Crime News: ఆయువు తీసిన అప్పుల భారం
దైవ దర్శనానికి విజయవాడ వచ్చిన ఓ కుటుంబం శనివారం తెల్లవారుజామున బలవన్మరణానికి పాల్పడింది. అప్పుల బాధ తట్టుకోలేక, పరువు పోయిందనే కుంగుబాటుతో మూకుమ్మడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇద్దరు కుమారులు సహా దంపతుల మృతి
దుర్గమ్మ దర్శనం చేసుకుని.. ఆపై ఆత్మహత్య
విజయవాడలో నిజామాబాద్ వాసుల విషాదాంతం
సురేష్, శ్రీలతలతో వారి కుమారులు అఖిల్, ఆశిష్
ఈనాడు - అమరావతి, నిజామాబాద్: దైవ దర్శనానికి విజయవాడ వచ్చిన ఓ కుటుంబం శనివారం తెల్లవారుజామున బలవన్మరణానికి పాల్పడింది. అప్పుల బాధ తట్టుకోలేక, పరువు పోయిందనే కుంగుబాటుతో మూకుమ్మడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. తెలంగాణలోని నిజామాబాద్కు చెందిన పప్పుల సురేష్ (58), ఆయన భార్య శ్రీలత (54), కుమారులు అఖిల్ (26), ఆశిష్ (24) విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున ఇద్దరి మృతదేహాలు సత్రంలో, మరో ఇద్దరివి ప్రకాశం బ్యారేజీలో లభించాయి. సురేష్ కుటుంబం గురువారం సాయంత్రం విజయవాడ చేరుకుంది. వన్టౌన్ శివాలయం సమీపంలో వాసవీ కన్యకా పరమేశ్వరి సత్రంలో అఖిల్ పేరుతో గది అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం దర్శనానికి వెళ్లి వచ్చారు. శనివారం ఉదయం వారి బంధువుల నుంచి సత్రం సిబ్బందికి ఫోన్ రావడంతో గదిలో చూడగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. తల్లి శ్రీలత, చిన్న కుమారుడు ఆశిష్ విగతజీవులుగా కనిపించారు. తర్వాత ప్రకాశం బ్యారేజీ వద్ద తండ్రి సురేష్, పెద్ద కుమారుడు అఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఏం జరిగింది..?
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తాము అప్పుల బాధ భరించలేక చనిపోతున్నామని ఒక వాయిస్ మెసేజ్ను జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఉండే తన సోదరుడికి శ్రీలత పంపారు. ఇది అర్ధరాత్రి 2.30 సమయంలో వెళ్లింది. వారి గదిలో ఇన్సులిన్ సీసాలు, ఇంజెక్షన్లు లభించాయి. తండ్రి సురేష్, పెద్ద కుమారుడు సత్రం నుంచి బయటకు వచ్చి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సీసీటీవీ కెమెరాల ద్వారా తెలుస్తోంది. శ్రీలత పంపిన వాయిస్ మెసేజ్ను ఆమె సోదరుడు తెల్లవారాక చూశారు. వెంటనే సత్రం నిర్వాహకులను సంప్రదించగా వారికి గదిలో ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఫ్లాట్ జప్తు చేశారనేనా?
నిజామాబాద్ నుంచి పప్పుల సురేష్ కుటుంబం ఈ నెల మూడో తేదీనే బయల్దేరినా.. ఆరో తేదీ సాయంత్రం విజయవాడకు చేరుకుంది. ఏడో తేదీన సురేష్ కుటుంబానికి చెందిన ఫ్లాట్ను (నిజామాబాద్ గంగాస్థాన్ ఫేజ్-2లో ఉంది) ఫైనాన్స్ సంస్థ జప్తు చేసింది. పీసీహెచ్ఎఫ్ఎల్ సంస్థ దీన్ని జప్తు చేసినట్లు బోర్డు పెట్టారు. ఈ విషయం తెలిసి.. పరుపు పోయినట్లు భావించి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు ఎక్కడెక్కడ తిరిగారనేది విచారణలో తెలియాల్సి ఉంది. ఆ కుటుంబానికి ఎంత మేర అప్పులు ఉన్నాయో బంధువులకు తెలియదు. నిజామాబాద్కు చెందిన గణేష్ అనే వ్యక్తికి ఇవ్వాలని వాయిస్ మెసేజ్లో ఉన్నట్లు తెలిసింది. సురేష్ పెద్ద కుమారుడు బీటెక్ చదివి కొంతకాలం పెట్రోలు బంకు నిర్వహించారు. రెండో కుమారుడు ఎంఫార్మసీ చేసి, తండ్రి నిర్వహించే మందుల దుకాణంలో సాయపడుతున్నారు. సత్రం గదిలో లభించిన సెల్ఫోన్లు, సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పీసీహెచ్ఎఫ్ఎల్ స్వాధీనం చేసుకున్న ఫ్లాట్
ఒత్తిడి నేపథ్యంలోనే..
పెద్ద వ్యాపారాలు చేసినట్లు ఆధారాలు లేకున్నా.. వీరికి అప్పులిచ్చామని పలువురు చెబుతున్నారు. ఇటీవల సురేష్ ఇంటికి, అఖిల్ పనిచేస్తున్న చోటకు అప్పులిచ్చిన వారొచ్చి గట్టిగా నిలదీసినట్లు తెలుస్తోంది. సురేష్ పది రోజుల కిందట అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినప్పుడూ అప్పులవారు కుటుంబ సభ్యులపై ఒత్తిడి చేసినట్లు సమాచారం. పెద్ద కుమారుడు అఖిల్ తమను డబ్బులు అడగటం, అదే సందర్భంలో తల్లితో ఫోన్లో రోదిస్తూ మాట్లాడటం చూశామని స్నేహితులు చెప్పారు. వీరుంటున్న ఇంటిపై ప్రైవేటు సంస్థ వద్ద రుణం తీసుకుని.. నెల వాయిదాలు కొంతకాలంగా కట్టడం లేదు. ఆ సంస్థ ఉద్యోగులు శుక్రవారం ఆ ఫ్లాటును స్వాధీనం చేసుకున్నారు. అఖిల్ పెట్రోల్ బంకును లీజుకు తీసుకున్నట్లు చెబుతున్నా బంకు యజమాని మాత్రం అతడు రూ.14 వేల జీతానికి తనవద్ద పని చేసినట్లు చెబుతున్నారు. సురేష్ది నిజామాబాద్ జిల్లా బోధన్ కాగా.. ఆయన భార్య శ్రీలతది జగిత్యాల జిల్లా మెట్పల్లి. వీరు నిజామాబాద్ గంగస్థాన్ ఫేజ్-2లో తొమ్మిదేళ్లుగా ఉంటున్నారు. సురేష్ ఇటీవలే ఓ వ్యాపారిని కలిశారు. డబ్బు స్వల్పకాలంలో రెట్టింపయ్యే ఉపాయం తన వద్ద ఉందని.. రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టాలని అతడు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే.. సురేష్ అత్యాశతో ఏదైనా సంస్థలో పెట్టి నష్టపోవడమో, లేదా మోసపోవడమో జరిగి ఉంటుందనే చర్చ నడుస్తోంది.
ఎవరా నలుగురు?
శ్రీలత తన సోదరుడికి పంపిన వాయిస్ మెసేజ్లో నలుగురి పేర్లున్నట్లు సమాచారం. వారు అప్పు తీర్చాలని తమపై ఒత్తిడి చేశారని అందులో చెప్పినట్లు తెలుస్తోంది. విజయవాడ పోలీసులు మృతుల సెల్ఫోన్ల నుంచి ఈ వివరాలను సేకరించారు. వీటిని నిజామాబాద్ పోలీసులకు పంపడంతో.. ఆ నలుగురు ఎవరన్న విషయాన్ని వారు ఆరా తీస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..