వరి పంటపై భాజపా చలిమంటలు
భాజపా నాయకులారా..! నడిచినన్ని రోజులు మీ డ్రామాలు నడుస్తాయి.. ఒకసారి రైతులు తిరగబడితే వారి ఎడ్లబండ్లు.. ట్రాక్టర్ల కింద మీ పార్టీ నలిగిపోతుంది.
మోదీ ధాన్యం కొంటామంటే మేం వద్దంటామా?
సిరిసిల్ల ధర్నాలో మంత్రి కేటీఆర్
ఈనాడు డిజిటల్ - సిరిసిల్ల
సిరిసిల్లలో జరిగిన మహాధర్నాలో ప్లకార్డు ప్రదర్శిస్తున్న మంత్రి కేటీఆర్
భాజపా నాయకులారా..! నడిచినన్ని రోజులు మీ డ్రామాలు నడుస్తాయి.. ఒకసారి రైతులు తిరగబడితే వారి ఎడ్లబండ్లు.. ట్రాక్టర్ల కింద మీ పార్టీ నలిగిపోతుంది.
‘‘స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా.. ఇంకా దేశం ఆకలి రాజ్యాల జాబితాలో ముందు వరుసలో ఉంది. యూరప్నకు చెందిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ సర్వే సంస్థ అక్టోబరులో విడుదల చేసిన ఆకలి రాజ్యాల జాబితాలో 116 దేశాలు ఉండగా, మన దేశం 102వ స్థానంలో ఉంది. మన పక్కనున్న పాకిస్థాన్ 92, నేపాల్, బంగ్లాదేశ్లు 76వ స్థానాల్లో ఉన్నాయి. కేంద్రానికి కొంచెం కూడా అవమానంగా లేదా? అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ ఉన్నట్లు ప్రపంచంలోని మిగతా దేశాల ముందు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితిలో ఉంచారు’’
-కేటీఆర్
‘వడ్లు కొనబోమని కేంద్రం చెబుతోంటే వరి సాగు చేయాలని రాష్ట్ర భాజపా నాయకులు అంటున్నారు. కేంద్రం ఆదేశాలను మేం పాటిస్తుంటే వారు కావాలని తొండిపెట్టి వరిపంటపై చలిమంటలు పెట్టి ఓట్ల రాజకీయం చేస్తున్నారు’ అని రాష్ట్ర మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెరాస చేపట్టిన రాష్ట్రవ్యాప్త ఆందోళనల్లో భాగంగా సిరిసిల్లలో శుక్రవారం జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.
‘‘రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను సూటిగా అడుగుతున్నాం. మీ మోదీ వరి కొంటామంటుంటే, మేం వేయొద్దు అంటున్నామా? మీ పీయూష్ గోయల్ యాసంగిలో వడ్లు కొంటామంటే మేం వద్దంటున్నామా? కొనబోమని చెబుతున్న మీరే.. వరి పండించాలని అంటున్నారు. బండి సంజయ్ కాదు..తొండి సంజయ్’’ అన్నారు. కేంద్రం తీరుపైనా ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘రైతేడ్చిన రాజ్యం.. ఎద్దేడ్చిన ఎవుసం బాగుపడదు’.. దశాబ్దాలకు పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించిన రైతు వ్యతిరేక విధానాలకు తిలోదకాలిచ్చి... ప్రత్యేక రాష్ట్రంలో ఒక నూతన అధ్యయనానికి తెరతీశామన్నారు. ఏడున్నరేళ్లు వెనక్కి వెళ్లి చూస్తే... విత్తనాలు, ఎరువులను పోలీస్స్టేషన్లలో పెట్టి పంపిణీ చేసిన దుస్థితి ఉండేదన్నారు. వ్యవసాయానికి ఇచ్చే ఆరు గంటల విద్యుత్తు ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. ప్రాజెక్టులు నిర్మించక రాష్ట్రంలో దిక్కుమాలిన పాలన కొనసాగించారని విమర్శించారు. తెలంగాణ ఏర్పడ్డాక వ్యవసాయానికి 24 గంటలూ విద్యుత్తు అందిస్తున్నామన్నారు. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా ముందస్తుగా నిల్వలు సమకూర్చుతున్నట్లు వెల్లడించారు. మన రాష్ట్రాన్ని చూసి 13 రాష్ట్రాల్లో ఇక్కడి పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కాలంతో పోటీపడి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో కొత్తగా లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. వరి దిగుబడుల్లో రాష్ట్రం పంజాబ్ను దాటిపోయిందన్నారు. దేశానికి అన్నపూర్ణగా నిలిచిందన్నారు. ఇది రాష్ట్ర రైతన్నల విజయంగా అభివర్ణించారు. కేంద్రానికి మాత్రం ఇక్కడి పంటలపై సోయిలేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.
మనం జై కిసాన్ అంటే... కేంద్రం నై కిసాన్ అంటోంది
రాష్ట్రాలు పంటలు పండిస్తే వాటిని కొనుగోలు చేసి దేవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేయాలనేది రాజ్యాంగంలోనే పొందుపరిచారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కొనుగోలు చేసే అధికారం లేదని, ఎగుమతుల అంశం కేంద్రం పరిధిలోనే ఉందని చెప్పారు. కేంద్రం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలను ధాన్యం సేకరణలో బాధ్యులను చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. యాసంగిలో అధిక ఉష్ణోగ్రతలతో ముడి బియ్యం ఎక్కువగా నూకగా మారుతాయని, ఉప్పుడు బియ్యం ఇస్తామంటే నిరాకరిస్తోందన్నారు. మనం ‘జై కిసాన్ అంటే కేంద్రం నై కిసాన్’ అంటోందన్నారు. జడ్పీ ఛైర్పర్సన్ న్యాలకొండ అరుణ, నాఫ్స్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్రావు, పలువురు ప్రజాప్రతినిధులు, తెరాస నేతలు పాల్గొన్నారు.
ప్రభుత్వమే వస్త్ర పరిశ్రమను బతికించాలంటే కష్టం: కేటీఆర్
సిరిసిల్ల పట్టణం, న్యూస్టుడే: ప్రభుత్వమే వందశాతం బాధ్యత తీసుకొని వస్త్ర పరిశ్రమను బతికించాలంటే కష్టమని పురపాలకశాఖ మంత్రి కె.టి.రామారావు పేర్కొన్నారు. ప్రపంచంతో పోటీపడేలా ఎప్పటికప్పుడు కార్మికులు, యజమానులు పరిశ్రమను మెరుగుపర్చుకోవాలని సూచించారు. శుక్రవారం సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు.తిర్పూర్, కోయంబత్తూర్లతో పోటీ పడాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి