ఒక్కోచోట.. ఒక్కో రకం!
కొవిడ్ సునామీలా విరుచుకుపడుతోంది. రెండో ఉద్ధృతిలో పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. పది శాతంపైన పాజిటివ్ రేటుతో పలు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. కొద్దిగా వెనకా ముందు అయినా
ఎక్కువగా యూ·కే, డబుల్ మ్యూటెంట్, ఎన్440కె రకాలు..
కేసుల ఉద్ధృతికి ఇవి మాత్రమే కారణం కాదంటున్న శాస్త్రవేత్తలు
సగానికిపైగా కేసుల్లో పాత రకం వైరస్లే..
వ్యాప్తి గొలుసు తెగితేనే కట్టడి
కఠిన చర్యలు ఉండాలని సూచన
ఈనాడు, హైదరాబాద్: కొవిడ్ సునామీలా విరుచుకుపడుతోంది. రెండో ఉద్ధృతిలో పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. పది శాతంపైన పాజిటివ్ రేటుతో పలు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. కొద్దిగా వెనకా ముందు అయినా మహమ్మారి అన్ని ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తోంది. కేసులు ఎక్కువగా ఉన్న ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకం వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని వైరస్ జన్యుక్రమ ఆవిష్కరణలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) శాస్త్రవేత్తలు అంటున్నారు. రకం ఏదైనా వ్యాప్తి గొలుసును తెంపాలంటే జాగ్రత్తలు తీసుకోవడం ప్రధానమని చెబుతున్నారు.
దేశంలో ప్రాంతాలవారీగా పలురకాల కొవిడ్ వైరస్ రకాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఉత్తరాదిలో ఒక రకం..దక్షిణాదిలో మరో రకం వైరస్ ఎక్కువగా కనిపిస్తోంది. పశ్చిమ ప్రాంతంలో ఇంకో రకం వ్యాప్తిలో ఉంది. ప్రస్తుతం కేసులు అధికంగా ఉన్న దిల్లీ, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, హరియాణాల్లో యూకే రకం వైరస్ ఎక్కువగా ఉంది. బి.1.617 వైరస్ కూడా కనిపిస్తోంది. కేసులు అత్యధికంగా ఉన్న మహారాష్ట్రలో డబుల్ మ్యూటెంట్ రకం విస్తృతి కనిపిస్తోంది. పదిశాతం వరకు ట్రిపుల్ మ్యూటెంట్ కూడా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వాస్తవానికి డబుల్ మ్యూటెంట్లోనే ఇదో భాగం. బి.1.617-1,2,3, రకాలు కూడా వ్యాప్తిలో ఉన్నాయి. పశ్చిమబెంగాల్లో 20 శాతం కేసుల్లో బి.1.618 వైరస్ కనిపిస్తోంది. దక్షిణాదిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకలో ఎన్440కె రకం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ డబుల్ మ్యూటెంట్ చాలా తక్కువగా ఉంది. యూకే రకం, డబుల్ మ్యూటెంట్, ఎన్440కె రకం వైరస్లు ఎక్కువ వ్యాప్తికి కారణమవుతున్నాయా? అంటే.. కేసులు పెరగడానికి ఇవి ఒక కారణమే తప్ప పూర్తిగా కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
పాత రకాలు.. కొత్త సమస్యలు
ఆర్ఎన్ఏ వైరస్ ఏదైనా వేగంగా ఉత్పరివర్తనం చెందుతుంది. ఈ కారణంగానే దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో కొత్త కరోనా వైరస్ రకాలు ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నాయి. కేసులు పెరిగేకొద్దీ కొత్త ఉత్పరివర్తనాలతో వైరస్ రకాలు పెరగడానికి అవకాశం ఉంది. ‘పలు ప్రాంతాల్లో యూకే రకం, డబుల్ మ్యూటెంట్, ఎన్440కె రకం వైరస్లు బలంగా వ్యాప్తి చెందుతున్నాయి. సగానికంటే ఎక్కువ కేసుల్లో పాత సాధారణ వైరస్ రకాలే ఉన్నాయి. అయినా ప్రతిచోటా కేసులు పెరుగుతున్నాయి. కొత్త మ్యూటెంట్ల వ్యాప్తి ఒక్కటే కేసుల పెరుగుదలకు కారణం కాదు. కొత్తవి వచ్చినప్పుడు సహజంగానే కొత్త సమస్యలు వస్తాయి. వ్యాప్తి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రధానమైన సమస్య. ఏరకం వైరస్ అనేది ప్రధానం కాదు.. వ్యాప్తి గొలుసు తెగితేనే కేసులు తగ్గుతాయి. మరోవైపు పాజిటివ్ కేసుల నమూనాల నుంచి వైరస్ జన్యుక్రమాన్ని ఆవిష్కరించడం ద్వారా కొత్త వైరస్ రకాల ఉనికిని గుర్తించడంతో పాటూ రోగ లక్షణాలు, మరణాల రేటు, వాటిపై ఏ మేరకు టీకా పనిచేస్తుంది అనే పరిశోధనలు కొనసాగించాలి. సీసీఎంబీ ఇదే చేస్తోంది. అదృష్టవశాత్తు టీకాలు కొత్తరకాల వైరస్లపైనే సమర్ధంగా పనిచేస్తున్నాయి. కేసుల పెరుగుదల చూస్తే ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నాం. భవిష్యత్తు దృష్ట్యా వ్యాప్తి కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలి’ అని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్ర అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?