వధువును భుజానికెత్తి నది దాటించిన వరుడు

పెళ్లి సందర్భంగా వధూవరుల మధ్య సరదా సంఘటనలు జరగడం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా వధూవరులను

Published : 30 Jun 2021 22:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెళ్లి సందర్భంగా వధూవరుల మధ్య సరదా సంఘటనలు జరగడం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా వధూవరులను బంధువులు ఆటపట్టిస్తూ నవ్వులు పూయిస్తారు. అయితే బిహార్‌లోని కిషన్‌గంజ్‌లో ఓ వరుడు చేసిన పని బంధువుల నవ్వులకు కారణమైంది. కిషన్ గంజ్‌లో ఓ పెళ్లి బృందం పడవలో  నది దాటుతూ ఉండగా వరద ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. దాంతో పడవ ముందుకు కదలలేదు. అందరూ దిగి నడుచు కుంటూ వెళుతుండగా, వధువు ఇబ్బంది పడింది. అది గమనించిన వరుడు ఆమెను ఒక్కసారిగా భుజాలపై మోసుకుంటూ నది దాటించాడు. పెళ్లి కుమారుడి చర్యకు వధువు కాసేపు ఆశ్చర్యపోయినా, సిగ్గు పడుతూనే నది దాటింది. ఈ సన్నివేశాన్ని చూసి బంధువులు కాసేపు నవ్వుకున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని