YS Sharmila: ఏడేళ్లుగా కేసీఆర్ ఆడిందే ఆట
‘‘ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, కుటుంబ సంక్షేమం చూసి మురిసిపోతున్న కేసీఆర్ పాలనను అంతం చేయడానికే ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపట్టా. రూ.లక్షల కోట్లు అప్పులు తెచ్చి సొంత జేబులు నింపుకొంటున్నారు. నిరుద్యోగుల ఆశలు చిదిమేసి వారిని ఆత్మహత్యల దిశగా పురిగొల్పుతున్నారు.
తెలంగాణలో సమస్యలు లేవని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా
చేవెళ్ల సభలో వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యలు
ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభం
ఈనాడు, హైదరాబాద్: ‘‘ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, కుటుంబ సంక్షేమం చూసి మురిసిపోతున్న కేసీఆర్ పాలనను అంతం చేయడానికే ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపట్టా. రూ.లక్షల కోట్లు అప్పులు తెచ్చి సొంత జేబులు నింపుకొంటున్నారు. నిరుద్యోగుల ఆశలు చిదిమేసి వారిని ఆత్మహత్యల దిశగా పురిగొల్పుతున్నారు. ఈ విధంగా సాగుతున్న కేసీఆర్ కుటుంబ పాలనను సమాప్తం చేయడానికే పాదయాత్ర చేస్తున్నా’’ అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్య్ఖక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం పేరిట బుధవారం చేవెళ్ల నుంచి ఆమె చేపట్టిన పాదయాత్రను తల్లి విజయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. ‘‘సరిగ్గా 18 ఏళ్ల కిందట సంక్షేమ పాలనకు పునాదులు వేసేలా వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగింది. నా పాదయాత్రతో ప్రతి ఇంటి తలుపు తట్టి, కష్టాలు విని.. వాటిని తీర్చేలా పోరాటాలు చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ప్రతిపక్షాల చేతకానితనాన్ని నిలదీస్తాం. వైఎస్ సంక్షేమ పాలనను తిరిగి తెస్తాం. సంక్షేమం, సమానత్వం, స్వయం సమృద్ధి.. మన పార్టీ లక్ష్యాలు’’ అని వివరించారు.
భాజపాను గంగలో ముంచుతా..కాంగ్రెస్ను చీల్చి చెండాడుతా..
‘‘ఈ ఏడేళ్లలో కేసీఆర్ను ప్రశ్నించే వారు లేరు కనుకే ఆయన ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. దమ్ముంటే నాతోపాటు మీరూ(కేసీఆర్) పాదయాత్రకు రండి. సమస్యలు లేవు, పాలన అద్భుతమంటున్నారు కదా! నిజంగానే సమస్యలు లేవని నిరూపిస్తే నా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి ఇంటికి వెళ్లిపోతా. ఒకవేళ సమస్యలు ఉంటే మీరు రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారా? మీ పాలన మీద నమ్మకం ఉంటే నా సవాల్ను స్వీకరించాలి. మీరు దేశంలో అధ్వానమైన సీఎం అని తాజాగా ఓ సర్వేలో తేలింది. మీకు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న ఆలోచన లేదు. మీరు సీఎం అయ్యాక 300 శాతం మద్యం అమ్మకాలు పెరిగితే.. అదే స్థాయిలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయి. మీ పాలనలో ఆరేళ్ల పసిపాపకూ రక్షణ లేదంటే ఏమనుకోవాలి’’ అని షర్మిల ప్రశ్నించారు. ‘‘కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న భాజపాను గంగలో ముంచడానికి.. కేసీఆర్కు అమ్ముడుపోయి తెరాసకు వంత పాడుతున్న కాంగ్రెస్ను చీల్చి చెండాడటానికే యాత్ర చేపట్టా. రేవంత్రెడ్డి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ. ఆయనకు విశ్వసనీయత ఉందో.. మాకు ఉందో ప్రజలే తేలుస్తారు’’ అని షర్మిల ధ్వజమెత్తారు.
మీ ఇజ్జత్ కాపాడే అస్త్రం షర్మిల: విజయమ్మ
వైఎస్ ఆశయాల సాధన కోసమే షర్మిల ప్రజల వద్దకు వస్తోందని విజయమ్మ అన్నారు. గతంలో ఆమె 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎన్నో కష్టాలు పడిందని అన్నారు. మీ ఇజ్జత్ కాపాడే అస్త్రంగా షర్మిలమ్మ వస్తోందన్నారు. కార్యక్రమంలో షర్మిల భర్త బ్రదర్ అనిల్కుమార్, వైతెపా ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, అధికార ప్రతినిధులు తూడి దేవేందర్రెడ్డి, పిట్టం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు చేవెళ్ల పట్టణంలో ప్రారంభమైన యాత్ర.. దాదాపు తొమ్మిది కిలోమీటర్లు సాగింది. రాత్రి కందవాడ-నక్కలపల్లి మధ్యలో బస చేశారు. గురువారం నక్కలపల్లి నుంచి శంషాబాద్ మండలం కాచారంలోని వర్ధమాన్ కాలేజీ వరకు సాగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.