వైరల్‌: ఉమ్ముతూ రోటీలు.. వ్యక్తి అరెస్ట్‌!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో వంటగాడు హేయమైన చర్యకు పాల్పడ్డాడు. నలుగురు తినాల్సిన రోటీలపై ఉమ్మివేసి తయారుచేశాడు. ఇది కాస్త అక్కడున్న ఓ వ్యక్తి రహస్యంగా చిత్రీకరించి సామాజి...

Published : 22 Feb 2021 16:48 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో వంటగాడు హేయమైన చర్యకు పాల్పడ్డాడు. నలుగురు తినాల్సిన రోటీలపై ఉమ్మివేసి తయారుచేశాడు. ఇది కాస్త అక్కడున్న ఓ వ్యక్తి రహస్యంగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అది నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని సొహైల్‌గా గుర్తించారు. అయితే, ఈ ఘటనపై హిందూ జాగరణ్‌ మంచ్‌ సభ్యులు మేరఠ్‌లోని ఎల్‌ఎల్‌ఆర్‌ఎం పోలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. విందు వేడుకల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆ సంఘం అధ్యక్షుడు సచిన్‌ సిరోహి డిమాండ్‌ చేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని