CM KCR: ఇంత జాప్యమా!
సీతారామ, సమ్మక్కసాగర్, ముక్తేశ్వర (చిన్నకాళేశ్వరం) ఎత్తిపోతలు, చెనాక కొరాట బ్యారేజీ, చౌటుపల్లి హన్మంత్రెడ్డి ఎత్తిపోతలు, మోడికుంట వాగు ప్రాజెక్టుల డీపీఆర్లు అందజేసి 5 నెలలు గడిచినా కేంద్ర జలసంఘం నుంచి ఇంకా అనుమతులు రాకపోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. వారు అడిగిన అన్ని వివరాలను, అదనపు సమాచారాన్ని ఇచ్చి వేగంగా అనుమతులు పొందాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పురోగతిపై ఆదివారం ఆయన ఉన్నతస్థాయి...
జలసంఘం అనుమతుల్లో ఆలస్యంపై సీఎం అసంతృప్తి
కొత్త ప్రాజెక్టులకు వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశం
ఈనాడు, హైదరాబాద్: సీతారామ, సమ్మక్కసాగర్, ముక్తేశ్వర (చిన్నకాళేశ్వరం) ఎత్తిపోతలు, చెనాక కొరాట బ్యారేజీ, చౌటుపల్లి హన్మంత్రెడ్డి ఎత్తిపోతలు, మోడికుంట వాగు ప్రాజెక్టుల డీపీఆర్లు అందజేసి 5 నెలలు గడిచినా కేంద్ర జలసంఘం నుంచి ఇంకా అనుమతులు రాకపోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. వారు అడిగిన అన్ని వివరాలను, అదనపు సమాచారాన్ని ఇచ్చి వేగంగా అనుమతులు పొందాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పురోగతిపై ఆదివారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాణహిత ప్రాజెక్టు డీపీఆర్ను త్వరితగతిన సిద్ధం చేసి కేంద్ర జలసంఘానికి, గోదావరి బోర్డుకు సమర్పించాలన్నారు. బోర్డు అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపి 5 గోదావరి ప్రాజెక్టులను గెజిట్ నోటిఫికేషన్ నుంచి తొలగించే విషయమై కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు. ముఖ్యమైన ప్రాజెక్టులకు వెంటనే టెండర్లు పిలవడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ‘నాగార్జునసాగర్ ఎడమ కాలువపై నిర్మించ తలపెట్టిన లిఫ్టు పథకాలు, గట్టు ఎత్తిపోతల పథకం, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు మిగులు పనులు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిపోయిన రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పనులు, అంబేడ్కర్ ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా నిర్మించే బ్యారేజీ, చెన్నూర్ ఎత్తిపోతల పథకం, కడెం నదిపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులకు టెండర్లు పిలవాలి. వీటిని పూర్తిచేస్తే సాగునీటి రంగంలో ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుంటాం’ అని అన్నారు.
కరోనాపై అప్రమత్తంగా ఉండాలి
కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఎవరూ భయాందోళనలకు గురికావద్దని, ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సంక్రాంతికి గుంపులుగా చేరకుండా ఎవరి ఇళ్లల్లో వారు తగు జాగ్రత్తలతో పండగ జరుపుకోవాలన్నారు. అర్హులైన వారంతా టీకాలు వేయించుకోవాలన్నారు. 15-18 సంవత్సరాల వారికి టీకాల కార్యక్రమం కొనసాగుతోందని, తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లలకు టీకా వేయించాలన్నారు. సోమవారం నుంచి 60 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకు, కరోనా యోధులకు (ఫ్రంట్లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ వర్కర్లు) మూడో డోసును ప్రారంభించనున్నామని తెలిపారు. కరోనాపై ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్కుమార్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ తదితరులు పాల్గొన్నారు. ‘ఆసుపత్రుల్లో ఔషధాలు, పడకలు, ఆక్సిజన్, సేవలను అందుబాటులో ఉంచాలి. ఎక్కడా ఎలాంటి లోపం ఉండరాదు’ అని సీఎం సూచించారు.
సచివాలయానికి పటిష్ఠ భద్రత
సచివాలయ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ల్యాండ్ స్కేపింగ్, రక్షణ వ్యవస్థ, అనుబంధ భవనాల నిర్మాణాలను సమాంతరంగా చేపట్టాలని ఆదేశించారు. ‘గడువులోగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి. పటిష్ఠమైన భద్రత కల్పించాలి. అధునాతన సాంకేతికతతో పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ పనులు వేగంగా పూర్తి చేయాలి’ అని సూచించారు. మంత్రి ప్రశాంత్రెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.