KTR: అదరం.. బెదరం
భాజపా తాటాకు చప్పుళ్లకు తెలంగాణలో బెదిరిపోయే వారెవరూ లేరని తెరాసకార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. అబద్దాల అడ్డా..
నడ్డా.. అబద్ధాల అడ్డా
రైతులు అడ్డుకుంటే వెనుదిరిగిన దుస్థితి ఏ ప్రధానికీ రాలేదు
ఉద్యోగులతో మాది పేగుబంధం
భాజపాది రాద్ధాంతం: మంత్రి కేటీఆర్
2022 నాటికి అందరికీ ఇళ్లు కట్టి ఇస్తామంటూ ప్రధాని ఇచ్చిన హామీ గురించి వివరిస్తున్న మంత్రి కేటీఆర్. పక్కన మంత్రి శ్రీనివాసగౌడ్
ఈనాడు, హైదరాబాద్: భాజపా తాటాకు చప్పుళ్లకు తెలంగాణలో బెదిరిపోయే వారెవరూ లేరని తెరాసకార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. అబద్దాల అడ్డా.. కేరాఫ్ ఎర్రగడ్డ అని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై, రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయంగా ఉన్నాయన్నారు. బండి సంజయ్కు, జేపీ నడ్డాకు పెద్ద తేడా ఏమీ లేదన్నారు. ఏడున్నరేళ్లలో కేంద్రంలో భాజపా చేసిందేమీ లేదని, తెలంగాణకు అరపైసా సాయం అందించలేదని విమర్శించారు.. కల్లాల్లో వడ్ల నుంచి కంటోన్మెంట్ రోడ్ల దాకా భాజపాది అన్నింటా కిరికిరేనని పేర్కొన్నారు. ప్రధాని మోదీ రైతు విరోధిగా మారారని, పంజాబ్లో అన్నదాతలు అడ్డుకోగా.. 20 నిమిషాల పాటు రోడ్డుపైనే ఉండి, సభను రద్దు చేసుకున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఏ ప్రధానికీ రాలేదన్నారు. తెలంగాణ ఉద్యోగుల గురించి మాట్లాడే హక్కు భాజపాకు లేదని, వారికి జీవో నంబర్ 317 గురించి ఏమాత్రం తెలియదని చెప్పారు. ఉద్యోగులతో తమది పేగుబంధమని, భాజపా తోకబంధం కోసం యత్నిస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకునేది లేదని, ప్రతి అంశంలో కేంద్రంలోని భాజపా పాలనను చీల్చిచెండాడుతామన్నారు. విభజన హామీల గురించి నిలదీస్తామని తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్లో ఆయన మంత్రులు తలసాని, శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్పై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. నడ్డా తన స్థాయి దిగజార్చుకున్నారు. ఏడున్నరేళ్లలో భాజపా దేశానికి ఉపయోగపడే మంచిపని ఒక్కటీ చేయలేదు. నిజాలు చెబితే దాడులకు పాల్పడుతోంది. సీబీఐ, ఐటీ, ఈడీ, ఎన్ఐఏలు భాజపా భాగస్వామ్య పక్షాల్లా మారాయి. ప్రధాని మోదీ 2022 కల్లా భారత్లో ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టిస్తాం. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం, విద్యుత్, నల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు. కేసీఆర్ది స్టేట్స్మన్ పాలన.. మోదీది సేల్స్మెన్ పాలన.
అత్త గురించి మరచిపోయిన నడ్డా
కాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎం అని నడ్డా అన్నారు. కేసీఆర్ ప్రజలకే ఏటీఎం. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వకుండా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. భాజపా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం సిగ్గు చేటు. 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను మార్చింది మీరు కాదా? రైతులు దిల్లీకి రాకుండా సరిహద్దుల్లో మేకులు కొట్టిన చరిత్ర భాజపాది. కేంద్రమంత్రి కుమారుడు రైతులను కారుతో తొక్కించి చంపినా చర్యల్లేవు. తన అత్త జయశ్రీ బెనర్జీ ఎంపీగా, మంత్రిగా పని చేసిన విషయం మరిచిపోయి నడ్డా కుటుంబపాలన గురించి మాట్లాడుతున్నారు. భాజపాలో ఎంతోమంది నేతల వారసులు రాజకీయాల్లో ఉన్నారు. అమిత్షా కుమారుడికి బీసీసీఐ పదవి ఎలా వచ్చింది? మేము ఉద్యమాల్లో పాల్గొని ప్రజలు ఎన్నుకుంటే గెలిచాం.
గుండు పోతే వస్తుందా?
కరీంనగర్లో బండి సంజయ్ తన తల తానే పగలగొట్టుకుంటుంటే పోలీసులు కాపాడారు. బండి పోతే బండి వస్తుంది.. గుండు పోతే గుండు వస్తుందా? తెలంగాణలో ఏం కొంపలు మునిగాయని నడ్డా హైదరాబాద్ వచ్చారు? భాజపావి ఎర్రగడ్డ మాటలు. మిషన్ భగీరథ గొప్పదని కేంద్రమంత్రి షెకావత్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి గురించి రేవంత్ అడిగితే అదేమీ లేదని కేంద్రమే పార్లమెంటులో జవాబిచ్చింది. ఇవేమీ నడ్డాకు తెలియవా?
ఉద్యోగులకు భాజపా చేసిందేమిటి
మాది ఉద్యోగులకు సన్నిహిత ప్రభుత్వం. రెండు పీఆర్సీలు, డీఏలతో కలిపి వారికి దేశంలో ఎక్కడా లేని విధంగా 87 శాతం వేతనాలు పెంచాం. భాజపా ఏం చేసిందని ఆ పార్టీని నమ్ముతారు? కేంద్రం ఏడున్నరేళ్లలో ఉద్యోగులకు జీతాలు పెంచింది కేవలం 15 శాతమే. తెలంగాణలో 95 శాతం స్థానికులకు అవకాశం కల్పించేందుకే 317 జీవోను తెచ్చాం. కొత్త జోనల్ విధానం అమలు ద్వారా ఏర్పడే ఖాళీల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంటే దానికి అడ్డుపుల్లలు వేస్తున్నారు. భాజపాకు భయపడేవాళ్లం కాదు. భయపడితే తెలంగాణ వచ్చేదే కాదు’’ అని కేటీఆర్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
జెన్కో అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష వాయిదా
పార్లమెంట్ ఎన్నికల కోడ్ దృష్ట్యా తెలంగాణ జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్) పోస్టుల భర్తీకి ఈ నెల 31న ఆన్లైన్లో నిర్వహించాల్సిన కంప్యూట్ ఆధారిత పరీక్ష (సీబీటీ)ను వాయిదా వేసినట్లు జెన్కో సీఎండీ తెలిపారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజున వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
పర్యాటకులను వేధించొద్దు
తనిఖీల సందర్భంగా పర్యాటకులను వేధించొద్దంటూ అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) తాజాగా లేఖ రాసింది. -
న్యాయస్థానం ఆదేశాలను పాటించడంలేదు
జ్యుడిషియల్ కస్టడీ సమయంలో తనకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో కోర్టు జారీచేసిన ఆదేశాలను తిహాడ్ జైలు అధికారులు పాటించడంలేదని భారాస ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. -
హనుమకొండలో కేటీఆర్పై కేసు నమోదు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు తదితరులు హనుమకొండ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్