Politics: దేశానికి భాజపా ప్రమాదకరం
దేశానికి భారతీయ జనతా పార్టీ ప్రమాద]కరంగా మారిందని, ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడం సహా అనేక ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్, వామపక్ష పార్టీల జాతీయ
భావసారూప్యత కలిగిన పార్టీలతో త్వరలో సమావేశం
కేసీఆర్తో భేటీలో వామపక్ష నాయకులు
జాతీయ రాజకీయాలు, కేంద్రం వైఖరిపై చర్చ
శనివారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో జరిగిన భేటీలో సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ సీఎం విజయన్, మాణిక్సర్కార్, రామచంద్రన్ పిళ్లై, రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్ తదితరులు
ఈనాడు హైదరాబాద్: దేశానికి భారతీయ జనతా పార్టీ ప్రమాద]కరంగా మారిందని, ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడం సహా అనేక ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్, వామపక్ష పార్టీల జాతీయ నాయకులు అభిప్రాయపడినట్లు తెలిసింది. కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన కేరళ ముఖ్యమంత్రి విజయన్ సహా సీపీఎం జాతీయ నాయకులు, యువజన సమాఖ్య జాతీయ సభల్లో పాల్గొనేందుకు వచ్చిన సీపీఐ జాతీయ నాయకులు వేర్వేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్తో ప్రగతిభవన్లో శనివారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. భాజపా విధానాలకు వ్యతిరేకంగా భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చర్చల్లో ప్రధానంగా వ్యక్తమైనట్లు సమాచారం. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్సర్కార్, పొలిట్బ్యూరో సభ్యులు రామచంద్రన్ పిళ్లై, బాలకృష్ణన్, ఎం.ఎ.బేబి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, పార్లమెంటరీ పార్టీ నాయకుడు బినయ్విశ్వం, కేరళ రెవెన్యూ మంత్రి రాజన్, తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, నాయకులు పల్లా వెంకట్రెడ్డి, కూనంనేని సాంబశివరావు ఇందులో ఉన్నారు. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ప్రశాంత్రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, తెరాస ప్రధాన కార్యదర్శి శ్రవణ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. మొదట సీపీఎం నాయకులు, తర్వాత సీపీఐ నాయకులు కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, దేశంలో పరిస్థితులు, అయిదు రాష్ట్రాల్లో రానున్న ఎన్నికలు తదితర అంశాలపై చర్చించుకొన్నట్లు తెలిసింది. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, భాజపాకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ వేదిక అవసరం తదితర విషయాలూ చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, వివిధ సంస్థల వినియోగం.. ఇలా అనేక అంశాలు కేరళ, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కేంద్రం సహకరించాల్సిందిపోయి అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటమూ చర్చకు వచ్చినట్లు తెలిసింది. భాజపాను గద్దె దించాల్సిన అవసరం ఉందని, భవిష్యత్ కార్యాచరణ కోసం భావసారూప్యత కలిగిన పార్టీలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వామపక్ష పార్టీల నాయకులు చెప్పినట్లు తెలిసింది. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, రైతు వ్యతిరేక పాలన, విభజన రాజకీయాలకు పాల్పడుతుండటం.. ఇలా పలు అంశాలు భేటీలో చర్చకు వచ్చాయని అందులో పాల్గొన్న ఓ నాయకుడు తెలిపారు. పంజాబ్ పర్యటనకు వెళ్లిన మోదీకి అక్కడ రైతుల నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో వెనక్కు వచ్చారని, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల్లోనూ భాజపా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని వామపక్ష నాయకులు పేర్కొన్నట్లు తెలిసింది. కాంగ్రెస్ రోజురోజుకు బలహీనపడుతుండటం.. ఆ పార్టీ విధానాల గురించీ చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి విజయన్ను, ఇతర నాయకులను ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువాలతో సత్కరించారు. సమావేశం అనంతరం విజయన్ చేసిన ట్వీట్లో కేసీఆర్ ఆత్మీయ ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపారు. చర్చలు ఎంతో ఉపయోగకరంగా జరిగాయన్నారు.
రాజాకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న కేసీఆర్, పక్కన వినోద్కుమార్, మహమూద్అలీ, రాజన్, బినయ్ విశ్వం, చాడ వెంకట్రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి, కూనంనేని సాంబశివరావు, పల్లా రాజేశ్వర్రెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి