వందేభారత్ రైళ్లు మనకెప్పుడు?.. రాజధాని, శతాబ్ది రైళ్లలోనూ తెలుగు రాష్ట్రాలకు అన్యాయం
దేశీయంగా అభివృద్ధి చేసిన సెమీ హైస్పీడ్ వందేభారత్ (ట్రైన్ 18) రైళ్లు ఒక్కోటి పట్టాలు ఎక్కుతున్నాయి. ఇప్పటికే నాలుగు రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రాగా, అయిదో రైలుకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది.
ఉత్తరాదికి, ఎన్నికల రాష్ట్రాలకే కేటాయింపు
దేశీయంగా అభివృద్ధి చేసిన సెమీ హైస్పీడ్ వందేభారత్ (ట్రైన్ 18) రైళ్లు ఒక్కోటి పట్టాలు ఎక్కుతున్నాయి. ఇప్పటికే నాలుగు రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రాగా, అయిదో రైలుకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. భారతీయ రైల్వేకి అత్యధిక ఆదాయాన్నిచ్చే జోన్లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వేకి మాత్రం ఈ రైలు కేటాయింపుల్లో ఎదురుచూపులే మిగులుతున్నాయి. జోన్ నుంచి రైల్వేబోర్డుకి అసలు ప్రతిపాదనలు పంపారా? అనే విషయంలోనూ ఇక్కడి అధికారులు పెదవి విప్పడంలేదు. ఉత్తరాది రాష్ట్రాలకు, ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే వందేభారత్ రైళ్లు మంజూరు చేస్తున్నారన్న విమర్శలు ప్రయాణికుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.
డిమాండ్ ఉన్నా..
ద.మ.రైల్వే జోన్ ప్రధాన కేంద్రం సికింద్రాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్కతా, గుహవాటి, చెన్నై, బెంగళూరు, మైసూర్, పుణె, ముంబయి, వారణాసి, దిల్లీ సహా దేశంలోని ప్రధాన నగరాలకు నిత్యం పెద్దసంఖ్యలో ప్రయాణికులు రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. పర్యాటక ప్రదేశాలు వీక్షించేందుకు, ఇతర అవసరాలకు తెలుగు రాష్ట్రాల నుంచి వెళుతుంటారు. ఇతర నగరాల నుంచి వైద్య చికిత్సలు, వ్యాపారం, ఉపాధి కోసం హైదరాబాద్కు వస్తుంటారు. ఇంత ప్రాధాన్యం ఉన్నప్పటికీ సికింద్రాబాద్కు వేగవంత రైళ్లు దక్కట్లేదు. శతాబ్ది, రాజధాని వంటి రైళ్ల కేటాయింపులోనూ జోన్కు అన్యాయం జరిగింది.
హిమాచల్ప్రదేశ్కూ మన కంటే ముందు
దేశంలోని చిన్న రాష్ట్రాల్లో హిమాచల్ప్రదేశ్ ఒకటి. రైల్వేనెట్వర్క్ కేవలం 312 కిలోమీటర్లే. అయినా ఇక్కడి అంబ్ అందౌరా నుంచి దిల్లీకి వందేభారత్ రైలును ఇటీవల ప్రారంభించారు. 3,965 కిలోమీటర్ల నెట్వర్క్ ఉన్న ఆంధ్రప్రదేశ్కు గానీ, 1,828 కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ ఉన్న తెలంగాణకు గానీ వందేభారత్ కేటాయింపుల్లో ప్రాధాన్యం దక్కలేదు.
* గుజరాత్లోని గాంధీనగర్ నుంచి అహ్మదాబాద్ మీదుగా ముంబయికి, అంతకుముందు న్యూదిల్లీ- కాట్రా, న్యూదిల్లీ- వారణాసి మధ్య వందేభారత్ రైళ్లు పట్టాలెక్కాయి. అయిదో వందేభారత్ రైలు నవంబరు 10న పట్టాలెక్కనుంది. మైసూర్ నుంచి బెంగళూరు మీదుగా చెన్నైకి ఇది రాకపోకలు సాగించనుంది.
రైలులో బెంగళూరా?
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రోడ్డు మార్గంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు 9-9.30 గంటల్లో చేరుకుంటున్నారు. రైల్లో వెళితే 12 గంటలు పడుతుంది. దీంతో ప్రయాణికులు అసహనానికి గురవుతున్నారు. బస్సు ప్రయాణానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ రూట్లో వందేభారత్ రైలు నడిపితే ప్రయాణ సమయం 3 గంటలకుపైగా తగ్గుతుంది. ఉదాహరణకు దిల్లీ- చండీగఢ్కు ఇతర ఎక్స్ప్రెస్ రైళ్లలో 4-5 గంటలు పడుతుంటే వందేభారత్ 2.50 గంటల్లోనే చేరుతుంది.
వందేభారత్ ప్రత్యేకతలు ఇవీ
దేశవ్యాప్తంగా దశలవారీగా 400 వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. వీటి గరిష్ఠ వేగం గంటకు 160-180 కి.మీ. 52 సెకన్లలో 100 కిమీ వేగాన్ని అందుకోవడం వీటి ప్రత్యేకత. ఆటోమెటిక్ డోర్లు ఉంటాయి. సీట్లు సౌకర్యవంతంగా, కావాల్సినవైపు తిప్పుకునేలా ఉంటాయి. ప్రస్తుతం శతాబ్ది రైళ్ల తరహాలో కూర్చుని మాత్రమే ప్రయాణించే కోచ్లతో ఈ రైళ్లు నడుస్తున్నాయి. స్లీపర్ బెర్తులతో వందేభారత్ కోచ్లను సైతం తయారుచేస్తున్నట్లు రైల్వేవర్గాలు చెబుతున్నాయి.
* హైదరాబాద్-విశాఖపట్నం, హైదరాబాద్-తిరుపతి, హైదరాబాద్-బెంగళూరు మార్గాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేళపెట్టాలని, తొలుత ఏదో ఒక మార్గంలో ఒక రైలును ప్రారంభించాలని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇటీవల కోరారు.
దేశవ్యాప్తంగా 25 రాజధాని రైళ్లు తిరుగుతుంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కటే ఉంది. సికింద్రాబాద్ నుంచి దిల్లీకి వెళ్లే ఈ రైలు తిరిగేది వారానికి ఒక్క రోజు మాత్రమే. శతాబ్ది రైళ్లు 60 ఉంటే ద.మ.రైల్వేకి ఒక్కటి కూడా లేదు. పుణె - సికింద్రాబాద్ మధ్య ఒక రైలు తిరుగుతున్నా అది సెంట్రల్ జోన్ రైలు.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు. -
భూసార పరీక్ష కేంద్రాల పునరుద్ధరణ
రాష్ట్రంలో మూతపడిన 25 భూసార పరీక్ష కేంద్రాలను పునరుద్ధరించాలని, నేల పోషక విలువలు, ఆరోగ్య సమాచార సేవలను రైతులకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
శ్రీరాముడి పట్టాభిషేకం.. పులకించిన భక్తజనం
శ్రీరాముడి మహాపట్టాభిషేక మహోత్సవంతో భద్రగిరి దివ్యక్షేత్రం గురువారం పులకించింది. సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు సీతమ్మతో కలిసి భక్తకోటికి రాజాధిరాజుగా సాక్షాత్కరించాడు. -
కృష్ణా జలాల విడుదలకు కేఆర్ఎంబీ ఉత్తర్వులు
కృష్ణా జలాల విడుదలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. మే నెలాఖరు వరకు నాగార్జునసాగర్ నుంచి రెండు రాష్ట్రాలు 14 టీఎంసీలు వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. -
‘గ్రేటర్’ విద్యుత్ డిమాండ్!
హడలెత్తిస్తున్న ఎండలు.. భరించలేని ఉక్కపోతతో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ వినియోగం అమాంతం పెరుగుతోంది. -
అభిషేక్ బోయిన్పల్లి మధ్యంతర బెయిల్ మే 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్ వ్యాపారి అభిషేక్ బోయిన్పల్లికి ఈనెల 29వ తేదీ వరకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మే 8 వరకు పొడిగించింది.
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు