JP Nadda: దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమిది
తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజల కోసం భాజపా పోరాటం చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా స్పష్టం చేశారు. తమ ధర్మపోరాటానికి వారంతా మద్దతు ఇవ్వాలని కోరారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డితో కలిసి మంగళవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు.
కాళేశ్వరాన్ని ఏటీఎంలా మార్చుకున్న కేసీఆర్
హుజూరాబాద్ ఫలితాన్ని రాష్ట్రమంతా చూపిస్తాం
భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా
కారులోంచి కార్యకర్తలకు అభివాదం చేస్తున్న జె.పి.నడ్డా. పక్కన కేంద్రమంత్రి కిషన్రెడ్డి
కేసీఆర్ సర్కార్ తీరు చూస్తుంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? అనే సందేహం కలుగుతోంది. ఈ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. ముఖ్యమంత్రి మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారు. ఇది ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం. అవినీతి, అప్రజాస్వామిక, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భాజపా ధర్మయుద్ధం చేస్తోంది. వీరిని గద్దె దించేవరకు మా పోరాటం కొనసాగుతుంది
- భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజల కోసం భాజపా పోరాటం చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా స్పష్టం చేశారు. తమ ధర్మపోరాటానికి వారంతా మద్దతు ఇవ్వాలని కోరారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డితో కలిసి మంగళవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్పైనా, రాష్ట్ర ప్రభుత్వంపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. హుజూరాబాద్ ఫలితం రుచిని రాష్ట్రవ్యాప్తంగా చూపిస్తాం.. అంటూ తెరాసను హెచ్చరించారు. ఉద్యోగులకు మద్దతు ఇచ్చేందుకే రాష్ట్రానికి వచ్చానని తెలిపారు. ‘రాష్ట్రంలో మంత్రులు అనేక ర్యాలీలు నిర్వహించారు. వారికి కరోనా నిబంధనలు అమలుకావా? భాజపాకే అడ్డు వస్తాయా? ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యపై బండి సంజయ్ శాంతియుతంగా దీక్ష చేపడితే ఆయన కార్యాలయంలోకి పోలీసులు బలవంతంగా వెళ్లారు. సంజయ్పై భౌతికదాడి చేయడంతో పాటు కార్యకర్తలపై లాఠీఛార్జి చేశారు. దుబ్బాక, హుజూరాబాద్లలో ఓటముల్ని తెరాస జీర్ణించుకోలేకపోతోంది. కరోనా సాకుతో ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం అణచివేస్తోంది. 317 జీఓ విషయంలో తన వైఖరి మార్చుకోవాలి.
సీఎం కనుసన్నల్లోనే అంతా..
రాష్ట్రంలో ఉన్నది దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం. సీఎం కనుసన్నల్లోనే అవినీతి జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అసలు అంచనా వ్యయం రూ. 36 వేల కోట్లు అయితే రూ.1.20 లక్షల కోట్లకు పెంచారు. దాన్ని కేసీఆర్ ఏటీఎంలాగా మార్చుకున్నారు. ఆ నీళ్లు ఆయన ఫాంహౌస్కే వెళ్తున్నాయి. పాలమురు-రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి, మిషన్ భగీరథ నుంచి చుక్క నీరు ఇచ్చారా? రాష్ట్రాన్ని తానీషాలా పాలిస్తున్నారు. కొడుకు, కూతురు, అల్లుడు.. కుటుంబ పాలన ఇది. కేసీఆర్ అవినీతిని, నియంతృత్వ విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళతాం. బండి సంజయ్ అరెస్టు అప్రజాస్వామికం. ‘వినాశకాలే విపరీత బుద్ధిః’ అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. భాజపా సైద్ధాంతిక పార్టీ. మమ్మల్ని ఆపలేరు. కేసీఆర్ ముసుగు తొలగిస్తాం. అవినీతి, నియంతృత్వ ప్రభుత్వంపై పోరాటం చేస్తాం. రోజూ ధర్నాలు చేస్తాం.
కాంగ్రెస్ పోరాడదు..
‘భాజపా, తెరాసలవి దిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ. తెరాసపై ఆరోపణలు చేస్తున్న భాజపా విచారణ చేయిస్తుందా?’ అంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శల గురించి విలేకరులు ప్రస్తావించగా, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వంపై భాజపా మాత్రమే పోరాటం చేస్తుందని.. అందులో సఫలీకృతం అవుతుందని నడ్డా స్పష్టంచేశారు. కాంగ్రెస్ పోరాటం చేయదు. చేయనివ్వదు.. మాకో విధానం ఉంది. పోరాటం చేస్తాం.. అని పేర్కొన్నారు. ‘బండి సంజయ్ విషయాన్ని భాజపా జాతీయ మానవ హక్కుల సంఘానికి నివేదిస్తుంది. సంజయ్ ఫిర్యాదుపై లోక్సభ స్పీకర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తారు’ అని బదులిచ్చారు. ‘కరోనా తెలంగాణలోకి రాలేదు.. ఒక్కరమైనా మాస్క్ పెట్టుకున్నామా?’ అంటూ అసెంబ్లీలో కరోనా తొలి వేవ్ ప్రారంభంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియోను నడ్డా ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ సమావేశంలో భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ఛుగ్, ముఖ్యనేతలు డీకే అరుణ, విజయశాంతి, కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, రఘునందన్రావు, జితేందర్రెడ్డి, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు. -
భూసార పరీక్ష కేంద్రాల పునరుద్ధరణ
రాష్ట్రంలో మూతపడిన 25 భూసార పరీక్ష కేంద్రాలను పునరుద్ధరించాలని, నేల పోషక విలువలు, ఆరోగ్య సమాచార సేవలను రైతులకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
శ్రీరాముడి పట్టాభిషేకం.. పులకించిన భక్తజనం
శ్రీరాముడి మహాపట్టాభిషేక మహోత్సవంతో భద్రగిరి దివ్యక్షేత్రం గురువారం పులకించింది. సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు సీతమ్మతో కలిసి భక్తకోటికి రాజాధిరాజుగా సాక్షాత్కరించాడు.
తాజా వార్తలు (Latest News)
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి