మెట్రో రైలులో.. కోతి చేష్టలు
దిల్లీలో ఓ కోతికి రైలులో ప్రయాణించాలనే కోరిక కలిగినట్టుంది. వెంటనే అది మెట్రో రైలులో ప్రత్యక్షమైంది. అయితే అది ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందీ కలిగించలేదు.
దిల్లీ: దిల్లీలో ఓ కోతికి రైలులో ప్రయాణించాలనే కోరిక కలిగినట్టుంది. వెంటనే అది మెట్రో రైలులో ప్రత్యక్షమైంది. అయితే అది ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందీ కలిగించలేదు. అటూ ఇటూ తిరుగుతూ.. తన చేష్టలతో ప్రయాణికులకు కొంత సేపు వినోదాన్ని పంచింది. తర్వాత సీటుపై ఓ ప్రయాణికుడి పక్కనే కూర్చొని రైలు అద్దాల్లోంచి ఎంచక్కా రాజధాని అందాలను చూస్తూ ప్రయాణించింది. కోతి మెట్రో రైలులో ప్రయాణిస్తుండగా వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. అది వైరల్గా మారింది. వీడియోలో వినిపిస్తున్న ప్రయాణికుడి మాటల ద్వారా ఆ రైలు యమునా తీరం నుంచి ఐసీ స్టేషన్ మధ్యలో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోను చూసి దిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్(డీఎమ్ఆర్సీ)అధికారులు స్పందించారు. ట్విటర్లో షేర్ చేసిన ఆ వీడియోకు ప్రతిస్పందనగా.. కోతి ప్రయాణించిన బోగీ వివరాలు ఇవ్వాలంటూ కోరారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నారాయణమూర్తి మనవడి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ