Vanama Raghava: అతడో కాలకేయుడు
రాజకీయం నీడన సాగే చాటుమాటు అరాచకాలకు పరాకాష్ట ఇది.. అధికారం మాటున ఓ సామాన్యుడి కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునేలా..
తండ్రి ప్రజాప్రతినిధి.. తనయుడు అరాచకవాది
ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవ ఆగడాలు
అధికారం అండతో చెలరేగుతున్నట్లు ఆరోపణలు
అతడి ఆశీస్సులుంటేనే పోస్టింగ్.. ఆ కృతజ్ఞతతోనే నోరు మెదపని పోలీసులు!
ఈటీవీ-ఖమ్మం, న్యూస్టుడే-కొత్తగూడెం పట్టణం: రాజకీయం నీడన సాగే చాటుమాటు అరాచకాలకు పరాకాష్ట ఇది.. అధికారం మాటున ఓ సామాన్యుడి కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునేలా.. ఆస్తి వివాదానికి బాధితుడి భార్యను పణంగా పెట్టమన్న దారుణమిది.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాతపాల్వంచలో తాజాగా ఈ నెల 3న మండిగ నాగ రామకృష్ణ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు అసలు కారణం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడైన వనమా రాఘవేంద్రరావు అలియాస్ రాఘవ (59) అని తేలింది. రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తన ఆత్మహత్యతో పాటు భార్యా బిడ్డల్ని సైతం చంపుకునేందుకు రాఘవేంద్రరావు బెదిరింపులే కారణమని బాధితుడు ఆ వీడియోలో ఆరోపించటంతో రాష్ట్రవ్యాప్తంగా దుమారం చెలరేగింది. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలంటూ భాజపా, కాంగ్రెస్ ఆందోళనకు దిగాయి. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాజా ఉదంతం అనంతరం రాఘవ అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తండ్రి శాసనసభ్యుడు, మాజీ మంత్రి కావడం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీనియర్ నేతగా పట్టు ఉండటంతో నియోజకవర్గంలో రాఘవ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్న ఆరోపణలున్నాయి. తన నియోజకవర్గంలో ఏ అధికారులు పనిచేయాలన్నది అతడే నిర్ణయిస్తాడని, అతడి ఆశీస్సులు లేకుండా పోలీసులకు ఎక్కడా పోస్టింగులు దక్కవని స్థానికులు చెబుతుంటారు. ఇందుకు ప్రతిఫలంగా ఆయా అధికారులు ఇతడు ఏ అరాచకాలకు పాల్పడినా నోరు మెదపరనేది బాధితుల ఆరోపణ. వారి ఉదాసీనతే 4 నిండు ప్రాణాలను బలి తీసుకుందనేది తాజా ఆరోపణ.
విలన్ పాత్రలకు నకలు
వనమా రాఘవేంద్రరావు అలియాస్ రాఘవ దాదాపు మూడు దశాబ్దాలుగా కొత్తగూడెం కేంద్రంగా ఆయన సాగిస్తున్న ఆగడాలకు అడ్డేలేదు. వాటిని చూస్తే సినిమాల్లో చూపించే విలన్ పాత్రలెన్నో గుర్తుకొస్తాయి. ఆయన వేలుపెట్టని వివాదమే ఉండదంటే అతిశయోక్తికాదు. తండ్రి వనమా వెంకటేశ్వరరావు శాసనసభ్యుడు కావడం, కొంతకాలం మంత్రిగా కూడా పనిచేసి ఉండటంతో అధికార యంత్రాంగం కూడా రాఘవేంద్రరావు కొమ్ము కాసేదనేది నిర్వివాదాంశం. అధికారికంగా రాఘవపై ఆరు కేసులే నమోదయ్యాయి. కానీ నమోదు కాని దురాగతాలకు లెక్కేలేదు. కొత్తగూడెం నియోజకవర్గంలోనే కాదు మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఆయన అరాచకాలపై పెద్ద చర్చే జరుగుతుంటుంది. తండ్రి శాసనసభ్యుడిగా ఎన్నికయిప్పటి నుంచీ తన నియోజకవర్గం పరిధిలో అధికారుల బదిలీలు మొదలు భూవివాదాలు, ఆస్తి వ్యవహారాలే కాదు.. చివరకు వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబ కలహాల్లో కూడా తలదూర్చేవాడన్న ఆరోపణలెన్నో ఉన్నాయి.
నాటి నుంచే ఆగడాలు..
రాఘవపై 2006లో అధికారికంగా మొదట కేసు నమోదైంది. అంతకు దాదాపు దశాబ్దంన్నర ముందు నుంచే అతని ఆగడాలు మొదలయ్యాయి.
* 2006లో పాలకోయ తండాలో ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురైంది. వాటిని తొలగించేందుకు రెవెన్యూ, పురపాలక అధికారులు వెళ్లారు. అక్కడకు వచ్చిన రాఘవ వారితో దురుసుగా ప్రవర్తించడంతో తొలి కేసు నమోదైంది. ఇది ఇంకా విచారణ దశలోనే ఉంది.
* 2013లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మద్యం, డబ్బులు పంపిణీపై రెండు కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఆపినా పట్టించుకోకుండా వాహనంలో దూసుకెళ్లారు. ఇదే ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు, చీరలు పంపిణీ చేస్తుండగా అడ్డుకోబోయిన ప్రభుత్వ ఉద్యోగులతో దురుసుగా వ్యవహరించాడు. ఈ దౌర్జన్యంపై మరో కేసు నమోదు కాగా న్యాయస్థానంలో విచారణ తర్వాత కొట్టేశారు.
* 2017లో ఓ ధర్నా సందర్భంగా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసి ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారంటూ నమోదైన కేసు ఇంకా దర్యాప్తు సాగుతూనే ఉంది.
* 2020లో పాల్వంచ సోనియానగర్లో భూక్యా జ్యోతి అనే మహిళకు చెందిన భూ వివాదంలో ఎమ్మెల్యే తనయుడు జోక్యం చేసుకోవడం రచ్చకు దారితీసింది. జ్యోతిపై అతడి అనుచరులు దాడిచేయగా తీవ్రంగా గాయపడింది. బాధితురాలు మంత్రి సత్యవతి రాథోడ్ను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ను ఆశ్రయించగా పోలీసులు దిగొచ్చి కేసు నమోదు చేయక తప్పలేదు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
వడ్డీ వ్యాపారి ఆత్మహత్య
* 2021 జులైలో పాల్వంచకు చెందిన వడ్డీ వ్యాపారి మలిపెద్ది వెంకటేశ్వర్లు రూ. 50 లక్షలకు చిట్టీ పాడారు. నిర్వాహకుడు డబ్బుకు బదులు స్థానిక బొల్లోజుగూడెంలో ప్లాటును రాసిచ్చాడు. అదే స్థలాన్ని మరో వ్యక్తికీ రాసివ్వడం వివాదానికి దారితీసింది. ఈ ఉదంతంలో రాఘవ బెదిరింపులతో బాధితుడిపైనే పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆరోపణలున్నాయి. జైలుకెళ్లిన వెంకటేశ్వర్లు బయటకు వచ్చాక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి కారణం వనమా కుమారుడేనని లేఖ రాశాడు.
* తాజాగా పాతపాల్వంచలో రాఘవ కారణంగా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తింది.
పోలీసు, న్యాయ వ్యవస్థకు సహకరిస్తా: వనమా
రామకృష్ణ ఆత్మహత్య ఉదంతం దిగ్భ్రాంతికి గురిచేసిందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ‘బాధితుడు విడుదల చేసిన సెల్ఫీ వీడియో నన్నెంతో కలచివేసింది. ఆయన నా కుమారుడిపై పలు ఆరోపణలు చేశారు. ఈ కేసులన్నింటిలో నిర్దోషిత్వాన్ని నిరూపించుకొనేంత వరకు నా కుమారుడిని నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉంచాలని ఓ ఎమ్మెల్యేగా, బాధ్యతగల తండ్రిగా నిర్ణయించాను. పోలీసులు, న్యాయ వ్యవస్థకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తా. నేనే రాఘవేంద్రరావును పోలీసులకు అప్పగిస్తాను. గతంలో కాంగ్రెస్లో ఉన్నా, ఇప్పుడు తెరాసలో కొనసాగుతున్నా నా తనయుడు ఓ సామాన్య కార్యకర్తగానే ఉన్నాడు. అతడిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి నేనెప్పుడూ ఏ వ్యవస్థనూ ప్రభావితం చేయలేదు’ అని నియోజకవర్గ ప్రజలకు ఓ బహిరంగ లేఖలో తెలిపారు.
పోలీసుల అదుపులో రాఘవ?
నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనకు ప్రధాన కారకుడిగా కేసు నమోదైన వనమా రాఘవేంద్రరావు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్ సరిహద్దుల్లో అతన్ని అదుపులోకి తీసుకుని కొత్తగూడెం తరలించినట్లు విశ్వసనీయ సమాచారం. తండ్రి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కొంతమంది తెరాస నేతలు స్వయంగా పోలీసులకు అతడిని అప్పగించినట్లు తెలిసింది. గురువారం రాత్రి కొత్తగూడెం తీసుకొచ్చి శుక్రవారం ఉదయాన్నే న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నట్లు సమాచారం.
ఇంకా దొరకలేదన్న ఏఎస్పీ: రాఘవేంద్రరావు ఇంకా తమకు దొరకలేదని గురువారం రాత్రి ఏఎస్పీ రోహిత్రాజ్ విలేకరులకు చెప్పారు. అతని కోసం తెలుగు రాష్ట్రాల్లో గాలిస్తున్నట్లు తెలిపారు. ఎనిమిది ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామన్నారు. అతడిపై అభియోగాలకు ఆధారాలు లభిస్తే రౌడీషీట్ నమోదు చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల స్వాధీనం
వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
రికార్డు స్థాయిలో వేసవి రైళ్లు
వేసవి కాలంలో పెరిగే రాకపోకలకు అనుగుణంగా ఈసారి రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. -
బతుకమ్మ చీరల బకాయిలు రూ.50 కోట్లు విడుదల
బతుకమ్మ చీరల తయారీకి సంబంధించి నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం అధికారులను ఆదేశించారు. -
నటుడు రఘుబాబు అరెస్టు.. బెయిలు
నార్కట్పల్లి- అద్దంకి రహదారిపై ఈ నెల 17న నల్గొండ పట్టణ సమీపంలో సినీ నటుడు ఎర్ర రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడు జనార్ధన్రావు మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లపై వివరణ ఇవ్వండి
ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లు ఉండాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
గురుకులంలో అల్పాహారం వికటించి 25 మందికి అస్వస్థత
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో అల్పాహారం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎస్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి దంపతులు శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో మరో ఎస్సై సస్పెన్షన్
పోలీసు శాఖలో సస్పెన్షన్ల పరంపర కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం ఆరుగురు పోలీస్ అధికారులను, సిబ్బందిని మల్టీజోన్-1 ఐజీ సస్పెండ్ చేయగా.. తాజాగా మరో ఎస్సైపై వేటు పడింది. -
దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాలు
వ్యవసాయరంగ అభివృద్ధితోపాటు రైతులకు విస్తృతమైన సేవలందించేందుకు దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకే)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐకార్) డైరెక్టర్ జనరల్ హిమాన్ష్ పాఠక్ తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
సంక్షిప్త వార్తలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 కోట్ల రుణం సేకరణ నిమిత్తం బాండ్లను వేలం వేయనున్నట్లు రిజర్వుబ్యాంకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 23న వీటిని వేలం వేయనున్నట్లు వివరించింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)