Electricity Theft: కరెంటు కొట్టేస్తున్నారు
హైదరాబాద్ పాతనగరంలోని ఛత్రినాక ప్రాంతంలో ఒక ఇంటి మీటరుకు బైపాస్ పద్ధతిలో మరో వైరు కలిపి నేరుగా కరెంటు తీసుకుంటున్న దర్జా వ్యవహారమిది. ఇలా తీసుకునే కరెంటు.. మీటరులో నమోదు కాదు.. బిల్లు రాదని విద్యుత్
యథేచ్ఛగా చౌర్యం
జాబితాలో నేతలు, ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు
భూగర్భ కేబుళ్లు.. మీటరుకు బైపాస్ కనెక్షన్లు
గత ఏడాది పట్టుబడినవి 81,000
ఈనాడు - హైదరాబాద్
హైదరాబాద్ పాతనగరంలోని ఛత్రినాక ప్రాంతంలో ఒక ఇంటి మీటరుకు బైపాస్ పద్ధతిలో మరో వైరు కలిపి నేరుగా కరెంటు తీసుకుంటున్న దర్జా వ్యవహారమిది. ఇలా తీసుకునే కరెంటు.. మీటరులో నమోదు కాదు.. బిల్లు రాదని విద్యుత్ సిబ్బంది తనిఖీల్లో గుర్తించారు.
రాష్ట్రంలో భారీగా విద్యుత్ చౌర్యం జరుగుతోంది. ఇదంతా ఏదో పూట గడవని పేదలు చేస్తున్నారనుకుంటే పొరపాటే. సమాజంలో గుర్తింపు గల పదవుల్లో ఉన్నవారు, ఉద్యోగాలు చేస్తున్నవారు, పరిశ్రమలు నడుపుతున్నవారు, రాజకీయ నేతలమంటూ తిరిగేవారూ కొందరు కరెంటు కాజేస్తున్నారు. దొంగ కనెక్షన్లతో కరెంటు కొట్టేస్తున్న వారిని వేలమందిని పట్టుకుంటున్నా చౌర్యం ఆగడం లేదు. వీరికి జరిమానాలు వేస్తున్నా చౌర్యం వల్ల జరిగిన నష్టం పూడటం లేదు. గత ఏడాదికాలంలో రెండు డిస్కంల పరిధిలో ఏకంగా 81 వేల దొంగ కనెక్షన్లను విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. దాదాపు రూ. 48 కోట్ల విలువైన కరెంటును అక్రమంగా వాడుకున్నట్లు తేల్చారు. రాష్ట్రంలో రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా గల దక్షిణ తెలంగాణ డిస్కం పరిధిలో 2020 డిసెంబరు నుంచి 2021 నవంబరు వరకూ విజిలెన్స్ సిబ్బంది జరిపిన దాడుల్లో 59,522 దొంగ కనెక్షన్లను పట్టుకున్నారు. వీటి ద్వారా ఏడాదిలో చౌర్యం చేసిన కరెంటు విలువ రూ. 42.24 కోట్లుగా లెక్కతేల్చారు. ఇలాగే వరంగల్ కేంద్రంగా గల ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలో గత ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకూ 17,099 దొంగ కనెక్షన్లను పట్టుకున్నారు. ఈ కరెంటు దొంగలకు రూ. 5.46 కోట్ల జరిమానా వేశారు. 2020-21లో ఇదే ఉత్తర డిస్కం పరిధిలో మొత్తం 30,978 దొంగ కనెక్షన్లు పట్టుకుని రూ. 6.68 కోట్ల జరిమానా విధించారు.
హైదరాబాద్ నడిబొడ్డున..
పల్లెల్లో కంటే పట్టణాలు, నగరాల్లోనే ఇళ్లు, పరిశ్రమలకు రూ.లక్షల విలువైన కరెంటు అక్రమంగా వాడేసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలోని ఓ ఇంటిని తనిఖీ చేస్తే అక్కడ జరుగుతున్న విద్యుత్ చౌర్యం చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. ఆ ఇంటికి ఉన్న మీటరు సీలును మార్చేసి లోపల బైపాస్ పద్ధతిలో రీడింగు నమోదు కాకుండా మరో తీగ నుంచి కరెంటు తీసుకుని వాడుకుంటున్నారు.
భూగర్భ కేబుల్ వ్యవస్థ!
సాధారణంగా కరెంటు కనెక్షన్ అంటే స్తంభం నుంచి తీగను మన ఇంటి దగ్గరకు లాగి మీటరుకు కలుపుతారనే అందరికీ తెలుసు. కానీ కరెంటు దొంగల రూటే వేరు. హైదరాబాద్ శివారు గంధంగూడలోని ఓ చిన్న పరిశ్రమకు ప్రతి నెలా తక్కువ బిల్లే వస్తుండటంతో అధికారులకు అనుమానమొచ్చి లోతుగా పరిశీలిస్తే అసలు బండారం బయటపడింది. మీటరు దగ్గర నుంచి మరో తీగను భూమి లోపలి నుంచి లాగి దర్జాగా కరెంటు వాడుకుంటున్నట్లు వెల్లడైంది. అందుకే సదరు పరిశ్రమకు బిల్లు చాలా తక్కువగా వస్తున్నట్లు తేలింది. ఆ పరిశ్రమ యజమానికి రూ. 6.10 లక్షల జరిమానా విధించారు.
ఫ్యూజులు తీసేసినా కరెంటుందే!
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చిన్నస్థాయి పదవిలో ఉన్న ఓ నాయకుడు ఇంటికి దొంగ కనెక్షన్ ద్వారా కరెంటు వాడుకుంటున్నారు. ఆయనను ఎలాగైనా పట్టుకోవాలని విజిలెన్స్ సిబ్బంది తనిఖీకి వెళ్లే ముందు ఇంటి ఆవరణలోని మెయిన్ బోర్డు దగ్గరున్న ఫ్యూజులు తీసేసి లోపలకు వెళ్లారు. సదరు నేత అధికారులకు మర్యాద చేయాలని ఏసీ, లైట్లు వేసి కూర్చోమన్నాడు. వారు తమ చేతిలోని ఫ్యూజులు చూపించి.. ఇవి తీసేసినా కరెంటు ఎలా వస్తోందని గద్దించి అడిగితే తన కొడుకు, స్థానిక విద్యుత్ లైన్మెన్ సహకారంతో దొంగ కనెక్షన్ తీసుకున్నట్లు అంగీకరించాడు.
రాష్ట్రంలో విద్యుత్ నష్టాల తీరు (కోట్ల యూనిట్లలో..)
* రాష్ట్రంలో గతేడాది (2020-21)లో రెండు డిస్కంలు కలిపి మొత్తం 6,310.30 కోట్ల యూనిట్ల కరెంటును సరఫరా చేయగా 5,704.50 కోట్ల యూనిట్లకే బిల్లు వసూలు వసూలైనట్లు డిస్కంలు ఈఆర్సీకి ఇచ్చిన నివేదికలో తెలిపాయి. మిగిలిన 605.40 కోట్ల యూనిట్లు పంపిణీ, సరఫరాలో నష్టాలు (లైన్ లాసెస్), విద్యుత్ చౌర్యం వల్ల నష్టపోయినట్లు అంచనా.
* ఒక్కో యూనిట్ కరెంటు సగటు సరఫరా వ్యయం రూ. 7.14 అవుతోంది. ఈ లెక్కన మొత్తం నష్టపోయిన 605.40 కోట్ల యూనిట్లపై రూ. 4,322.55 కోట్ల ఆదాయాన్ని డిస్కంలు కోల్పోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా