TS Half day Schools: 15 నుంచి ఒంటిపూట బడులు!.. ఇంకా వెలువడని ఉత్తర్వులు

రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే బుధవారం నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలలు ఒంటిపూట నడవనున్నాయి.

Updated : 11 Mar 2023 07:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే బుధవారం నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలలు ఒంటిపూట నడవనున్నాయి. ఇప్పటివరకు విద్యాశాఖ దానిపై ఉత్తర్వులు జారీ చేయకపోయినా ప్రతి విద్యా సంవత్సరం మార్చి 15 నుంచే ఒంటిపూట బడులు నడుస్తాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. త్వరలో అందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నాయి. ఒంటిపూటపై గత ఏడాది మార్చి 14న విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అన్ని పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పనిచేస్తాయి. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నందున ఒంటిపూట బడుల నేపథ్యంలో ఎలా జరపాలన్న సందిగ్ధత ఉపాధ్యాయుల్లో నెలకొని ఉంది. దానిపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు సాయంత్రం వేళ అల్పాహారం కూడా ఇస్తున్నందున విద్యాశాఖ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని