TRS MLAs Bribery case: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. నిందితులు తరచూ దిల్లీ ఎందుకు వెళ్లారు?
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు దర్యాప్తులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెరాసకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారనే అభియోగంపై పోలీసులు అరెస్టు చేసిన రామచంద్రభారతి...
నందకుమార్ వరుస పర్యటనలపై సిట్ ఆరా
నిందితుల పోలీసు కస్టడీ ముగియడంతో జైలుకు తరలింపు
ఈనాడు, హైదరాబాద్ - న్యూస్టుడే, రాజేంద్రనగర్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు దర్యాప్తులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెరాసకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారనే అభియోగంపై పోలీసులు అరెస్టు చేసిన రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ల రెండోరోజు శుక్రవారం జరిపిన విచారణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సభ్యులు కీలక సమాచారం సేకరించారు. ముఖ్యంగా హైదరాబాద్ వ్యాపారి నందకుమార్పై అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. ఆయన కొన్ని రోజుల కిందట పలుమార్లు దిల్లీకి వెళ్లొచ్చిన వ్యవహారంపై కూపీ లాగారు. తరచూ దిల్లీ వెళ్లాల్సిన అవసరమేంటని, అక్కడ ఎవరెవరిని కలిశారని ఆరా తీశారు. మరో వ్యక్తితో ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన విషయంపై ప్రశ్నించారు. అతడి ఫొటో చూపించి.. భారీమొత్తంలో డబ్బు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని అడిగారు. అధికారుల ప్రశ్నలకు నందకుమార్ పొంతన లేని సమాధానాలివ్వగా.. అవి సరైనవి కావని తమ వద్ద ఉన్న పక్కా ఆధారాలను బట్టి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రామచంద్రభారతి, సింహయాజిలను కూడా ప్రశ్నించి వివరాలు రాబట్టారు. రామచంద్రభారతి సెల్ఫోన్లోని చాటింగ్ల సారాంశంతోపాటు కాంటాక్టు జాబితాలోని వ్యక్తులతో అతడి సంబంధాల గురించి అడిగారు.
తొలుత ఫోరెన్సిక్ ల్యాబ్కు.. అనంతరం పోలీస్స్టేషన్కు..
నిందితులను శుక్రవారం జైలు నుంచి నేరుగా నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి తరలించారు. ఆడియోలో మాట్లాడిన వివరాలను సరిపోల్చడానికి ల్యాబ్లో స్వరపరీక్షలు నిర్వహించారు. పోలీసులు స్టింగ్ ఆపరేషన్ ద్వారా సేకరించిన ఆడియో, వీడియో రికార్డుల్లోని మాటలను.. నిందితుల స్వరంతో పోల్చేందుకు ఈ పరీక్షలు చేశారు. అనంతరం నిందితులను వేరువేరుగా రాజేంద్రనగర్ ఠాణాకు తరలించారు. సిట్ సభ్యులైన డీసీపీలు కల్మేశ్వర్, జగదీశ్వర్రెడ్డి, ఏసీపీ గంగాధర్, ఇన్స్పెక్టర్ లక్ష్మీరెడ్డి నిందితులను అక్కడికి తీసుకొచ్చారు. సిట్ సభ్యులతో పాటు సైబరాబాద్ ఎస్వోటీ అదనపు డీసీపీ నారాయణ, అదనపు డీసీపీ (క్రైం) నర్సింహ్మరెడ్డి ఠాణాకు వచ్చారు. ముగ్గురు నిందితులను వేర్వేరు గదుల్లో విచారించారు. మొదటిరోజు చాలా ప్రశ్నలకు తమకు తెలియదన్నట్లుగా ముక్తసరిగా స్పందించిన నిందితులు.. రెండోరోజు కొన్నింటికి సమాధానాలివ్వక తప్పలేదు.
ఓ వైపు సమీక్ష.. మరోవైపు విచారణ
మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అధిపతి సీవీ ఆనంద్ రాజేంద్రనగర్ ఠాణాకు వచ్చారు. సిట్ సభ్యులతో సమీక్షించి.. విచారణ తీరును తెలుసుకున్నారు. కోర్టు ఇచ్చిన గడువు రెండు గంటల్లో ముగుస్తుందనగా.. ఆయన కొన్ని ప్రత్యేక ప్రశ్నలను సిద్ధం చేసుకుని నిందితులను వేర్వేరుగా విచారించినట్లు తెలిసింది. సాయంత్రం 5.30 గంటల సమయంలో వారిని భారీ బందోబస్తు మధ్య మళ్లీ జైలుకు పంపించారు. నిందితులు వెళ్లిన తరువాత సీవీ ఆనంద్ ఏసీపీ కార్యాలయంలోనే మరో గంటపాటు ఉన్నారు. అనంతరం నగర కమిషనరేట్కు వెళ్లి అక్కడా సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది. నిందితుల విచారణ సందర్భంగా పోలీసులు రాజేంద్రనగర్ ఠాణా ప్రహరీగేటును ఏకంగా పరదాలతో కప్పేశారు.
25 వరకు రిమాండ్
బెయిల్ పిటిషన్పై తీర్పు సోమవారానికి వాయిదా
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో నిందితుల రిమాండ్ను నాంపల్లిలోని ఏసీబీ న్యాయస్థానం ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించింది. శుక్రవారంతో రిమాండ్ ముగియడంతో పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరచగా మరో 14 రోజులపాటు రిమాండ్ విధించింది. కోర్టుకు తెలిపిన సమయానికంటే 50 నిమిషాల ఆలస్యంగా నిందితులను హాజరుపరచడంపై డిఫెన్స్ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. వాదనల అనంతరం బెయిల్ పిటిషన్పై తీర్పును కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసును నమోదు చేసే అధికారం ఏసీబీకి తప్ప స్థానిక పోలీసులకు లేదని నిందితుల న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17డి ప్రకారం పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలపగా.. నిందితుల న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సెక్షన్ ప్రకారం మెట్రోపాలిటన్ నగరంలో ఏసీపీ స్థాయి అధికారికి మాత్రమే కేసు నమోదు చేసే అధికారం ఉందని, ఘటన జరిగిన మొయినాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలోకి రాదన్నారు. నిందితులు దిల్లీ నుంచి హైదరాబాద్కు రావాల్సిన అవసరమేంటని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది ప్రశ్నించగా.. పూజలు నిర్వహించేందుకు వచ్చారని, ఈ కేసు.. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో జరిగిన కుట్ర అంటూ నిందితుల తరఫు న్యాయవాది బదులిచ్చారు. విచారణ సందర్భంగా దర్యాప్తు అధికారి ఒకరు తనను తీవ్ర అసభ్యపదజాలంతో దూషించినట్లు నందకుమార్ ఏసీబీ ప్రత్యేక కేసుల న్యాయస్థానంలో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం