతా కొవిడ్ నిబంధనలు విధిగా పాటించాలి
ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచాలి
15 రోజుల్లో ఖాళీలు భర్తీ చేయాలి
మరిన్ని నగరాలు, పట్టణాలకు బస్తీ దవాఖానాల విస్తరణ
సీఎం కేసీఆర్ ఆదేశం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. గతంలో 11 నుంచి సంక్రాంతి సెలవులు ఇవ్వాలనుకున్నా.. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో మూడు రోజుల ముందే వాటిపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్పై ప్రజలు భయాందోళన చెందనవసరం లేదని, నిరంతరం అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలన్నారు. పనిచేసే చోట్ల అప్రమత్తత పాటిస్తూ మాస్క్లు ధరించాలని, నిబంధనలను విధిగా పాటించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం కరోనాను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందన్నారు. కేసులు పెరుగుతున్నందున రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతులన్నింటినీ పూర్తిస్థాయిలో మెరుగుపరచాలని.. పడకలు, ఆక్సిజన్, ఔషధాలు పరీక్ష కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలని ఆదేశించారు. అన్ని దవాఖానాల్లో వైద్యులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఏ కారణం చేతనైనా ఖాళీలు ఏర్పడితే 15 రోజుల్లో భర్తీ చేసుకునేలా విధివిధానాలు రూపొందించాలన్నారు. హైదరాబాద్ తరహాలో అన్ని నగరపాలక సంస్థల్లో సామాన్యులకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు మరిన్ని బస్తీ దవాఖానాలను ఏర్పాటుచేయాలని సూచించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో వైద్య ఆరోగ్యశాఖపై సీఎం సోమవారం ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. మంత్రులు హరీశ్రావు, ఇంద్రకరణ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘ పెరుగుతున్న జనాభా అవసరాల రీత్యా రాష్ట్రంలో డాక్టర్లు, పడకలు, ఇతర మౌలిక వసతులు పెరగాలి. నూతనంగా నిర్మించుకున్న సమీకృత కలెక్టర్ కార్యాలయాల్లోకి పలు శాఖల కార్యాలయాలు మారుతున్న దృష్ట్యా ఖాళీ అయిన పాత కలెక్టరేట్లను, శాఖల భవనాలను, స్థలాలను విద్యా, వైద్యశాఖకు బదలాయించాలి. ప్రభుత్వాసుపత్రుల్లో పడకల్లో దాదాపు 99 శాతానికి ఆక్సిజన్ సమకూరింది. మిగిలిన ఒక్క శాతానికి కూడా దాన్ని కల్పించాలి. రాష్ట్రంలో ఆక్సిజన్ 500 మెట్రిక్ టన్నులకు పెంచాలి. హోం ఐసొలేషన్ కిట్లను కోటికి పెంచాలి. పరీక్ష కిట్లను రెండు కోట్లకు పెంచాల’’ని చెప్పారు.
మరిన్ని బస్తీ దవాఖానాలు
హైదరాబాద్లోని బస్తీ దవాఖానాలు సామాన్యులకు మంచి సేవలనందిస్తున్నాయి. జీహెచ్ఎంసీతో పాటు ఇతర నగరాల్లో బస్తీదవాఖానాల సంఖ్యను మరింత పెంచాలి. హెచ్ఎండీఏ పరిధిలోని కంటోన్మెంట్ జోన్లో వార్డుకొకటి చొప్పున 6 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తాం. రసూల్పురలో రెండు, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, మల్కాజిగిరి, జల్పల్లి, మీర్పేట, పీర్జాదీగూడ, బోడుప్పల్, జవహర్నగర్, నిజాంపేట్లలో ఒక్కొక్కటి ఏర్పాటు చేయాలి. వరంగల్ కార్పొరేషన్ 4, నిజామాబాద్ 3, కరీంనగర్, రామగుండం, మహబూబ్నగర్, ఖమ్మం, నల్గొండల్లో రెండేసి.. జగిత్యాల, సూర్యాపేట, సిద్దిపేట, మిర్యాలగూడ, కొత్తగూడెం, పాల్వంచ, నిర్మల్, మంచిర్యాల, తాండూర్, వికారాబాద్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి, సంగారెడ్డి, జహీరాబాద్, గద్వాల, వనపర్తి, సిరిసిల్ల, తెల్లాపూర్, బొల్లారం, అమీన్పూర్, గజ్వేల్, మెదక్లో ఒక్కొక్కటి చొప్పున బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తాం’’ అని సీఎం తెలిపారు.
లాక్డౌన్ అవసరం లేదు
ఈ సందర్భంగా వైద్యాధికారులు రాష్ట్రంలోని పరిస్థితులను సీఎంకు నివేదించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో లాక్డౌన్ విధించే పరిస్థితులు లేవని తెలిపారు. రాష్ట్రంలో కరోనా ప్రబలే ప్రమాదం ఉన్నందున బహిరంగ సభలు, ర్యాలీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించాలని, ప్రభుత్వ నిబంధనలను పాటించడం ద్వారా కరోనాను నియంత్రించవచ్చని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే